పంట నమోదులో అక్రమాలపై విచారణ జరిపించండి
తప్పుడు సర్వే నంబర్లతో ఈ రాష్ట్రంలో లేని వారు ఇక్కడ భూములు సాగు చేస్తున్నట్లు అధికారులు నమోదు చేశారని, విచారణ జరిపించాలని సబ్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనాను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు.
సబ్ కలెక్టర్కు వివరాలు తెలియజేస్తున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్
తెనాలి టౌన్, న్యూస్టుడే: తప్పుడు సర్వే నంబర్లతో ఈ రాష్ట్రంలో లేని వారు ఇక్కడ భూములు సాగు చేస్తున్నట్లు అధికారులు నమోదు చేశారని, విచారణ జరిపించాలని సబ్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనాను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆమెకు సమగ్ర వివరాలతో కూడిన పత్రాలను అందించారు. తెనాలి సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం రాత్రి ఆయన మాట్లాడుతూ ఇది రాష్ట్రంలో జరిగిన మరో అతి పెద్ద కుంభకోణమని అనుమానం వ్యక్తం చేశారు. గతేడాది వివరాలు పరిశీలిస్తే అవి కూడా ఇలాగే ఉన్నాయని, అనేక గ్రామాల్లో 55 శాతం మంది అసలు రైతుల పేర్లు ఉండగా మిగిలిన 45 శాతం మందికి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఆన్లైన్ చేశారన్నారు. బీమా, పంట నష్టపరిహారం వంటివన్నీ ఈ వివరాలను అనుసరించే జరుగుతున్న క్రమంలో లోతుగా విచారణ జరిగితే మరిన్ని లోపాలు బయటపడే అవకాశం ఉందన్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ పేరిట ప్రభుత్వం పేద ప్రజలను బెదిరించి వసూళ్లకు పాల్పడుతోందని, ఇది సరికాదన్నారు. ఆయన వెంట తెదేపా నాయకులు, రైతులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!