వసతులపై పట్టింపేది?
వివిధ పథకాలు, సేవలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఆర్టీసీ వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. మండల కేంద్రాలు, ఇతర పెద్ద గ్రామాల్లోని బస్టాండ్లలో కనీస వసతులు లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది.
ప్రాంగణాల్లో నిరుపయోగంగా మరుగుదొడ్లు
తాగునీటికి ఇక్కట్లు
పాలెంలో నిరుపయోగంగా మారిన మరుగుదొడ్లు
బిజినేపల్లి,తెల్కపల్లి, న్యూస్టుడే : వివిధ పథకాలు, సేవలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఆర్టీసీ వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. మండల కేంద్రాలు, ఇతర పెద్ద గ్రామాల్లోని బస్టాండ్లలో కనీస వసతులు లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. చర్యలు చేపట్టాల్సిన ఆర్టీసీ అధికారులు మాత్రం.. ఆ దిశగా స్పందించడం లేదు. మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించకపోవడంతో వృద్ధులు, మహిళా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.
* వేసవి సెలవులు ముగుస్తుండటంతో ప్రయాణికుల రాకపోకల దృష్ట్యా ప్రయాణ ప్రాంగణాల్లోనూ రద్దీ అధికమైంది. జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్కర్నూల్, కొల్లాపూర్ డిపోల పరిధిలో ఉన్న ప్రయాణ ప్రాంగణాల్లో నియోజకవర్గస్థాయిలో మినహా ఏ ఒక్క ప్రయాణ ప్రాంగణంలోనూ తాగునీటి వసతి లేదు. ప్రయాణికులు బస్టాండ్ సమీపంలోని దుకాణాలకు పరుగెత్తి నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. రూ.లక్షల వ్యయంతో నిర్మించిన మరుగుదొడ్లు నిర్వహణ లేక నిరుపయోగంగా మారాయి. బిజినేపల్లి మండలం పాలెంలో 20 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రయాణ ప్రాంగణంలో మరుగుదొడ్ల వసతి సక్రమంగా లేక వృద్ధులు, మహిళా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పాలెంలో వ్యవసాయ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు, విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నా.. వసతులు కల్పించడంలో అధికారులు చర్యలు చేపట్టడం లేదు. అధికారులు పర్యవేక్షణ లేక ప్రైవేటు వాహనాలకు అడ్డాగా మారింది. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లు ప్రారంభానికి నోచుకోవడం లేదు. తెలకపల్లి, తాడూరు, తిమ్మాజిపేట, కోడేరు, బల్మూరు, ఉప్పునుంతల, లింగాల, అమ్రాబాద్, వీపనగండ్ల, వెల్దండ తదితర మండల కేంద్రాల్లోని ప్రయాణ ప్రాంగణాల్లో తాగునీటి వసతి ఊసేలేదు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ, వసతులు కల్పించడంలో కొంతైనా చూపితే ఇక్కట్లు తీరుతాయని ప్రయాణికులు కోరుతున్నారు.
నివేదికలు పంపించాం..
ప్రయాణ ప్రాంగణాల్లో తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించేందుకు అధికారులకు నివేదికలు పంపించాం. పాలెం ప్రయాణ ప్రాంగణం మరమ్మతులకు ఇటీవలే నిధులు మంజూరయ్యాయి. టెండరు ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే మరుగుదొడ్లు, తాగునీటి వసతి ఏర్పాటుచేస్తాం.
భూక్యా ధరమ్సింగ్, డిపో మేనేజర్ నాగర్కర్నూల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారుల చోద్యం.. అటకెక్కిన వైద్యం
[ 20-05-2024]
వివిధ పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసే కార్మికులు, చిరుద్యోగులు ప్రతి నెలా తమ జీతం నుంచి కొంత మొత్తం ఈఎస్ఐ(ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) వైద్యసేవల కోసం రుసుంగా చెల్లిస్తుంటారు. -
కళ్లు మూసుకుంటే మోసమే
[ 20-05-2024]
వానాకాలం సాగుకు సమయం అసన్నమవుతోంది. -
నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) - 2024 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 6వ తేదీ వరకు రోజూ పరీక్ష నిర్వహిస్తారు. -
స్ట్రాంగ్రూంల వద్ద పకడ్బందీ భద్రత
[ 20-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద నిరంతరం భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించాలని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ సూచించారు. -
పంచాయతీల్లో పైసల్లేవ్..!
[ 20-05-2024]
గ్రామపంచాయతీ పాలక మండలి గడువుకు ముందే అధికారుల ఒత్తిడితో పలు అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు ఇప్పటికీ వాటి బిల్లులు దక్కలేదు. -
డిజిటల్ విద్యకే అధిక ప్రాధాన్యం
[ 20-05-2024]
ఏటా సర్కారు బడులకు రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నా.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో వెనక్కి వెళ్తున్న పరిస్థితులున్నాయి. -
సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. -
స్థానిక సమరానికి సమాయత్తం
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. -
నాటే సమయం వచ్చింది.. మొక్కలేవీ?
[ 20-05-2024]
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. -
మళ్లీ చౌకగా నిత్యావసరాలు!
[ 20-05-2024]
రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు తక్కువ ధరకు ఇతర నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
విద్యార్థులను ప్రోత్సహించాలి: చిన్నారెడ్డి
[ 20-05-2024]
చదువుపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. -
నిర్వాసితులను మోసంచేసిన వారిపై చర్యలు తీసుకోండి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశచూపి పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ బక్కన్న తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన ప్రశాంత్ కిశోర్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..