బాదర్లి ‘పంచ్’పటాకా
త్రిముఖ పోటీలో ఉత్కంఠ కలిగించిన సింధనూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాదర్లి హంపనగౌడ విజయకేతనం ఎగురవేశారు.
ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రాలు అధికారుల నుంచి స్వీకరిస్తున్న బాదర్లి
సింధనూరు, న్యూస్టుడే: త్రిముఖ పోటీలో ఉత్కంఠ కలిగించిన సింధనూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాదర్లి హంపనగౌడ విజయకేతనం ఎగురవేశారు. ఈ క్షేత్రంలో అయిదోసారి గెలిచి ఎమ్మెల్యేగా తన పేరిటే ఉన్న రికార్డును సొంతం చేసుకున్నారు. శనివారం ఉదయం రాయచూరులో ఓట్లు లెక్కింపు ఆరంభ దశ నుంచే బాదర్లి ఆధిక్యతను చాటుకున్నారు. పోస్టల్ ఓట్ల దగ్గర నుంచి చివరిన 20వ రౌండు వరకూ ముందుకు దూసుకెళ్లారు. ఆయన తన సమీప ప్రత్యర్థి భాజపా అభ్యర్థి కె.కరియప్పపై 21,991 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ద్వితీయస్థానం కోసం భాజపా కె.కరియప్ప, జేడీఎస్ అభ్యర్థి నాడగౌడ నువ్వా-నేనా అంటూ పోటీ పడినా ఆ స్థానాన్ని కరయప్పే భర్తీ చేశారు. విజేత బాదర్లి 73,183 ఓట్లు పొందగా, భాజపా కె.కరియప్ప 51,192 ఓట్లు సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాడగౌడకు 43,261 ఓట్లు దక్కాయి. తీవ్రస్థాయిలో ప్రచారంలో నిలిచి సంచలనం కలిగిస్తారని భావించిన కేఆర్పీపీ అభ్యర్థి నెక్కంటి మల్లికార్జునకు 2,133 ఓట్లే పోలయ్యాయి. ఆప్ అభ్యర్థి సంగ్రామ్కు 1388 ఓట్లు పడగా, నోటా ఖాతాలో 1057 ఓట్లు పోలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివరామయ్యల జయకేతనం
[ 20-05-2024]
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఏడాది పూర్తి కానుంది. లోక్సభ ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో వార్షికోత్సవ నిర్వహణ, సాధన సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కావడం లేదు. -
ప్చ్.. కానరాని ప్రజ్వల్ జాడ
[ 20-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్ పాస్పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
హోం శాఖను హైజాక్ చేశారు
[ 20-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మూసి వేసేందుకు సిట్ సన్నాహాలు చేసుకుంటోందని విపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని కొందరు మంత్రులు గుర్తించారని పేర్కొన్నారు. హోం శాఖను ఎవరో హైజాక్ చేయడంతో, ప్రభుత్వమే నిందితుని స్థానంలో నిలబడిందని వ్యాఖ్యానించారు. -
కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
[ 20-05-2024]
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. -
వంతెనపై జాలీ రైడ్
[ 20-05-2024]
యలహంక ఉపరితల వంతెనపై తన స్నేహితురాలిని బైకు ముందు భాగంలోని పెట్రోల్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని ఒక యువకుడు బైకుపై జాలీరైడ్కు వెళ్లాడు. -
నకిలీ సిమ్కార్డులతో సైబర్ నేరాలు
[ 20-05-2024]
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజుల జాగారం
[ 20-05-2024]
తల్లి చనిపోయిందన్న అవగాహన లేకుండా శవం పక్కనే ఒక మహిళ నాలుగు రోజులు జాగారం చేసిన ఘటన ఇది. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. -
యశోద ఆత్మహత్యాయత్నం
[ 20-05-2024]
తన అక్క అంజలి అంబిగేర హత్యకు గురి కావడంతో వ్యధకు గురైన ఆమె సోదరి యశోద శనివారం రాత్రి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తక్షణమే ఆమెను చికిత్స కోసం కిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
ఆకట్టుకున్న దేశీయ బియ్యం మేళా
[ 20-05-2024]
కనుమరుగైపోతున్న వడ్ల రకాలు, బియ్యాన్ని, ఇతర దేశవాళీ విత్తనాలను నంజరాజ బహద్దూరు ఛత్రంలో శనివారం ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రదర్శన, విక్రయాలు కొనసాగాయి. కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్లో విక్రయానికి రాని బియ్యం, వడ్లను రైతులు మేళాకు తీసుకు వచ్చారు. -
పోలీసులను బెదిరించిన భాజపా ఎమ్మెల్యే
[ 20-05-2024]
అక్రమ క్వారీయింగ్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యే హరీశ్ పూంజా బెళ్తంగడి ఠాణాకు శనివారం రాత్రి వచ్చారు. మీరు నా వాహనాలను, నా మనుషులను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను బెదిరించారు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..