ఆంధ్రుల కలల రాజధాని తరలిస్తామంటే మిన్నకుండిపోయారు
ఐతానగర్లో అరాచకాలను అడ్డుకోలేకపోయారు
మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు
తెనాలి ఎమ్మెల్యేకు న్యాయవాది మాధవరావు బహిరంగ లేఖ
నన్నపనేని మాధవరావు
తెనాలిటౌన్, న్యూస్టుడే: తెనాలి పట్టణ ఐతానగర్కు చెందిన ప్రముఖ న్యాయవాది ‘నన్నపనేని మాధవరావు’ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కు బహిరంగ లేఖ రాశారు. దాని ప్రతిని శనివారం విడుదల చేశారు. ‘ఆంధ్రుల కలల రాజధాని తరలిస్తామంటే మీరు మిన్నకుండిపోయారు. రాజధాని రైతుల పాదయాత్రను మీ ఇల్లు ఉందన్న కారణంగా ఐతానగర్ మీదుగా రానివ్వకపోవడాన్ని మేమంతా జీర్ణించుకోలేకపోతున్నాం. రాజధాని మార్చకూడదంటూ మహిళలందరూ కొబ్బరికాయలు కొట్టడానికి స్థానిక పేరంటాళ్లమ్మ గుడి వద్దకు వస్తే పోలీసులు నెట్టివేశారు. ఆ సమయంలోనూ మీ సాయం అందలేదు. ఘన కీర్తి ఉన్న ఐతానగర్ రౌడీయిజానికి కేంద్రంగా మారింది. రోడ్ల వెంబడి అక్రమ కట్టడాలు వెలిశాయి. మున్సిపల్ స్థలాలనూ ఆక్రమించారు. మహనీయుల విగ్రహాలు కనిపించకుండా రేకుల షెడ్లు వేశారు. పాఠశాల కేంద్రంగా అడ్డగోలు సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. అప్పుడప్పుడూ కింది స్థాయి వారిపై కేసులే తప్ప అసలు వారిని గుర్తించనూ లేదు. కొద్ది రోజుల క్రితం ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ను కొట్టారు. ప్రశ్నించిన వారిపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. గత ఎన్నికల సమయంలో మా ప్రాంత వాసిగా ఇక్కడి వారంతా మీకు మద్దతు ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత మీరు ఈ ప్రాంతంలో కొత్తగా మొదలైన దారుణాలను అడ్డుకోలేకపోయారు. మాకు భరోసా ఇవ్వలేక పోయారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అరాచక శక్తుల దారుణాలపై త్వరలో ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నాం. మీ తండ్రి గారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. మీరు కూడా ఆ విధంగా మా మనసులో నిలవాలంటే కనీసం ఇప్పటికైనా తీరు మార్చుకోండి. ఈ నెల 13న ఎన్నికల రోజు కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఓటు అనే ఆయుధంతో మార్పును సాధించుకుంటాం.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అక్రమ కేసులపై బాగా పనిచేశారు: చంద్రబాబు ప్రశంస
[ 17-06-2024]
తెదేపా లీగల్ సెల్ సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైకాపా సర్కారు ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేయాల్సి వచ్చిందని.. ఆ పోరాటాల్లో లీగల్ సెల్ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. -
మంత్రికి పెట్రోలియం ట్రేడర్స్ అభినందనలు
[ 17-06-2024]
ఏపీ పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర కార్యవర్గం సభ్యులు.. మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
ఏపీలో తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు
[ 17-06-2024]
తెలుగుదేశం ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతోపాటు పంచదార, కందిపప్పును సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. -
24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు..
[ 17-06-2024]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. 26వ తేదీ వరకూ.. మూడు రోజుల పాటు ఇవి జరగనున్నాయి. -
వైకాపాకు మాజీ మంత్రి రాజీనామా..
[ 17-06-2024]
వైకాపాకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్కు తన రాజీనామా లేఖను పంపారు -
జిల్లాలో సగటు. 3.6 మి.మీ వర్షపాతం
[ 17-06-2024]
జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు సగటున 3.6 మిల్లీ మీటర్లువర్షపాతం నమోదైంది. -
వీరు మారరంతే
[ 17-06-2024]
రాష్ట్రంలో వైకాపా పాలన పోయి కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఇంకా కొందరు పోలీసులు వైకాపాకు అండగా నిలుస్తున్నారు. ఆ పార్టీ నాయకులపై అందే ఫిర్యాదులను తేలిగ్గా తీసుకుంటున్నారు. -
హక్కు పత్రాలకు ఎదురుచూపులు
[ 17-06-2024]
ఖరీఫ్ వ్యవసాయ పనుల సీజన్ ప్రారంభమైంది. దుక్కులు దున్నడం, పొలాలకు పశువుల ఎరువు తరలించడం, పంట వ్యర్థాలను శుభ్రం చేసుకోవడం తదితర పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. -
చేయి తడిపితేనే అనుమతులు లేకుంటే కొర్రీలు
[ 17-06-2024]
భవన నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టణ ప్రణాళికాధికారులు కొందరు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. -
ప్రజలకు యువనేత భరోసా
[ 17-06-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ రెండోరోజు నిర్వహించిన ‘ప్రజా దర్బార్’కు ప్రజలు పోటెత్తారు. ఉండవల్లి నివాసంలో ఆదివారం ఉదయం నియోజకవర్గ ప్రజలను కలసి సమస్యలను తెలుసుకున్నారు. -
21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు
[ 17-06-2024]
రానున్న 21 రోజుల్లో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు చేపడతున్నామని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ పేర్కొన్నారు. -
రూ.లక్షలు వ్యయం.. ఏం లాభం
[ 17-06-2024]
జీజీహెచ్లో అత్యవసర పరిస్థితుల్లో రోగులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన ఇనుప మెట్లు ఏళ్ల తరబడి నిరుపయోగంగా మారాయి. -
కేటాయింపుల్లో కోత
[ 17-06-2024]
సర్వజనాసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులకు పైసా ఖర్చు లేకుండా చికిత్స అందించాలని ప్రభుత్వ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. -
నగరపాలక సంస్థలో అవినీతిపై విచారణ జరిపించండి
[ 17-06-2024]
గుంటూరు నగరపాలక సంస్థలో గత అయిదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని నారెడ్కో అధ్యక్షుడు నాగవంశీ కోరారు. -
గుణాత్మక విద్యను దెబ్బతీసే జీవో రద్దు చేయాలి
[ 17-06-2024]
గుణాత్మక విద్యను దెబ్బతీసి ఉపాధ్యాయులపై పనిభారం పెంచుతూ గత ప్రభుత్వం తెచ్చిన జీవోనం.117ను రద్దు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
నారా లోకేశ్ ‘ప్రజా దర్బార్’ నేడు
[ 17-06-2024]
దేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ సోమవారం ఉండవల్లి నివాసంలో జరిగే ‘ప్రజా దర్బార్’లో పాల్గొంటారు. -
మృత్యు మార్గాలు
[ 17-06-2024]
రోడ్డు ప్రమాదాల్లో ఏటా వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శిథిలావస్థ వంతెనలు, అధ్వాన రహదారులు, ప్రమాదకర మలుపులు, అతి వేగం, రోడ్డు నిర్మాణ లోపాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. -
ఉద్యోగాల పేరుతో మోసాలు.. తస్మాత్ జాగ్రత్త
[ 17-06-2024]
తాత్కాలిక ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. -
చైనాలో పందిళ్లపల్లి కుర్రోడి సత్తా
[ 17-06-2024]
ఆ యువకుడి చిన్నతనంలో విధి వక్రీకరించింది... దీంతో కుడిచేయి మణికట్టు పై వరకు పోగొట్టుకున్నారు.. అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు.. -
మాతాశిశువులకు మేలు జరిగేనా?
[ 17-06-2024]
పల్నాడు జిల్లాలో 20 లక్షల మంది జనాభా. ఏటా 15వేల శిశు జననాలు.. అయినా మాతా శిశు సంరక్షణకు ప్రత్యేకంగా ప్రసూతి విభాగం లేని దుస్థితి నెలకొంది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు నామమాత్రపు సేవలకే పరిమితమయ్యాయి. -
చెత్తపన్ను నుంచి విముక్తి
[ 17-06-2024]
చెత్తపన్ను భారం నుంచి పట్టణాల ప్రజలకు విముక్తి లభించింది. వైకాపా పాలనలో గతంలో ఎన్నడూలేని విధంగా చెత్తపన్నును అమల్లోకి తెచ్చి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
[ 17-06-2024]
అద్దంకిలో మూడు దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సీఐ పి.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆదివారం అరెస్టు చేసి, కోర్టుకు హాజరు పరిచారు. -
సుద్దముక్కకు పైసల్లేవు
[ 17-06-2024]
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ నిర్వాహకంతో ప్రభుత్వ పాఠశాలల్లో సుద్దముక్కకు పైసలు అందుబాటులోలేని దుస్థితి ఏర్పడింది. రెండు విద్యా సంవత్సరాల్లో పాఠశాల నిర్వహణ గ్రాంట్ను ప్రభుత్వం మంజూరు చేయలేదు. -
బదిలీలపై ఉత్కంఠ
[ 17-06-2024]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో జిల్లా అధికారులతో పాటు డివిజన్, మండల స్థాయి అధికారుల బదిలీలపై ఉత్కంఠ నెలకొంది. -
ఇద్దరి అపహరణ.. రక్షించిన పోలీసులు
[ 17-06-2024]
ఆర్థిక వివాదాల నేపథ్యంలో గచ్చిబౌలిలో కిడ్నాప్ గురైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు వికారాబాద్లో రక్షించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్?
-
వైకాపా అక్రమ కేసులపై బాగా పనిచేశారు: చంద్రబాబు ప్రశంస
-
ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల వేళ.. మణిపుర్ పరిస్థితులపై అమిత్ షా సమీక్ష
-
ఈ నెల 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
-
రైల్వే ట్రాక్పై 10 సింహాలు.. లోకోపైలట్ ఏం చేశారంటే!
-
కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి పంకజ ముండే