logo

Andhra News: అంత జనాభా ఉన్నా ఎలాంటి ప్రాతినిధ్యం దక్కట్లేదు: కాపు నేతలు

 విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఏపీలోని 13 జిల్లాల కాపునాడు 

Published : 27 Feb 2022 13:40 IST

గుంటూరు: విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని ఏపీలోని 13 జిల్లాల కాపునాడు నేతలు డిమాండ్‌ చేశారు. గుంటూరులో సమావేశమైన నేతలు, రంగా- రాధా అభిమానులు.. ప్రభుత్వం తమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కోటి యాభై లక్షల జనాభా ఉన్న కాపులకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కట్లేదని కాపునాడు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాకు స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి హనుమంతు పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని