జిల్లాలో జల సంరక్షణ భేష్
నీటి సంరక్షణకు జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి డోనర్ హవోకిప్ ప్రశంసించారు. జలశక్తి అభియాన్ ద్వారా నీటి సంరక్షణ, భూగర్భజలాల
కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి
మాట్లాడుతున్న నోడల్ అధికారి డోనర్ హవోకిప్, పాలనాధికారి హరీష్, డీపీవో తరుణ్కుమార్, డీఈవో రమేశ్కుమార్, తదితరులు
మెదక్, న్యూస్టుడే: నీటి సంరక్షణకు జిల్లాలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలు బాగున్నాయని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నోడల్ అధికారి డోనర్ హవోకిప్ ప్రశంసించారు. జలశక్తి అభియాన్ ద్వారా నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపునకు గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉద్యాన, ఇంజినీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాలను బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మెదక్లోని కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. పర్యావరణ సమతౌల్యానికి చేపట్టిన అడవుల పెంపకం, పల్లెప్రకృతి వనాలు, బృహత్ పల్లెప్రకృతి వనాల పెంపు బాగున్నాయని కితాబునిచ్చారు. తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. పాలనాధికారి హరీష్ మాట్లాడుతూ.. ఆరేళ్లుగా నీటి వనరుల సంరక్షణకు పలు కార్యక్రమాలు చేపట్టామని, అవి సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. వాన నీటిని, సంప్రదాయ నీటి వనరుల రక్షణకు గ్రామీణ ఉపాధి హామీ పథకం, సోషల్ ఫారెస్ట్రీ, నీటి పారుదల, తదితర శాఖల ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టామన్నారు. చెక్డ్యాంలు, ఫీడర్ ఛానళ్లు, ఫాంపండ్, ఇంకుడుగుంతలు నిర్మాణం చేపట్టామని, తద్వారా జిల్లాలో 7 మీ. మేర భూగర్భజలాలు పెరిగాయన్నారు. జిల్లాలోని 2,389 చెరువులు పూర్తి నీటి నిల్వ సామర్థ్యంతో ఉన్నాయని తెలిపారు. జల వనరులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతున్నామని వివరించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం నీటి వనరుల సంరక్షణకు ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలపై తగు సూచనలు చేయాలని కేంద్ర బృందాన్ని కోరారు. డీఆర్డీవో శ్రీనివాస్ జిల్లాలో అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జడ్పీ సీఈవో శైలేష్, డీపీవో తరుణ్కుమార్, డీఈవో రమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ్య
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు