ప్రాణాలు పోతున్నాయి జగన్...
జిల్లాలో ఆర్టీసీలో సుమారు 5వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగోలేక పోతే చిత్తూరులోని డిస్పెన్సరీలో పరీక్షలు నిర్వహించుకుంటుంటారు.
ఈహెచ్ఎస్లో దంతాలు, నేత్రాలకే వైద్యం
ఆర్టీసీ ఉద్యోగులకు మొండిచేయి
వైద్య సేవలకు ‘బ్రేక్’ వేసిన వైకాపా సర్కార్
- చిత్తూరుకు డిపోకు చెందిన ఓ డ్రైవర్ ఐదేళ్ల కిత్రం బెంగళూరుకు విధుల నిమిత్తం వెళ్లాడు. అక్కడకు వెళ్లాక అతడికి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో విచారణ కోసం వచ్చిన అనంతపురం రీజనల్ మేనేజరు ఎంత ఖర్చయినా పర్వాలేదు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. దీంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యం కోసం రూ.7 లక్షలు ఖర్చు చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బతికి బయటపడటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
- గుడిపాలకు చెందిన ఓ మెకానిక్ చిత్తూరు గ్యారేజ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 15 రోజుల కిత్రం అతడు విధులకు వస్తుండగా ప్రమాదం జరిగింది. అతడిని వేలూరు సీఎంసీకి తరలించగా రూ.10 లక్షలు అవుతుందని చెప్పారు. దాన్ని భరించే స్థోమత లేకపోవడంతో తిరుపతి స్విమ్స్కు తెచ్చారు. అక్కడ రూ.5 లక్షలు అవుతుందని చెప్పారు. పుదుచ్చేరిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా అతడికి ఆ ప్రయోజనం ఒనగూరలేదు.
- జగన్ అనే నేను మాట ఇస్తే తప్పను.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చాను. ఆపై ప్రభుత్వంలో విలీనం చేసి మాట నిలబెట్టుకున్నానని గొప్పలు చెప్పాడు. ఉద్యోగులు సైతం సీఎం మాయమాటలు నమ్మారు. తీరా విలీనం చేశాక వారికి అప్పటివరకు అందుతున్న వైద్య సేవల పరిస్థితి తారుమారైంది. తమ పరిస్థితి కార్పొరేషన్లో ఉన్నప్పుడే బాగుడేందని, ప్రభుత్వంలో విలీనం చేశాక తమ ఆరోగ్యంపై భరోసా కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
న్యూస్టుడే, పుత్తూరు, చిత్తూరు(కొంగారెడ్డిపల్లె): జిల్లాలో ఆర్టీసీలో సుమారు 5వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగోలేక పోతే చిత్తూరులోని డిస్పెన్సరీలో పరీక్షలు నిర్వహించుకుంటుంటారు. అక్కడ రక్తపోటు, మధుమేహం, జ్వరం, తలనొప్పి వంటి వాటికి చికిత్స అందిస్తారు. అత్యవసర చికిత్స పొందాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైదరాబాద్లోని తార్నాక ఆస్పత్రికి వెళ్లి వైద్యసేవలు పొందేవారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. అయితే తార్నాకలో అందిస్తున్నట్లు ఇక్కడ సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో 2020లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులు, సిబ్బందికి ఈహెచ్ఎస్ కార్డులు అందజేశారు. వీటి ద్వారా సేవలకు ప్రతి నెలా రూ.225 ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయించుకుంటున్నారు. అయితే ఆ మేరకు సేవలు అందించడం లేదు. ఈహెచ్ఎస్కు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఆస్పత్రులలో మాత్రమే సేవలు పొందాలి. లేదంటే ఉద్యోగే.. ఆ మొత్తాన్ని భరించాలి. ఈ నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలు పొందాలంటే ఉద్యోగులు, సిబ్బంది చేతి చమురు వదులుతోంది. ఈహెచ్ఎస్కు సంబంధించి ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెల్లించక పోవడంతో ప్రభుత్వం ఎంపిక చేసిన ఆస్పత్రులలో సైతం కంటి, పంటికి మాత్రమే వైద్యం అందిస్తుండటం గమనార్హం.
మెరుగపడాల్సిన సేవల్లో కోత..
ప్రభుత్వంలో విలీనం కాక ముందు ఉద్యోగులు, సిబ్బంది కుటుంబసభ్యుల్లో ఎవరికి అనారోగ్య సమస్యలు ఉన్నా ఎలాంటి నిబంధనలు లేకుండా చికిత్స పొందే వెసులుబాటు ఉండేది. విలీనమయ్యాక ఉద్యోగులు, సిబ్బంది కుటుంబసభ్యులకు సంబంధించి మరింత మెరుగైన సేవలు అందించాల్సి ఉన్నా అందులో కోత విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈహెచ్ఎస్ కింద పరీక్షలకు సైతం ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు తీసుకునేవారు కాదు. ఇప్పుడు పూర్తిగా పరీక్షలకు నగదు చెల్లించాల్సి వస్తోంది.
ఈహెచ్ఎస్తో నష్టపోతున్నాం..
కార్పొరేషన్లో ఉన్నప్పుడు అత్యవసర వైద్యం కోసం ఎంత ఖర్చయినా సేవలు అందించేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఈహెచ్ఎస్ వల్ల బాగా నష్టపోతున్నాం. ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతోనే ఈ పరిస్థితి. సకాలంలో బిల్లులు చెల్లిస్తే ఫర్వాలేదు. బిల్లులు ఆలస్యం అవుతుండటంతో అక్కడకు వెళ్లిన వెంటనే ఈ వైద్య సేవలు పొందాలంటే ఈహెచ్ఎస్ వర్తించదని చెప్పేస్తున్నారు. చేసేది లేక నగదు కట్టి సేవలు పొందుతున్నా.
శివ, ఆర్టీసీ ఉద్యోగి
ప్రభుత్వం మాటల గారడీతో..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అన్ని సౌకర్యాలు వర్తింపజేస్తాం. ఆర్టీసీ కుటుంబాలు బాగుపడతాయని నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. దీంతో అందరం సంబర పడ్డాం. తీరా ప్రస్తుతం అందుతున్న సేవలు చూస్తే ప్రభుత్వం గారడీ చేసిందని అర్థమైంది. ఉద్యోగులు, సిబ్బంది కుటుంబసభ్యుల ఆరోగ్యానికి సంబంధించి చర్యలు తీసుకునేలా జీవోలు ఇవ్వాలి.
దానవేంద్ర, ఆర్టీసీ ఉద్యోగి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూహక్కు.. సమస్యల చిక్కు
[ 15-06-2024]
చిగురుపాడుకి చెందిన కాటూరు సుబ్రహ్మణ్యం పదేళ్ల కిందట మరణించారు. ఆయనకు 1.92 ఎకరాలు భూమి ఉంది. ఆయన పేరుతోనే ఎల్పీ నంబరు కేటాయించి పట్టాదారు, అనుభవదారుగా 98 సెంట్లు ఉన్నట్లు నమోదు చేశారు. -
ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు హర్షణీయం
[ 15-06-2024]
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయడంపై చిత్తూరు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అశోక్ ఆనంద్ యాదవ్, న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. -
సగం పాఠశాలల్లో గుడ్డు పెట్టలేదు
[ 15-06-2024]
పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందజేస్తున్నారు అందులో 1,200 పాఠశాలల్లో కోడిగుడ్డు పంపిణీ చేయగా 1,248చోట్ల గత రెండు రోజులుగా విద్యార్థులకు అందజేయలేదు. -
రెస్కో.. అవినీతి చూస్కో
[ 15-06-2024]
త్రిరాష్ట్ర కూడలి ప్రాంతమైన కుప్పం, సమీప మండలాల్లో నాణ్యమైన విద్యుత్తు నిరంతర సరఫరా కోసం పనిచేస్తున్న కుప్పం గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (రెస్కో) వైకాపా ప్రభుత్వ హయాంలో అవినీతికి కేరాఫ్గా మారింది. -
అనధికార తట్టలు, హ్యాకర్ లైసెన్సులు
[ 15-06-2024]
తిరుమలలో తరతరాలుగా ఉంటున్న ప్రజలకు ఉపాధి కల్పించేందుకు గతంలో తితిదే తట్టలు, హ్యాకర్ లైసెన్సులు, దుకాణాలు కేటాయించింది. -
అన్నదాత దరిచేరని విజ్ఞానం
[ 15-06-2024]
అన్నదాతకు వ్యవసాయంలో నూతన మెలకువలు నేర్పించి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించే స్థాయికి తెచ్చేందుకు వ్యవసాయ శాఖ పొలంబడి కార్యక్రమం రూపొందించింది. -
సర్వదర్శనానికి 18 గంటలు
[ 15-06-2024]
శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా శుక్రవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు -
పరిశ్రమించేందుకు మరో అవకాశం
[ 15-06-2024]
పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల పనుల్లో కదలిక రానుంది. గత తెదేపా హయాంలో సాగి మధ్యలో వైకాపా సర్కార్ ఆపేసిన చెన్నై-విశాఖ పారిశ్రామిక నడవా(వీసీఐసీ) ప్రాజెక్టుల్లో ట్రెంచ్-1 పనులు గడవు పెంచారు. -
పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ..
[ 15-06-2024]
స్నేహితుడి పుట్టినరోజే ఆ ముగ్గురు స్నేహితులకు జీవితంలో చివరి రోజైంది.. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేయాలని కేకు తీసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆ ముగ్గురిని ఐచర్ వాహనం మృత్యు రూపంలో వచ్చి బలిగొంది.. -
గణనాథుడి సేవలో సినీ నటుడు సాయి ధరమ్ తేజ్
[ 15-06-2024]
శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారిని సినీ హీరో సాయిధరమ్తేజ్ శుక్రవారం దర్శించుకున్నారు. -
విలీనంతో సరిపెట్టారు
[ 15-06-2024]
వైకాపా ప్రభుత్వంలో పలు గ్రామాలను సమీప పురపాలక సంఘాల్లో, నగరపాలక సంస్థల్లో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా విలీనం చేశారు. -
ఎస్వీయూలో బోధనేతర ఉద్యోగుల అల్టిమేటం
[ 15-06-2024]
ఎస్వీయూలోని బోధనేతర ఉద్యోగ సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ ఏకపక్ష నిర్ణయాలు, కక్ష సాధింపులకు ఊతం ఇచ్చేలా వర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. -
సిరి సంత.. సేంద్రియం చెంత
[ 15-06-2024]
మాది చిత్తూరు జిల్లా పలమనేరు. మిత్ర చిరుధాన్యాల ఉత్పత్తుల పేరుతో ఏళ్లుగా విక్రయాలు సాగిస్తున్నాం. ప్రస్తుతం 65 రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నాం -
ఎస్పీసీహెచ్లో గుండెమార్పిడి శస్త్రచికిత్స
[ 15-06-2024]
శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో మరో గుండె మార్పిడి శస్త్రచికిత్సను శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా సగం జీవితం నటిగానే గడిపా: కృతి కర్బందా
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/06/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
సూపర్-8కు అమెరికా.. వర్షంతో పాకిస్థాన్ ఆశలు గల్లంతు
-
ఖాళీ థియేటర్లో ఫరియా.. మిర్నా మేనన్ ‘రెడ్ అలర్ట్’
-
ఉప ఎన్నిక బరిలో ‘దర్శన్’ను దించాలనుకున్న డీకే బ్రదర్స్?