పసిడికాంతుల పట్టాభిషేకం
మది నిండా అధ్యయన ఫలాలు.. కళ్లల్లో పసిడి కాంతులు.. పిల్లలను చూసి పెద్దల ఆనందబాష్పాలు.. వీడలేమంటూ.. వీడ్కోలంటూ సహచరుల ఆప్యాయతలు, తల్లిదండ్రుల అభినందనలు.. ఆచార్యుల ఆశీర్వాదాలు.. ఇలా ఓ అపురూప ఘట్టానికి వేదికైంది కాకినాడ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూకే). బుధవారం ఈ వర్సిటీ తొమ్మిదో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.
అనిల్ చలమలశెట్టికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. చిత్రంలో మంత్రి బొత్స
ఈనాడు, కాకినాడ; న్యూస్టుడే, వెంకట్నగర్: మది నిండా అధ్యయన ఫలాలు.. కళ్లల్లో పసిడి కాంతులు.. పిల్లలను చూసి పెద్దల ఆనందబాష్పాలు.. వీడలేమంటూ.. వీడ్కోలంటూ సహచరుల ఆప్యాయతలు, తల్లిదండ్రుల అభినందనలు.. ఆచార్యుల ఆశీర్వాదాలు.. ఇలా ఓ అపురూప ఘట్టానికి వేదికైంది కాకినాడ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూకే). బుధవారం ఈ వర్సిటీ తొమ్మిదో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.
వినూత్న ఆలోచనలతోనే విజయం
జీవిత లక్ష్యాలు నిర్దేశించుకుని.. వినూత్న ఆలోచనలకు పదును పెట్టి.. విజయం సాధించడానికి ధైర్యంగా ముందడుగు వేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం- కాకినాడ (జేఎన్టీయూకే) తొమ్మిదో స్నాతకోత్సవంలో బుధవారం ఆయన కులపతి హోదాలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థికి వృత్తిపరమైన నైపుణ్యం అవసరమన్నారు. ఇంజినీరింగ్ కెరీర్లో విజయాన్ని ఒక్కరోజులో సాధించలేరని.. నిబద్ధతతో ప్రయత్నిస్తే ఏరోజుకైనా అందుకుంటారన్నారు. ప్రతి సమస్యను సవాలుగా తీసుకుని జీవితంలో నేర్చుకోడానికి, ఎదగడానికి అవకాశంగా మలచుకోవాలన్నారు. ఏ రంగంలో ఉన్నా సమాజానికి సేవ చేస్తేనే సంతృప్తి కలుగుతుందన్నారు. ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని గవర్నర్ సూచించారు. భారత పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తొలిసారి చేపట్టిన భారీ ప్రాజెక్ట్ ఎస్ఎల్వి-3 విఫలమైందని, వైఫల్యం గురించి ఆలోచిస్తూ కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నించి విజయం సాధించారని గుర్తుచేశారు. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పీహెచ్డీలు, స్టార్టప్లతో పాటు సాంకేతికత, ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానాల్లోనూ భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందన్నారు. గత పదేళ్లలో పరిశోధన- అభివృద్ధిపై స్థూల వ్యయం మూడు రెట్లు పెరిగిందన్నారు. రెసిడెంట్ పేటెంట్ల ఫైలింగ్లో తొమ్మిదో స్థానంలో ఉన్నట్లు వివరించారు.
ఎవరెవరు పాల్గొన్నారంటే..
మంత్రులు దాడిశెట్టి రాజా, విశ్వరూప్, ఎంపీ వంగా గీత, కలెక్టర్ కృతికాశుక్లా, ఎస్పీ సతీష్కుమార్, నన్నయ విశ్వవిద్యాలయం వీసీ పద్మరాజు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, కన్నబాబు, పెండెం దొరబాబు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దవులూరి దొరబాబు, కుడా ఛైర్మన్ చంద్రకళాదీప్తి, చలమలశెట్టి సునీల్, జనసేన నాయకులు జ్యోతుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. - జేఎన్టీయూ స్నాతకోత్సవంలో గవర్నర్ చేతులమీదుగా గ్రీన్కో గ్రూప్ సీఈవో- ఎండీ అనిల్ చలమలశెట్టి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఐటీ, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్, క్లీన్ ఎనర్జీ, అర్బన్ ఇన్ఫ్రా రంగాల్లో సాంకేతికత ఆధారంగా విజయం సాధించినందుకు ఈ గుర్తింపు ఇచ్చారు. - వేదికపై 133 మంది పీహెచ్డీలు, 53 మంది 66 బంగారు పతకాలు స్వీకరించారు. - 2017-21, 2018-22 విద్యాసంవత్సరాల్లో 1,20,574 మంది యూజీ, పీజీ డిగ్రీ పూర్తిచేశారని.. వీరందరికీ పట్టాలు అందిస్తామని జేఎన్టీయూకే వీసీ ప్రసాదరాజు చెప్పారు. - శాంతా బయోటెక్ లిమిటెడ్ వ్యవస్థాపకులు డాక్టర్ కె.ఐ.వరప్రసాద్రెడ్డి తనకు మాతృభాషలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. తెలుగులో సుదీర్ఘంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు. లోపాలు ఎత్తిచూపుతూ.. పురోభివృద్ధికి ప్రభుత్వాలు అనుసరించాల్సిన తీరునూ వివరించారు. ఆ తర్వాత మాట్లాడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రసంగమూ తెలుగులోనే సాగింది.
ఫౌండేషన్ స్థాయి నుంచి మార్పులు
బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల ఆనంద క్షణాలు
సాంకేతికంగా వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చుకుని రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఫౌండేషన్ స్థాయి నుంచే విద్యా విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ఫస్ట్, సెకండ్ స్టాండర్డ్ ఇలా మార్పులు చేస్తున్నామన్నారు. రిస్క్ ఎనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఉపాధి అవకాశాలు మెండుగా ఉండే కోర్సులు విశ్వవిద్యాలయాల్లో పెడతామన్నారు. ముఖ్య అతిథి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ.వరప్రసాద్రెడ్డి విద్యార్థుల్లో చైతన్యం నింపేలా ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ ఆరోగ్యం బాలేదు..!
[ 20-05-2024]
జిల్లాలో రక్తహీనత కేసులు కొన్నాళ్లుగా అధికంగా నమోదవుతున్నాయి. ప్రధానంగా గర్భిణుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటోంది. పౌష్టికాహార లోపం, అనారోగ్య సమస్యల కారణంగా ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. -
అంతులేని ఆక్రమణలు
[ 20-05-2024]
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్న ప్రబుద్ధుల కళ్లు ఇప్పుడు కాలువల గర్భాలపై పడింది. కాలువల్లోనే రెండంతస్తుల శాశ్వత భవనాలను సైతం నిర్మించేస్తున్నారు. ఇప్పటివరకు కాలువ గట్లను ఆక్రమించి దుకాణాలు నిర్మించుకోవడం వంటి చర్యలకు పాల్పడేవారు. -
పరిణయం.. పరమానందం
[ 20-05-2024]
పురుషోత్తముడు... మీసాలరాయుడు.. త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన అన్నవరం సత్యదేవుడు... పెళ్లికుమారుడిగా సౌభాగ్యదాయిని... సంతోషకారిణి.. అనంతలక్ష్మీ అమ్మవారు పెళ్లికుమార్తెగా.. ఆశీనులైన వేళ.. ఆ కల్యాణ వేడుక కనులారా వీక్షించిన భక్తజనం పులకించిపోయారు. -
కూటమి జట్టులో జోష్
[ 20-05-2024]
సార్వత్రిక సమరంలో ఓటు చైతన్యం కూటమి అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవ్వడంతో తమకు కలిసివస్తుందనే ధీమా అందరిలో వ్యక్తమవుతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో వైఫల్యాలకు ప్రజలు విసిగిపోయారని.. -
ఈసారీ నాణ్యతకు పరీక్షే!
[ 20-05-2024]
జిల్లాలోని పలు నియోజక వర్గాల్లో సమీకృత వ్యవసాయ ప్రయోగశాలలు (ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్) నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రతి వ్యవసాయ సీజన్లోనూ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్షలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వంతెనల సమీపంలో తవ్వకాలే లేవట!
[ 20-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయట.. వంతెనలకు 500 మీటర్ల దూరంలో తవ్వకాలే లేవట.. ఇవీ జిల్లా యంత్రాగమంతా ఆదివారం రేవుల్లో పర్యటించి తేల్చిన విషయం. -
నిరీక్షించి.. నీరసించి..
[ 20-05-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రిలో వైద్యసేవలు అందాలంటే రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ఓపీ చీటీ రాయించుకోవడం మొదలు.. వైద్యుడికి చూపించుకోవడం, వైద్య పరీక్షలు, అవసరమైన స్కానింగులు, -
పిఠాపురం, కాకినాడ నగర నియోజకవర్గాలపై నిఘా..?
[ 20-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు నియోజకవర్గాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని కౌంటింగ్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
పొగాకు పంటకు పండగ
[ 20-05-2024]
ఎన్నో ఆటుపోట్లు మధ్య పండించిన వర్జీనియా పొగాకు పంట అమ్మకాలు జోరందుకున్నాయి. రోజురోజుకూ ధర పెరగడంతో పొగాకు రైతులు వేలం కేంద్రానికి బేళ్లను తరలిస్తున్నారు. -
థాయిలాండ్లో కోనసీమ కుర్రోడి జోష్
[ 20-05-2024]
థాయ్లాండ్లో ఆదివారం ఉదయం జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో భారత డబుల్స్ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టిల జోడీ విజయం సాధించింది. -
శాశ్వత పరిష్కారం ఎన్నటికో?
[ 20-05-2024]
బ్యాంక్ కెనాల్ ఎగదన్నడం, భారీ వర్షాల వల్ల ప్రతి సార్వా(ఖరీఫ్) సమయంలో లొల్ల, వాడపల్లి ఆయకట్టు పంట పొలాలు ఏటా ముంపుబారిన పడుతున్నాయి. ఏళ్లతరబడి అదే పరిస్థితి ఉంటున్నా పట్టించుకునే నాధుడు లేడు. -
బస్సు దగ్ధం
[ 20-05-2024]
నడుస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
-
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
-
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్