జీతమేది జగనన్నా!
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జీతాల కోసం ఈ నెల కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు కేవలం 36 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు పడ్డాయి.
ఉద్యోగుల నిరీక్షణ
తిరుపతి (నగరం), న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జీతాల కోసం ఈ నెల కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు కేవలం 36 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు పడ్డాయి. పెన్షనర్లకు బుధవారం రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా పడలేదు. వారం రోజుల కిత్రం కలెక్టరేట్లో జరిగిన పెన్షనర్ల అదాలత్లో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు కలిసి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని రాష్ట్ర అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ఐదో తేదీ వరకు కూడా చెల్లించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 16 వేల మంది వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉన్నారు. ట్రెజరరీ, అటవీశాఖ, సచివాలయ ఉద్యోగులు, కొందరు ఉపాధ్యాయుల అకౌంట్లకు మాత్రమే జమయ్యాయి. మిగిలిన ఉద్యోగులందరూ నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు వస్తాయి..నెలవారీ ఈఎంఐలు ఎలా చెల్లించాలో తెలియక మదనపడుతున్నారు. శుక్రవారం నుంచి వరసగా మూడు రోజుల పాటు ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో మరో వారం వరకు లేనట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత నెల ఐదో తేదీ లోపు దాదాపు 40 శాతం మందికి పెన్షన్లు పడగా... ఈ నెల ఇప్పటివరకు ఒక్కరికి కూడా పడకపోవడం గమనార్హం.
ఇబ్బంది పడుతున్నాం
-ఎస్.గోపాల్, విశ్రాంత ఉపాధ్యాయుడు, తిరుపతి
ప్రభుత్వ ఉద్యోగి ప్రతి నెల ఒకటో తేదీన జీతం పొందడం హక్కుగా భావిస్తుంటారు. అయితే కొన్ని నెలలుగా సరైన సమయంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. మరో వారం రోజుల వరకు వస్తాయన్న నమ్మకం లేకపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ప్రజా సేవకు అంకితం
[ 14-06-2024]
చదువుకునే రోజుల్లో దేవుడికి మొక్కు చెల్లించుకునేందుకు శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు నడిచి వచ్చే వాళ్లమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. -
పంచ సంతకాలు.. ఘన ప్రయోజనాలు
[ 14-06-2024]
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బాధ్యతలు తీసుకున్న రోజే ఐదు పథకాలపై సంతకాలు చేయడంతో జనం ఉబ్బితబ్బిబవుతున్నారు. -
మోగిన బడి గంట..
[ 14-06-2024]
వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమయ్యాయి. పిల్లల కేరింతలతో పై తరగతుల్లోకి ఆడుగుపెట్టారు. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 14-06-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా గురువారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి కృష్ణతేజ అతిథిగృహం వరకు క్యూలైన్లో వేచిఉన్నారు. -
ఆ సమ్మోహన శక్తి ఎవరు?
[ 14-06-2024]
జడ్పీ పూర్వ సీఈవో ప్రభాకర్రెడ్డి హయాంలో చోటుచేసుకున్న నిధుల దుర్వినియోగం విచారణ వ్యవహారం ఒక్క అడుగు ముందుకు కదల్లేదు.. లోకాయుక్త ఆదేశాలతో విచారణ అధికారిగా నియమితులైన జిల్లా ఆడిట్ అధికారి.. -
ఖరారు కాని టెండర్లు.. తొలగని వ్యర్థాలు
[ 14-06-2024]
స్థానిక మామిడి కాయల మార్కెట్ యార్డు దుర్గంధభరితంగా మారింది. దీంతో వ్యాపారులు, రైతులు, మండీ వ్యాపారులు ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. -
ఇంకో అవకాశం ఇస్తారా..?
[ 14-06-2024]
ఒక్క నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుందంటారు. వైకాపా నాయకుల బెదిరింపులకు భయపడి, బూటకపు హామీల్ని నమ్మి రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు ఈ సామెతను వల్లె వేస్తున్నారు. -
మోకాళ్లపై మెట్లెక్కి.. మొక్కు చెల్లించుకున్న కార్యకర్త
[ 14-06-2024]
ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు, జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా డాక్టర్ థామస్ గెలుపొందాలని మోకాళ్లపై మెట్లు ఎక్కి మొక్కు చెల్లించుకున్నాడు మండలంలోని ఎస్ఆర్ఆర్కండ్రిగ పంచాయతీ వేపకోన గ్రామానికి చెందిన నవీన్ చౌదరి. -
చపాతి కర్రతో మోది తండ్రిని హతమార్చిన కుమార్తె
[ 14-06-2024]
తనకు ఇష్టం లేని వ్యక్తితో వివాహం కుదిర్చారనే ఆగ్రహాంతో కన్న తండ్రిని కుమార్తే దారుణంగా హతమార్చింది. -
బుడిబడి అడుగులు
[ 14-06-2024]
వేసవి సెలవుల అనంతరం జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రభుత్వ, ప్రైవేటు బడుల తలుపులు తెరుచుకున్నాయి. -
యాప్లో సంప్రదింపులు.. ఇతర రాష్ట్రాల నుంచి యువతులు
[ 14-06-2024]
యాప్లో కస్టమర్లతో సంప్రదింపులు.. వేర్వేరు రాష్ట్రాల నుంచి యువతులను అక్రమ రవాణా చేసే ఏజెంట్లు, ఖరీదైన స్టార్ హోటళ్లలో గదుల బుకింగ్.. ఇలా హైటెక్ విధానంలో వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా చేస్తున్న ముఠాను హైదరాబాద్ నగరం పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.