ప్రతిపాదనలకే పరిమితం
చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తోంది. విద్యతోపాటు ఆయా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు.
కార్యరూపం దాల్చని అంగన్వాడీ సొంత భవనాలు
మారేపల్లిలో అద్దె ఇంట్లో కొనసాగుతున్న కేంద్రం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తోంది. విద్యతోపాటు ఆయా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. చాలా చోట్ల అసౌకర్యాల మధ్య అద్దె భవనాల్లో కేంద్రాలు కొనసాగుతున్నాయి. అద్దె తక్కువగా ఉండటంతో అంతకంటే ఎక్కువ సదుపాయాలు కల్పించలేమని యజమానులు చెబుతున్నారు. చిన్నారుల ఇబ్బందులు తీర్చాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా సొంత భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపించి.. ఏడాది అవుతున్నా కార్యరూపం దాల్చని తీరుపై కథనం.
సదుపాయాలు కరవు
జిల్లాలో 1,504 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 450 చోట్ల మాత్రమే సొంత భవనాలున్నాయి. గ్రామ పంచాయతీకి చెందిన భవనాలు, సామూహిక భవనాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్నవి 432 ఉన్నాయి. 622 కేంద్రాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. గతంలో నగర ప్రాంతాల్లో రూ.5వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.3వేలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.750 చొప్పున అద్దెగా చెల్లిస్తుండగా రెండేళ్ల కిందట ఆ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగర, పట్టణ ప్రాంతాల్లో రూ.వెయ్యి చొప్పున పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రానికి ఇల్లు, భవనం అద్దెకు ఇచ్చిన వారికి రూ.వెయ్యి చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. అద్దె భవనాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సొంత భవనాలు కాకపోవడంతో ప్రభుత్వం నుంచి మరమ్మతులు, ఇతర నిర్వహణ నిధులు సైతం అందని పరిస్థితి.
ఏడాది దాటినా..: అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల కోసం ప్రతిపాదనలు పంపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా నుంచి తొలి విడతగా 75 భవనాలకు ఏడాది కిందట ప్రతిపాదనలు పంపారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయించనున్నట్లు అప్పట్లో పేర్కొన్నారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.12లక్షల వరకు కేటాయించనున్నట్లు తెలిపినా ఇప్పటి వరకు నిధుల ఊసేలేదు. భవనాల నిర్మాణం పూర్తయితే ఇరుకు గదుల్లో చిన్నారులు ఎదుర్కొంటున్న అవస్థలు దూరమయ్య అవకాశం ఉంటుంది. తాగునీటి వసతి, శౌచాలయాలు, ఆట స్థలం తదితర సదుపాయాలు సమకూర్చేందుకు వీలుంటుంది.
నిధులు విడుదల కావాల్సి ఉంది
-పద్మావతి, జిల్లా సంక్షేమాధికారిణి
అప్పటి పాలనాధికారి హనుమంతరావు ఆమోదంతో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల కోసం ఏడాది కిందట ప్రతిపాదనలు పంపాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. నిధులు రాగానే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకుంటాం. సొంత భవనాల్లో చిన్నారులకు అవసరమైన సదుపాయాలన్నీ ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఒట్టేశారు.. ఓటేశారు!
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..