Karanataka Elections: నేతలకు ముచ్చెమటలు.. ‘కనక’ సింహాసనం ఎవరిదో!
బెంగళూరు నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో.. ఒకవైపు తమిళనాడు, మరో వైపు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులున్న కోలారు జిల్లా రాజకీయం వేడెక్కింది.
కోలారు జిల్లాలో తీవ్ర ఉత్కంఠ
కోలారు, న్యూస్టుడే : బెంగళూరు నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో.. ఒకవైపు తమిళనాడు, మరో వైపు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులున్న కోలారు జిల్లా రాజకీయం వేడెక్కింది. పాలు, టమోటా, మామిడి ఉత్పత్తిలో ఇతర జిల్లాలతో పోటీ పడే ఈ గడ్డపై మంచి ఎండాకాలంలో నిర్వహించిన ఎన్నికలు ఎవరిని బంగారు సింహాసనంపై కూర్చోపెడతాయో అంచనాలకు అందడం లేదు. కోలారు గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) బంగారు గనుల కారణంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కరవు సీమను ఏలే రాజెవరో తేలేది నేడే (శనివారం)కావడంతో నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్, జనతాదళ్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలుస్తూ వచ్చారు. ఈసారి కోలారు నుంచి పోటీ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విఫలయత్నాలు చేశారు. తెలుగు, తమిళ, కన్నడ ఓటర్లు ఇక్కడి నియోజకవర్గాలలో ఉన్నారు. ఇక్కడ పాగా వేయడానికి భాజపా ఈసారి ప్రత్యేక శ్రద్ధచూపింది.
* గత ఎన్నికల (2018)లో కేఆర్ రమేశ్ కుమార్ (శ్రీనివాసపుర), ఎస్ఎన్ నారాయణస్వామి (బంగారపేట), ఎం.రూపకళ (కేజీఎఫ్), కేవై నంజేగౌడ (మాలూరు) కాంగ్రెస్ పార్టీ నుంచి నెగ్గారు. కె.శ్రీనివాసగౌడ (కోలార) జనతాదళ్ నుంచి విజయం సాధించగా హెచ్.నాగేశ్ (ముళబాగిలు) స్వతంత్ర అభ్యర్థిగా విధానసౌధలో అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొత్తూరు మంజునాథ్ బరిలో దిగాల్సిన పరిస్థితి ఎదురైనా.. కుల ధ్రువీకరణ పత్రం వివాదంతో ఆయన చివరిక్షణంలో పోటీ నుంచి తప్పుకొని తన అనుచరుడు నాగేశ్ను బరిలో దించి గెలిపించుకోవడం నిన్నమొన్నటి చరిత్ర.
ఈసారి పోటీ
ఇప్పటి వరకు పోటీలో లేని భాజపా నాలుగు నియోజకవర్గాలలో వేళ్లూనుకుని జనతాదళ్, కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చిందని పోలింగ్ అనంతర సమీక్షలు స్పష్టం చేస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇక్కడి నుంచి పోటీ చేసే ఉద్దేశంతో పలు సభలను నిర్వహించినా.. చివరి క్షణంలో ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నారు. కురుడుమలె గణపతి ఆలయం నుంచి జనతాదళ్ తన పంచరత్న యాత్రను ప్రారంభించి.. జిల్లాలో తన బలాన్ని చాటే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడే జై భారత్ సమావేశాన్ని నిర్వహించారు.
కోలారులో వర్తూరు ప్రకాశ్ (భాజపా), కొత్తూరు మంజునాథ్ (కాంగ్రెస్÷), సీఎంఆర్ శ్రీనాథ్ (దళ్) పోటీలో ఉన్నారు. గతంలో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెల్చిన వర్తూరు ప్రకాశ్ ఈసారి భాజపా అభ్యర్థిగా బరిలో దిగారు. ముళబాగిలిలో దళ్ నుంచి సమృద్ధి మంజునాథ్ పోటీలో ఉండగా, ఆయనకు భాజపా నుంచి సీగేనహళ్లి సుందర్, కాంగ్రెస్ నుంచి ఆదినారాయణ గట్టి పోటీ ఇచ్చారు. బంగారపేటలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు గెలిచిన ఎస్ఎన్ నారాయణస్వామి హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. దళ్ నుంచి ఎం.మలేశ్ బాబు, భాజపా టికెట్పై ఎం.నారాయణ స్వామి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. శ్రీనివాసపురలో మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ (కాంగ్రెస్) పోటీలో ఉండగా, జనతాదళ్ అభ్యర్థి జీకే వెంకటశివారెడ్డి ఆయనకు తీవ్రమైన పోటీ ఇచ్చారు.
భూవ్యాపారి, గుంజూరు శ్రీనివాస రెడ్డి భాజపా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మాలూరులో జనతాదళ్ నుంచి భాజపాలోకి వచ్చిన కేఎస్ మంజునాథ గౌడకు తిరుగుబాటు అభ్యర్థి హూడి విజయకుమార్ పోటీ ఇస్తున్నారు. దళ్ నుంచి రామేగౌడ, కాంగ్రెస్ నుంచి కేవై నంజేగౌడ పోటీలో ఉన్నారు. కేజీఎఫ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రూపకళ శశిధర్ మరోసారి పోటీలో ఉండగా, దళ్ నుంచి డా.రమేశ్ బాబు, భాజపా అభ్యర్థి అశ్విని సంపంగి బరిలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గతంలో నగరాభివృద్ధి ప్రాథికార అధ్యక్షురాలిగా, జిల్లా పంచాయతీ సభ్యురాలిగా అశ్వినికి అనుభవం ఉంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్ల మధ్య గట్టి పోటీ నెలకొన్న విషయాన్ని పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. మరికొద్ది గంటల్లో ఈ బంగారు సీమ ప్రజా ప్రతినిధులెవరో తేలిపోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివరామయ్యల జయకేతనం
[ 20-05-2024]
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఏడాది పూర్తి కానుంది. లోక్సభ ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో వార్షికోత్సవ నిర్వహణ, సాధన సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కావడం లేదు. -
ప్చ్.. కానరాని ప్రజ్వల్ జాడ
[ 20-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్ పాస్పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
హోం శాఖను హైజాక్ చేశారు
[ 20-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మూసి వేసేందుకు సిట్ సన్నాహాలు చేసుకుంటోందని విపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని కొందరు మంత్రులు గుర్తించారని పేర్కొన్నారు. హోం శాఖను ఎవరో హైజాక్ చేయడంతో, ప్రభుత్వమే నిందితుని స్థానంలో నిలబడిందని వ్యాఖ్యానించారు. -
కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
[ 20-05-2024]
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. -
వంతెనపై జాలీ రైడ్
[ 20-05-2024]
యలహంక ఉపరితల వంతెనపై తన స్నేహితురాలిని బైకు ముందు భాగంలోని పెట్రోల్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని ఒక యువకుడు బైకుపై జాలీరైడ్కు వెళ్లాడు. -
నకిలీ సిమ్కార్డులతో సైబర్ నేరాలు
[ 20-05-2024]
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజుల జాగారం
[ 20-05-2024]
తల్లి చనిపోయిందన్న అవగాహన లేకుండా శవం పక్కనే ఒక మహిళ నాలుగు రోజులు జాగారం చేసిన ఘటన ఇది. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. -
యశోద ఆత్మహత్యాయత్నం
[ 20-05-2024]
తన అక్క అంజలి అంబిగేర హత్యకు గురి కావడంతో వ్యధకు గురైన ఆమె సోదరి యశోద శనివారం రాత్రి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తక్షణమే ఆమెను చికిత్స కోసం కిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
ఆకట్టుకున్న దేశీయ బియ్యం మేళా
[ 20-05-2024]
కనుమరుగైపోతున్న వడ్ల రకాలు, బియ్యాన్ని, ఇతర దేశవాళీ విత్తనాలను నంజరాజ బహద్దూరు ఛత్రంలో శనివారం ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రదర్శన, విక్రయాలు కొనసాగాయి. కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్లో విక్రయానికి రాని బియ్యం, వడ్లను రైతులు మేళాకు తీసుకు వచ్చారు. -
పోలీసులను బెదిరించిన భాజపా ఎమ్మెల్యే
[ 20-05-2024]
అక్రమ క్వారీయింగ్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యే హరీశ్ పూంజా బెళ్తంగడి ఠాణాకు శనివారం రాత్రి వచ్చారు. మీరు నా వాహనాలను, నా మనుషులను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను బెదిరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
-
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!