విద్యార్థులకు పరీక్షే!
ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. మరో రెండు రోజులే ఉన్నా నేటికీ చాలా బడుల్లో సరైన సౌకర్యాలు లేవు. స్వేచ్ఛగా.. ప్రశాంతంగా పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు అడుగడుగునా సమస్యలే ఎదురుకానున్నాయి.
కేంద్రాల్లో నాడు-నేడు పనుల నిర్మాణ సామగ్రి
చాలీచాలని ఫ్యాన్లు
తప్పని తాగునీటి ఇబ్బందులు
ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. మరో రెండు రోజులే ఉన్నా నేటికీ చాలా బడుల్లో సరైన సౌకర్యాలు లేవు. స్వేచ్ఛగా.. ప్రశాంతంగా పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు అడుగడుగునా సమస్యలే ఎదురుకానున్నాయి. చివరకు కేంద్రాల్లోకి వెళ్లాలన్నా ఇబ్బందులు పడాల్సిందే. నాడు-నేడు పనులు జరిగే వాటిని కూడా కేంద్రాలుగా ఎంపిక చేసినా నిర్మాణ సామగ్రిని బడి ఆవరణలోనే నిల్వ చేయడం గమనార్హం. వీటిని దాటుకుంటూనే గదిలోకి చేరాలి. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలంటే ఫ్యాన్లు తప్పనిసరి. కొన్ని కేంద్రాల్లో సక్రమంగా లేవు. మరికొన్ని చోట్ల తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ విద్యార్థులకు పరీక్షలు పెట్టనున్నాయి. అధికారులు స్పందిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి.
విద్యుత్తు కనెక్షన్ లేక..
వెదురుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో 140 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పాఠశాలలో నాడు-నేడు పనులు సాగుతున్నాయి. ఈ పనులకు సంబంధించి ఇసుక, కంకర, ఇటుకలు పాఠశాల ఆవరణలో ఉంచారు. గదుల్లో ఫ్యాన్లు ఉన్నా విద్యుత్తు కనెక్షన్ లేకపోవడంతో పనిచేయడం లేదు. ఫలితంగా విద్యార్థులు అసౌకర్యాల నడుమ పరీక్షలు రాయాల్సి ఉంది.
న్యూస్టుడే, పెనుమూరు
రాళ్లతోనే ఇబ్బందులు
మండలంలోని కొలమాసనపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 72 మంది పరీక్షలు రాస్తారు. నెల్లిపట్ల, నక్కపల్లె గ్రామాల విద్యార్థులు కూడా ఇక్కడే రాయాలి. సరిపడా గదులున్నా ఆవరణలో అసంపూర్తి నిర్మాణాల కారణంగా ఉన్న మట్టి, కంకరతో ఇబ్బంది తప్పదు. చిన్న చిన్న రాళ్లు కాళ్లకు తగులుకుని అవస్థలు పడుతుంటారు. పరీక్షల కోసం 6 గదులను ఎంపిక చేశారు. అందులో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. నీటి వసతి కూడా ఉంది.
న్యూస్టుడే, పలమనేరు
కొనసాగుతున్న పనులు
పుంగనూరు బీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కింది అంతస్తులో పరీక్షలు రాయాల్సి ఉండగా పైన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 240 మంది పరీక్షలు రాస్తున్నారు. నిర్మాణ పనులు ఆపకుంటే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశముంది.
న్యూస్టుడే, పుంగనూరు
చాలీచాలని ఫ్యాన్లు
శాంతిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 200 మంది వరకు రాస్తారు. తరగతి గదుల్లో ఒక్కో ఫ్యాన్ మాత్రమే ఉంది. అవి కూడా ఉపాధ్యాయుల బోధన.. బోర్డులకు సమీపంలోనే ఉన్నాయి. విద్యార్థులు ఉక్కపోత నడుమ పరీక్షలు రాయాల్సిన ‘దు’స్థితి ఏర్పడనుంది. నాడు- నేడు ద్వారా చేపట్టిన మరుగుదొడ్ల మరమ్మతులు పూర్తి కాలేదు. కొత్తవాటి నిర్మాణం పునాది దశలో ఆగిపోయింది. బాలురకు రెండు, బాలికలకు రెండు వంతున మాత్రమే మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి.
న్యూస్టుడే, కుప్పం
బడి ఆవరణలో ఇసుక, ఇటుకలు
మండలంలోని పోలవరం పరీక్ష కేంద్రంలో 56 మంది పరీక్షలు రాయనున్నారు. బడి ఆవరణలో ఇసుక, ఇటుకలు, కంకర, గ్రానైట్ బండలు దర్శనమిస్తున్నాయి. తరగతి గదుల్లో సిమెంటు బస్తాలు ఉంచారు. దీనిపై ఎంఈవో కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
న్యూస్టుడే, పూతలపట్టు (ఐరాల)
పకడ్బందీ ఏర్పాట్లు
విద్యార్థులకు డెస్క్లు ఏర్పాటు చేశాం. తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాం. విద్యార్థులు అరగంట ముందుగానే చేరుకోవాలి. ఎక్కడైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
విజయేంద్రరావు, డీఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు కౌంట్డౌన్ మొదలైంది: ప్రధాని మోదీ
[ 08-05-2024]
ఆంధ్రప్రదేశ్ వికాసమే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. -
మార్కెట్ యార్డు గేట్లు మూసివేసి రైతుల ఆందోళన
[ 08-05-2024]
మదనపల్లెలో లారీ అసోసియేషన్, టమాటా వ్యాపారస్థులకు మధ్య వివాదం నెలకొంది. -
డబుల్ ఇంజిన్లా దూసుకెళ్తాం
[ 08-05-2024]
‘కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతోంది.. జగన్ మేనిఫెస్టో ఎత్తిపోయింది.. ఆ పార్టీకి డిపాజిట్లు రావు.. కేంద్రంలో మోదీ గ్యారెంటీ ఉంది.. ఇక్కడ ప్రజాగళం మేనిఫెస్టో, సూపర్-6లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. -
హలో పుంగనూరు.. బైబై పాపాల పెద్దిరెడ్డి
[ 08-05-2024]
‘పుంగనూరు ప్రజలకు ఈరోజే స్వాతంత్య్రం వచ్చింది. రేపటి నుంచి అంతా మంచి రోజులే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిడిసిపడుతున్నారు. నియోజకవర్గంలో శివశక్తి డెయిరీ కాకుండా వేరే డెయిరీ పోతుందా? అదే మా ఊళ్లో (నారావారిపల్లె)లో అన్ని డెయిరీలు పోతున్నాయి. -
వైకాపా దోచుకుంది.. తెదేపాకు మద్దతివ్వండి
[ 08-05-2024]
వైకాపా ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
దమనకాండ.. జగన్ అండదండ
[ 08-05-2024]
ఏమున్నది గర్వకారణం.. వైకాపా పాలన సమస్తం.. పరపీడన పరాయణత్వం అన్నట్లు సాగింది ఈ ఐదేళ్లు. జిల్లాలో లెక్కలేనన్ని అరాచకాలకు తెగబడ్డారు. ప్రతిపక్షాలు, సామాన్యులపై దమనకాండకు పాల్పడ్డారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులు చేయించారు. -
అమాత్యుడి అండ.. అవినీతి దందా..!
[ 08-05-2024]
కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతికి అడ్డూ.. అదుపూ లేకుండా పోతోంది. స్థానికంగా అధికార పార్టీ నాయకుడి అండ దండలు పుష్కలంగా ఉండటంతో.. కొందరు అధికారులు, సిబ్బందికి ఆడిందే ఆటగా మారింది. -
ధరణి.. కాజేసే ధోరణి
[ 08-05-2024]
చిత్తూరు నగరం తేనెబండ రెవెన్యూలో తిరుపతి- చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఎకరా భూమి విలువ రూ.3 కోట్లు ఉంది. ఇది తనదంటూ ఒకరు నకిలీ రికార్డులు సృష్టించారు. -
జలంకారప్రాయం
[ 08-05-2024]
కుప్పాన్ని పులివెందులలా చూస్తామని జగన్ వల్లెవేసిన మాటలు.. ఐదేళ్ల పాలనలో ఉద్దరించేశామని స్థానిక నేతల సుద్ధులు, మాటలకు.. చేతలకు పొంతన లేదని.. కుప్పంపై కక్ష సాధిస్తున్నారని ప్రస్ఫుటమవుతోంది. -
‘ఎర్ర చందనం స్మగ్లర్ పేదవాడంట’
[ 08-05-2024]
ఎర్రచందనం స్మగ్లర్, వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి తాను పేదవాడినని చొక్కా విప్పి ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ధ్వజమెత్తారు. -
కవ్వించి.. దాడిచేసి
[ 08-05-2024]
మండల కేంద్రమైన ఐరాలలో మంగళవారం మధ్యాహ్నం వైకాపా, తెదేపా నాయకులు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. -
పెద్దిరెడ్డి 142 ఆస్తుల వివరాలు వెల్లడించలేదు
[ 08-05-2024]
ఎన్నికల అఫిడవిట్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు బహిర్గతం చేయలేదని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపించారు. -
జడ్పీ పూర్వ ఉన్నతాధికారిపై కలెక్టర్ ఆగ్రహం
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించే కేంద్రంలో జడ్పీ పూర్వ ఉన్నతాధికారి ఉండటంపై తెదేపా శ్రేణులు కలెక్టర్ షన్మోహన్కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఓటేసేందుకు వెళ్లారని సచివాలయ సిబ్బందికి వేధింపులు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వెళ్లిన ఏడుగురు సచివాలయ సిబ్బందిని మండల పరిషత్ అధికారులను వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి నేడు ఆఖరు
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అత్యవసర సేవల్లోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేందుకు బుధవారం ఆఖరు గడువు. -
యువకుడిపై బాలుడు కత్తితో దాడి
[ 08-05-2024]
మండల పరిధి బ్రాహ్మణపల్లెకి చెందిన ఓబాలుడు(14) తల్లితో పాటు తిరుపతిలో ఉంటూ జులాయిగా తిరిగేవాడు. స్థానిక ఎస్సీకాలనీకి చెందిన విజయకుమార్(24) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్