విద్యార్థులకు పరీక్షే!
ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. మరో రెండు రోజులే ఉన్నా నేటికీ చాలా బడుల్లో సరైన సౌకర్యాలు లేవు. స్వేచ్ఛగా.. ప్రశాంతంగా పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు అడుగడుగునా సమస్యలే ఎదురుకానున్నాయి.
కేంద్రాల్లో నాడు-నేడు పనుల నిర్మాణ సామగ్రి
చాలీచాలని ఫ్యాన్లు
తప్పని తాగునీటి ఇబ్బందులు
ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. మరో రెండు రోజులే ఉన్నా నేటికీ చాలా బడుల్లో సరైన సౌకర్యాలు లేవు. స్వేచ్ఛగా.. ప్రశాంతంగా పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు అడుగడుగునా సమస్యలే ఎదురుకానున్నాయి. చివరకు కేంద్రాల్లోకి వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సిందే. నాడు-నేడు పనులు జరిగే వాటిని కూడా కేంద్రాలుగా ఎంపిక చేసినా నిర్మాణ సామగ్రిని బడి ఆవరణలోనే నిల్వ చేయడం గమనార్హం. వీటిని దాటుకుంటూనే గదిలోకి చేరాలి. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలంటే ఫ్యాన్లు తప్పనిసరి. కొన్ని కేంద్రాల్లో సక్రమంగా లేవు. మరికొన్ని చోట్ల తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ విద్యార్థులకు పరీక్షలు పెట్టనున్నాయి. అధికారులు స్పందిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి.
విద్యుత్తు కనెక్షన్ లేక..
వెదురుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో 140 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పాఠశాలలో నాడు-నేడు పనులు సాగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి ఇసుక, కంకర, ఇటుకలు పాఠశాల ఆవరణలో ఉంచారు. గదుల్లో ఫ్యాన్లు ఉన్నా విద్యుత్తు కనెక్షన్ లేకపోవడంతో పనిచేయడం లేదు. ఫలితంగా విద్యార్థులు అసౌకర్యాల నడుమ పరీక్షలు రాయాల్సి ఉంది.
న్యూస్టుడే, పెనుమూరు
రాళ్లతోనే ఇబ్బందులు
మండలంలోని కొలమాసనపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 72 మంది పరీక్షలు రాస్తారు. నెల్లిపట్ల, నక్కపల్లె గ్రామాల విద్యార్థులు కూడా ఇక్కడే రాయాలి. సరిపడా గదులున్నా ఆవరణలో అసంపూర్తి నిర్మాణాల కారణంగా ఉన్న మట్టి, కంకరతో ఇబ్బంది తప్పదు. చిన్న చిన్న రాళ్లు కాళ్లకు తగులుకుని అవస్థలు పడుతుంటారు. పరీక్షల కోసం 6 గదులను ఎంపిక చేశారు. అందులో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. నీటి వసతి కూడా ఉంది.
న్యూస్టుడే, పలమనేరు
కొనసాగుతున్న పనులు
పుంగనూరు బీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కింది అంతస్తులో పరీక్షలు రాయాల్సి ఉండగా పైన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 240 మంది పరీక్షలు రాస్తున్నారు. నిర్మాణ పనులు ఆపకుంటే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశముంది.
న్యూస్టుడే, పుంగనూరు
చాలీచాలని ఫ్యాన్లు
శాంతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 200 మంది వరకు రాస్తారు. తరగతి గదుల్లో ఒక్కో ఫ్యాన్ మాత్రమే ఉంది. అవి కూడా ఉపాధ్యాయుల బోధన.. బోర్డులకు సమీపంలోనే ఉన్నాయి. విద్యార్థులు ఉక్కపోత నడుమ పరీక్షలు రాయాల్సిన ‘దు’స్థితి ఏర్పడనుంది. నాడు- నేడు ద్వారా చేపట్టిన మరుగుదొడ్ల మరమ్మతులు పూర్తి కాలేదు. కొత్తవాటి నిర్మాణం పునాది దశలో ఆగిపోయింది. బాలురకు రెండు, బాలికలకు రెండు వంతున మాత్రమే మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి.
న్యూస్టుడే, కుప్పం
బడి ఆవరణలో ఇసుక, ఇటుకలు
మండలంలోని పోలవరం పరీక్ష కేంద్రంలో 56 మంది పరీక్షలు రాయనున్నారు. బడి ఆవరణలో ఇసుక, ఇటుకలు, కంకర, గ్రానైట్ బండలు దర్శనమిస్తున్నాయి. తరగతి గదుల్లో సిమెంటు బస్తాలు ఉంచారు. దీనిపై ఎంఈవో కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
న్యూస్టుడే, పూతలపట్టు (ఐరాల)
పకడ్బందీ ఏర్పాట్లు
విద్యార్థులకు డెస్క్లు ఏర్పాటు చేశాం. తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాం. విద్యార్థులు అరగంట ముందుగానే చేరుకోవాలి. ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
విజయేంద్రరావు, డీఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రైతు భరోసా.. సేవల్లో నిరాశ
[ 20-05-2024]
చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండదనే విషయం వైకాపా పాలన ప్రారంభంలోనే రైతులకు అర్థమైపోయింది.. ఆర్బీకేల ద్వారా సాగు సలహాలు, సేవలందకపోయినా అన్ని రకాల ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేకపోయినా.. ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉత్పత్తుల రక్షణకు ముఖం చాటేసినా పంటి బిగువున భరించారు.. నష్టాలు చూడని రైతులు లేరు.. -
దూరవిద్య.. అనుమతులు అక్కర్లేదా?
[ 20-05-2024]
ఎస్వీయూకు ఉన్న 70 ఏళ్ల చరిత్ర ఆధారంగా దేశవ్యాప్తంగా.. ఎస్వీయూ దూరవిద్యా కేంద్రానికి ఉన్న గుర్తింపు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ వర్సిటీకీ లేదు. ఎస్వీయూ పరిధిలో సాధారణ ప్రవేశాలతో పోల్చితే దూరవిద్యా కేంద్రం ప్రవేశాలు ఎక్కువగానే ఉంటాయి. -
ఇవేం పనులు రాజశేఖరా..?
[ 20-05-2024]
-
విచారణ తొక్కిపెట్టేసి..
[ 20-05-2024]
జడ్పీలో నిధుల దుర్వినియోగంపై లోకాయుక్త ఆదేశాలతో చేపట్టాల్సిన విచారణను ఆ కార్యాలయ పూర్వ అధికారి నిర్వాకంతో నెలలతరబడి నిలిచిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. -
ఎర్రమట్టి కొల్లగొట్టి..కోట్లకు పడగలెత్తి
[ 20-05-2024]
ముఖ్యనాయకుడు.. ఇద్దరు అనుచరులు.. ఇక అడ్డేముంది.. కొండలు కరిగిపోయాయి. వందలాది టన్నుల ఎర్రమట్టి తరలిపోయింది.. ఆదాయంలో ముఖ్యనేతకు వాటా అందడంతో పూర్తి సహకారం అందించారు. ఇలా ఐదేళ్లలో ఆ ఇద్దరు నాయకులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. -
సీబీఎస్ఈ.. పాఠం బోధపడేనా?
[ 20-05-2024]
అ..ఆలు చదవలేని పరిస్థితి మన ప్రభుత్వ బడుల్లో నెలకొందని ఇటీవల ఆసర్ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం సీబీఎస్ఈ, ఐబీ, బైజూస్ కంటెంట్ అంటూ గందరగోళం చేస్తోంది. ప్రభుత్వ బడుల్లో గతేడాది సీబీఎస్ఈ పాఠాలు అమలుచేయగా ఈ ఏడాది పదిలో అమలు చేయాలని నిర్ణయించింది. -
ఆడపడుచు ఆరాధనకు వేళాయే..
[ 20-05-2024]
పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం.. దైవ స్వరూపాలు.. జలమంటే గంగమ్మ.. స్వచ్ఛత, నిర్మలత్వ స్వరూపం గంగా దేవి.. ప్రతి ఇంటి ఆడపడుచు గంగమ్మ తల్లి.. చైత్ర మాసంలో గంగమ్మను ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే గంగమ్మ జాతర.. -
కపిలతీర్థంపై కరుణ లేదా?
[ 20-05-2024]
తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలోని ప్రధాన క్షేత్రాల్లో కపిలతీర్థం ఆలయం ఒకటి. ఈ శైవ క్షేత్రాన్ని దర్శించేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు. -
ఏడు గంటలపాటు.. సిట్ విచారణ
[ 20-05-2024]
చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లెలో పోలింగ్ రోజున జరిగిన గొడవలు, ఎన్నికల అనంతరం శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని స్ట్రాంగ్రూమ్ వద్ద జరిగిన దాడుల ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఏర్పాటైన సిట్ బృందం ఆదివారం సుమారు ఏడుగంటలపాటు విచారణ చేపట్టింది. -
ముగిసిన శ్రీపద్మావతి పరిణయోత్సవాలు
[ 20-05-2024]
శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీవారి ఆలయం నుంచి స్వామివారు గరుడ వాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. -
‘దళితుల మధ్య చిచ్చుపెట్టడం మంత్రి పెద్దిరెడ్డికి తగదు’
[ 20-05-2024]
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు పెట్టడం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తగదని మండల పరిధిలోని భీమునిచెరువు దళితవాడకు చెందిన సర్పంచి మురుగేశం, గ్రామంలోని యువకులు ఆరోపించారు. -
గమ్యం చేరేలోగా మృత్యుఒడికి..
[ 20-05-2024]
ఉద్యోగోన్నతిపై ఉత్తరాఖండ్ వెళ్తూ పెనుమూరు మండలం గుంటిపల్లె పంచాయతీ కనికాపురం గ్రామానికి(చిత్తూరు సమీప మురకంబట్టు) చెందిన సైనికుడు రైలు నుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..