సీఎం వచ్చారు.. నరకం చూపారు
నడిరోడ్డుపై సీఎం జగన్ నిర్వహించిన ప్రచార సభ.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మంగళగిరిలోని స్థానిక పాతబస్టాండ్ సమీపంలో గౌతమబుద్దా రోడ్డులో శుక్రవారం ఆయన ప్రచార వాహనంపై ప్రసంగించారు.
మంగళగరిలో జగన్ ఎన్నికల ప్రచార సభ
ఆంక్షలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
సీఎం రాకుండానే వెనుదిరుగుతున్న మహిళలు
మంగళగిరి, తాడికొండ, దుగ్గిరాల, న్యూస్టుడే: నడిరోడ్డుపై సీఎం జగన్ నిర్వహించిన ప్రచార సభ.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మంగళగిరిలోని స్థానిక పాతబస్టాండ్ సమీపంలో గౌతమబుద్దా రోడ్డులో శుక్రవారం ఆయన ప్రచార వాహనంపై ప్రసంగించారు. ఈ నేపథ్యంలో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు వాహనచోదకులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. ఇలాంటి సభలు నడి రోడ్డుపై పెడితే అత్యవసర పనులపై వెళ్లేవారు ఏమైపోవాలంటూ పలువురు అసహనం వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటలపాటు కార్లు, ద్విచక్ర వాహనదారులు, ఆటోల్లో ప్రయాణించేవారు గమ్యస్థానం చేరేందుకు ఇబ్బందులకు గురయ్యారు. సీఎం మాట్లాడుతుండగా.. మహిళలు వారు వచ్చిన ఆటోల కోసం వెనుతిరిగి వెళ్లారు.
దుకాణాలు మూసేసి.. విద్యుత్తు నిలిపేసి..
దుకాణాల ముందు ఇనుప డివైడర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దాదాపుగా వంద మీటర్ల వరకు రహదారికి ఇరువైపులా ఉన్న షాపులు మూయించారు. విద్యుత్తు నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులకు విద్యుత్తు సరఫరా లేక లావాదేవీలు గంటన్నరపాటు నిలిచిపోయాయి. టీ, అల్పాహార దుకాణాలు మూయించి వేయడంతో రెక్కాడితేకానీ డొక్కాడని తామంతా నష్టపోవాల్సి వచ్చిందని వారు వాపోయారు.
ఆటోల్లో తరలింపు..
దుగ్గిరాల, తాడేపల్లి, మంగళగిరి మండలంలోని గ్రామాల నుంచి మహిళలను సభకు రెండు గంటల ముందుగానే ఆటోల్లో తీసుకొచ్చారు. కొంత మంది ఆటోల్లో నుంచి దిగకుండానే అందులోనే కూర్చుండిపోయారు. సభకు ఆశించినంత స్థాయిలో సమీకరణ జరగలేదనే భావాన్ని ఆ పార్టీ నాయకులే బాహాటంగా వ్యక్తపరిచారు. నగరంలోని చేనేత వర్గాలు సభలో కనిపించలేదనే అంశాన్ని ఆయా పార్టీ నాయకులు చర్చించుకోవడం గమనార్హం. సభకు వచ్చిన వారిలో పలువురు మద్యం సీసాలతో బహిరంగంగా తిరుగుతూ కనిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుతర బాధ్యత గుర్తించాల్సిందే..
[ 16-06-2024]
గత వైకాపా పాలనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పలు నియామకాలకు రాజకీయ రంగు పులిమింది. ఏమాత్రం బోధనానుభవం లేని వ్యక్తిని తీసుకొచ్చి న్యాయ విభాగానికి డీన్ను చేసిన ఘనత వర్సిటీకే దక్కింది. -
వైకాపా పాలకుల నిర్లక్ష్యం విద్యార్థులకందని పౌష్టికాహారం
[ 16-06-2024]
వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో తొలి రోజు నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. అయితే చిక్కీలు, కోడిగుడ్లు లేకుండానే విద్యార్థులకు భోజనం వడ్డన చేయడం కనిపిస్తోంది. -
ఏఎన్యూలో పాలన గాడిన పడేనా!
[ 16-06-2024]
గత వైకాపా పాలనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పలు నియామకాలకు రాజకీయ రంగు పులిమింది. ఏమాత్రం బోధనానుభవం లేని వ్యక్తిని తీసుకొచ్చి న్యాయ విభాగానికి డీన్ను చేసిన ఘనత వర్సిటీకే దక్కింది. -
ఆరు నెలలు కాదు.. ఇప్పుడే చూసుకుందాం : బ్రహ్మారెడ్డి
[ 16-06-2024]
అరాచకాలు, అక్రమాలు చేసి ప్రజల చేతిలో ఓడిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరునెలల్లో తానేమిటో చూపిస్తానని బీరాలు పలుకుతున్నాడు. ఆరు నెలలు కాదు ఇప్పుడే రా.. చూసుకుందాం అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు
[ 16-06-2024]
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో ‘హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ’లో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు -
అమరావతి రక్షకా.. గోవిందా
[ 16-06-2024]
అమరావతి రూపశిల్పి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చూడాలన్న సంకల్పం నెరవేరిన సందర్భంగా రాజధాని గ్రామం అనంతవరం కొండపై స్వయంభూ వేంకటేశ్వరస్వామికి శనివారం రాజధాని రైతులు మొక్కులు చెల్లించుకున్నారు. -
క్రికెట్ జట్ల ఎంపికలోనూ రాజకీయం
[ 16-06-2024]
క్రికెట్ జట్ల ఎంపికలోనూ రాజకీయం చేయడంపై జిల్లా క్రికెట్ అసోసియేషన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసోసియేషన్లోని కొందరు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిభ కలిగిన క్రీడాకారుల అవకాశాలకు గండి కొడుతున్నారని తల్లిదండ్రులు,