అంగన్వాడీ పాలు.. అంతటా లోపాలు!
అరకు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గత మూడు నెలలుగా పాల సరఫరా నిలిచిపోయింది. ఇటీవల పాల ప్యాకెట్లు అందించారు. అవి కూడా మే 13తో వినియోగానికి గడువు ముగిసినవి సరఫరా చేశారు.
పాలప్యాకెట్లు
ఈనాడు డిజిటల్, పాడేరు - న్యూస్టుడే, అరకులోయ, అనకాపల్లి పట్టణం, పాడేరు పట్టణం : అరకు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గత మూడు నెలలుగా పాల సరఫరా నిలిచిపోయింది. ఇటీవల పాల ప్యాకెట్లు అందించారు. అవి కూడా మే 13తో వినియోగానికి గడువు ముగిసినవి సరఫరా చేశారు. వీటిని అంగన్వాడీ కార్యకర్తలు వెంటనే గుర్తించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అవి చిన్నారులు తాగితే తీవ్ర ఇబ్బందులే తలెత్తేవి..
* అనకాపల్లిలో చాకలిపేట1, లోకవారివీధి, తాకాశివీధి కేంద్రాలకు పాలు అరకొరగా సరఫరా అవుతున్నాయి. మార్చిలో ఈ సెంటర్లకు అస్సలు సరఫరా కాలేదు. ఫిబ్రవరిలో ఉన్న పాలను సర్దుబాటు చేశారు. గత నెలలో 16 నుంచి 30వ తేదీ వరకు అందించలేదు. మాకవరపాలెం మండలంలో అంగన్వాడీ కేంద్రాలకు రెండు నెలలుగా సరఫరా ఆగిపోయింది.
* మునగపాకలోని ఎనిమిదో నంబర్ అంగన్వాడీ కేంద్రంలో 16 మంది గర్భిణులు.. 48 మంది మూడేళ్లలోపు చిన్నారులు, 13 మంది ప్రీ స్కూల్ పిల్లలున్నారు. ఏప్రిల్లో వీరెవరికీ చుక్క పాలు కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది జనవరి నుంచి పాల సరఫరా సక్రమంగా జరగడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేరుతో పౌష్ఠికాహారం సరఫరా చేస్తున్నామని సర్కారు ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. ఆ పోషకాహారంలో కీలకమైన పాలును మాత్రం సక్రమంగా సరఫరా చేయలేకపోతోంది. గత కొంతకాలంగా వీటి సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఓ కేంద్రానికి ఒకనెలలో అందితే రెండు నెలలు ఇవ్వడం లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు క్రమం తప్పకుండా అందాల్సిన పాల కోసం పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. తల్లిపాల ప్రాధాన్యం గురించి నొక్కి వక్కాణించే అంగన్వాడీ కేంద్రాలు కనీసం ప్యాకెట్ పాలు అందించడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నాయి.
ఇలాగేనా పోషకాహారం అందించేది..?
మాతాశిశు మరణాలకు పోషకాహార లోపమే కారణం. అందుకే ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏటా రూ.కోట్ల ఖర్చుచేస్తున్నాయి. గత మూడేళ్లుగా పాలు సరఫరాలో లోపాలను అధిగమించలేకపోతున్నారు. ఏడాదిలో ఆరు నెలలు పూర్తిగాను.. మిగతా ఆరు నెలలు 50 నుంచి 70 శాతమే పాలను సరఫరా చేస్తున్నారు. ఓ ప్రాజెక్టుకు ఒక నెల సరఫరాచేస్తే మరోనెల వేరే ప్రాజెక్టుకు అందజేస్తున్నారు. చిన్నారులకు రోజుకు 100 ఎం.ఎల్ చొప్పున 25 రోజులకు 2.5 లీటర్లు ఇవ్వాలి. గర్భిణి, బాలింతలకు రోజుకు 200 ఎం.ఎల్ చొప్పున 25 రోజులకు 5 లీటర్ల చొప్పున అందజేయాలి. అరకొరగా సరఫరా అవుతుండటంతో లబ్ధిదారులకు ఇచ్చే పరిమాణంలో కోతపెడుతున్నారు. కొన్నిచోట్ల పిల్లలకు బియ్యం, పప్పు, గుడ్లతోనే భోజనం పెడుతున్నారు.
ఏప్రిల్లో ఇవ్వలేదు
కేంద్రాలకు పాలు సక్రమంగా వస్తే మాకు అందుతున్నాయి. లేకుంటే ఆ నెల ఇవ్వడం లేదు. మొన్న నాలుగో నెలలో ప్రభుత్వం పాలు సరఫరా చేయలేదని మాకు ఇవ్వడం ఆపేశారు. గుడ్లు, పప్పులైతే ఇస్తున్నారు.. పాలు క్రమం తప్పకుండా ఇస్తేనే మేలు.
కట్టా సంతోషి కుమారి. మునగపాక
నెల తప్పించి నెల ఇస్తున్నారు..
పాలు ప్రతినెలా ఇవ్వడం లేదు. ఒక నెల ఇస్తే మరుసటి నెల ఇవ్వడం లేదు. రోజూ బయట కొనుక్కొని తాగే స్థోమత మాలాంటి వారికి ఉంటుందా?, ప్రభుత్వం సక్రమంగా పాలు సరఫరా చేయాలి. ఏజెన్సీలో పౌషకాహార లోపం ఎక్కువ ఉంటుంది. ఇక్కడే అంగన్వాడీ కేంద్రాలకే పాలు ఇవ్వకపోతే ఎలా?
కిడారి లలిత కుమారి, పాడేరు
ఒక్కోసారి ఇవ్వడం లేదు.
బాలింతలకు రోజూ పాలు ఇవ్వాల్సి ఉండగా మే నెలలో 15 రోజుల పాటు పాలు ఇవ్వలేదు. మార్చిలో ఇదే పరిస్థితి. ఫిబ్రవరిలో వచ్చిన వాటిని మార్చిలో కొన్నిరోజుల పాటు సర్దుబాటు చేశారు. నెలలో ఒక్కోసారి సరఫరా లేదని ఇవ్వడం మానేస్తున్నారు. సక్రమంగా అందించేలా చర్యలు తీసుకోవాలి.
స్నేహ, బాలింత, అనకాపల్లి
ఉన్నతాధికారులు పరిష్కరిస్తారు..
పాల సరఫరా కొంత తగ్గింది. అవకాశాన్ని బట్టి అన్ని కేంద్రాలకు అందేలా చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాజెక్టులకు సర్దుబాటు చేయడానికి వీలు కావడంలేదు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం. పాల సరఫరాలో సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. కాలం చెల్లిన ప్యాకెట్ల సరఫరా గురించి ఎక్కడా ఫిర్యాదులు లేవు. సాధారణంగా వేసవిలో దిగుబడి తక్కువగా ఉండడం కూడా ఈ సమస్యకు కారణం.
ఉషారాణి, పీడీ, ఐసీడీఏస్, అనకాపల్లి
అంగన్వాడీ కేంద్రంలో బుడతలకు పౌష్ఠికాహారం
ఉమ్మడి జిల్లాలో ఐసీడీఎస్ ముఖచిత్రం ఇదీ
ఐసీడీఎస్ ప్రాజెక్టులు : 25
అంగన్వాడీ కేంద్రాలు : 4,952
నెలకు సరఫరా చేయాల్సిన పాలు : 11.71 లక్షల లీటర్లు
నెలకు సగటున ఇస్తున్నది : 5 నుంచి 6 లక్షల లీటర్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికలనాటి ప్రేమ ఇప్పుడేమైంది..!
[ 21-05-2024]
వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అభివృద్ధి పనుల జోలికే పోని నేతలు ఎన్నికల ముందు హడావిడి పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చేస్తామని, రహదారులను బాగుచేస్తామని, పట్టణాలను సుందరీకరిస్తామని, సెంట్రల్ లైటింగ్తో వెలుగులు నింపుతామని ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి ఓటర్లకు గాలం వేశారు. -
కరకలో తవ్వకాలపై కన్నెర్ర
[ 21-05-2024]
అత్యంత విలువైన వైఢూర్యాలు (అలెక్స్ రకం రంగురాళ్లు) లభించే గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీ చుట్టూరా గస్తీ పటిష్ఠం చేశారు. -
అప్రకటిత కోతలు.. అదనపు వాతలు
[ 21-05-2024]
ఎండలు మండిపోతే లోడ్ రిలీఫ్ పేరుతో కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు.. వర్షం కురిసినా.. గాలి వీచినా అంతకంటే వేగంగా విద్యుత్తు సరఫరా ఆపేస్తున్నారు. -
చంద్రబాబు సీఎం కావడం ఖాయం
[ 21-05-2024]
రాబోయేది కూటమి ప్రభుత్వమేనని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై చర్యలు
[ 21-05-2024]
అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ విజయసునీత హెచ్చరించారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 21-05-2024]
రంపచోడవరంలో ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత పేర్కొన్నారు. -
ఈవీఎంల భద్రతలో అప్రమత్తం
[ 21-05-2024]
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా, రిటర్నింగ్ అధికారులు వి.అభిషేక్, భావన తెలిపారు. -
ఐటీఐ శిక్షణతో ఉపాధి అవకాశాలు
[ 21-05-2024]
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అర్హత ఒక్కటే సరిపోదు. -
అరకు పర్యటకానికి కొత్తరూపు
[ 21-05-2024]
ఆంధ్రాఊటీ అరకులోయలో ఐదు యూనిట్ల పరిధిలోని పర్యటకశాఖ అతిథిగృహాల మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
[ 21-05-2024]
వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులతోపాటు బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని రంపచోడవరం సీఐ వాసా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. -
మూడు రోజులు.. 112 కిలోల చందనం
[ 21-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో సోమవారం మూడవ రోజు చందనం అరగదీత కార్యక్రమం కొనసాగింది. -
తెలంగాణ ఈసెట్లో విద్యార్థి సత్తా
[ 21-05-2024]
పరవాడ మండలం వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి దళాయిపాలెం గ్రామానికి చెందిన ఆలవెల్లి ఖ్యాతీశ్వర్ సోమవారం విడుదలైన తెలంగాణ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్) మెటలర్జికల్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. -
24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
[ 21-05-2024]
జిల్లాలో ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఏడు కేంద్రాల్లో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి పి.బ్రహ్మాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్