కర్రలు, రాళ్లతో వెంటాడి..
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరైన చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కార్యకర్తలపై ఏప్రిల్ 29న జరిగిన దాడి ఘటన వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది.
వైకాపా శ్రేణుల విధ్వంసాన్ని చేష్టలుడిగి చూసిన పోలీసులు
మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామంలో దాడి ఘటన వీడియో వెలుగులోకి
యర్రాతివారిపల్లెలో వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి దిగడంతో పరుగులు తీస్తున్న బీసీవైపీ కార్యకర్తలు
ఈనాడు, చిత్తూరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరైన చిత్తూరు జిల్లా సదుం మండలం యర్రాతివారిపల్లెలో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కార్యకర్తలపై ఏప్రిల్ 29న జరిగిన దాడి ఘటన వీడియో బుధవారం వెలుగులోకి వచ్చింది. అందులో తొలుత యర్రాతివారిపల్లెకు బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్, ఆయన అనుచరులు రాగా ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కొందరు గ్రామస్థులు రాళ్లు, కర్రలతో వెంటబడ్డారు. పోలీసులు అక్కడే ఉన్నా పెద్దగా వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. అనుమతులు తీసుకుని గ్రామానికి వస్తామని రామచంద్ర యాదవ్ చెప్పి వెనక్కి వెళ్తుండగా బీసీవైపీ కార్యకర్తలు, వాహనాలపై రాళ్ల దాడి చేశారు. కొంతసేపటి తర్వాత గొడ్లవారిపల్లె వద్ద మరికొందరు వైకాపా కార్యకర్తలు అడ్డువచ్చి ప్రచార రథాలు, కార్లు వెళ్లకుండా అడ్డంగా పడుకున్నారు. అక్కడ కూడా రాళ్ల వర్షం కురిపించి వెంబడించారు. సదుం స్టేషన్ ఆవరణలో జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్రెడ్డి లోపలున్న వ్యక్తులను చెప్పుతో కొట్టేందుకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. వైకాపా కార్యకర్తలు అధిక సంఖ్యలో దాడి చేస్తున్న వీడియో స్పష్టంగా ఉన్నా పది మందిపైనే కేసులు నమోదు చేయడాన్ని బీసీవైపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి. అదే రామచంద్రయాదవ్ వర్గీయులు ఎక్కువమందిపై ఎలా కేసులు పెట్టారని ప్రశ్నిస్తున్నారు.
యర్రాతివారిపల్లెలో రాళ్లతో దాడి చేస్తున్న వైకాపా కార్యకర్త
కోర్టుకు ఇరువర్గాలు
సదుం మండలం యర్రాతివారిపల్లెలో జరిగిన ఘర్షణల ఘటనలో పోలీసులు బీసీవైపీ, వైకాపా కార్యకర్తలను అరెస్టు చేసి చిత్తూరు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఏఎస్పీ ఆరిఫుల్లా, పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి బుధవారం సదుం స్టేషన్కు వచ్చి కేసు పురోగతి తెలుసుకున్నారు. రామచంద్ర యాదవ్పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాకు బుధవారం అమరావతిలో ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి వర్గీయులు దాడి చేస్తే బీసీవై పార్టీ అధినేతపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
- ఘటన జరిగిన రోజే రామచంద్రయాదవ్ వర్గీయులను పోలీసులు అరెస్టు చూపకుండా.. బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ మేరకు కాగితాలపై సంతకం చేయాలని అడగ్గా.. వారు నిరాకరించారు. ముందురోజే అరెస్టు చేసి.. ఆలస్యంగా చూపడాన్ని వారు ప్రశ్నించడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు వారిని కోర్టుకు హాజరుపరిచారు. ఈ క్రమంలో వారిని భౌతికంగా హించారనే అనుమానాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూహక్కు.. సమస్యల చిక్కు
[ 15-06-2024]
చిగురుపాడుకి చెందిన కాటూరు సుబ్రహ్మణ్యం పదేళ్ల కిందట మరణించారు. ఆయనకు 1.92 ఎకరాలు భూమి ఉంది. ఆయన పేరుతోనే ఎల్పీ నంబరు కేటాయించి పట్టాదారు, అనుభవదారుగా 98 సెంట్లు ఉన్నట్లు నమోదు చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు హర్షణీయం
[ 15-06-2024]
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయడంపై చిత్తూరు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అశోక్ ఆనంద్ యాదవ్, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. -
సగం పాఠశాలల్లో గుడ్డు పెట్టలేదు
[ 15-06-2024]
పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందజేస్తున్నారు అందులో 1,200 పాఠశాలల్లో కోడిగుడ్డు పంపిణీ చేయగా 1,248చోట్ల గత రెండు రోజులుగా విద్యార్థులకు అందజేయలేదు. -
రెస్కో.. అవినీతి చూస్కో
[ 15-06-2024]
త్రిరాష్ట్ర కూడలి ప్రాంతమైన కుప్పం, సమీప మండలాల్లో నాణ్యమైన విద్యుత్తు నిరంతర సరఫరా కోసం పనిచేస్తున్న కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) వైకాపా ప్రభుత్వ హయాంలో అవినీతికి కేరాఫ్గా మారింది. -
అనధికార తట్టలు, హ్యాకర్ లైసెన్సులు
[ 15-06-2024]
తిరుమలలో తరతరాలుగా ఉంటున్న ప్రజలకు ఉపాధి కల్పించేందుకు గతంలో తితిదే తట్టలు, హ్యాకర్ లైసెన్సులు, దుకాణాలు కేటాయించింది. -
అన్నదాత దరిచేరని విజ్ఞానం
[ 15-06-2024]
అన్నదాతకు వ్యవసాయంలో నూతన మెలకువలు నేర్పించి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించే స్థాయికి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం రూపొందించింది. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 15-06-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు -
పరిశ్రమించేందుకు మరో అవకాశం
[ 15-06-2024]
పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల పనుల్లో కదలిక రానుంది. గత తెదేపా హయాంలో సాగి మధ్యలో వైకాపా సర్కార్ ఆపేసిన చెన్నై-విశాఖ పారిశ్రామిక నడవా(వీసీఐసీ) ప్రాజెక్టుల్లో ట్రెంచ్-1 పనులు గడవు పెంచారు. -
పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ..
[ 15-06-2024]
స్నేహితుడి పుట్టినరోజే ఆ ముగ్గురు స్నేహితులకు జీవితంలో చివరి రోజైంది.. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయాలని కేకు తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆ ముగ్గురిని ఐచర్ వాహనం మృత్యు రూపంలో వచ్చి బలిగొంది.. -
గణనాథుడి సేవలో సినీ నటుడు సాయి ధరమ్ తేజ్
[ 15-06-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని సినీ హీరో సాయిధరమ్తేజ్ శుక్రవారం దర్శించుకున్నారు. -
విలీనంతో సరిపెట్టారు
[ 15-06-2024]
వైకాపా ప్రభుత్వంలో పలు గ్రామాలను సమీప పురపాలక సంఘాల్లో, నగరపాలక సంస్థల్లో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం చేశారు. -
ఎస్వీయూలో బోధనేతర ఉద్యోగుల అల్టిమేటం
[ 15-06-2024]
ఎస్వీయూలోని బోధనేతర ఉద్యోగ సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్ష నిర్ణయాలు, కక్ష సాధింపులకు ఊతం ఇచ్చేలా వర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. -
సిరి సంత.. సేంద్రియం చెంత
[ 15-06-2024]
మాది చిత్తూరు జిల్లా పలమనేరు. మిత్ర చిరుధాన్యాల ఉత్పత్తుల పేరుతో ఏళ్లుగా విక్రయాలు సాగిస్తున్నాం. ప్రస్తుతం 65 రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాం -
ఎస్పీసీహెచ్లో గుండెమార్పిడి శస్త్రచికిత్స
[ 15-06-2024]
శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో గుండె మార్పిడి శస్త్రచికిత్సను శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా సగం జీవితం నటిగానే గడిపా: కృతి కర్బందా
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/06/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
సూపర్-8కు అమెరికా.. వర్షంతో పాకిస్థాన్ ఆశలు గల్లంతు
-
ఖాళీ థియేటర్లో ఫరియా.. మిర్నా మేనన్ ‘రెడ్ అలర్ట్’
-
ఉప ఎన్నిక బరిలో ‘దర్శన్’ను దించాలనుకున్న డీకే బ్రదర్స్?