ప్రతిపాదనలకే పరిమితం
చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తోంది. విద్యతోపాటు ఆయా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు.
కార్యరూపం దాల్చని అంగన్వాడీ సొంత భవనాలు
మారేపల్లిలో అద్దె ఇంట్లో కొనసాగుతున్న కేంద్రం
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తోంది. విద్యతోపాటు ఆయా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. చాలా చోట్ల అసౌకర్యాల మధ్య అద్దె భవనాల్లో కేంద్రాలు కొనసాగుతున్నాయి. అద్దె తక్కువగా ఉండటంతో అంతకంటే ఎక్కువ సదుపాయాలు కల్పించలేమని యజమానులు చెబుతున్నారు. చిన్నారుల ఇబ్బందులు తీర్చాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా సొంత భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపించి.. ఏడాది అవుతున్నా కార్యరూపం దాల్చని తీరుపై కథనం.
సదుపాయాలు కరవు
జిల్లాలో 1,504 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 450 చోట్ల మాత్రమే సొంత భవనాలున్నాయి. గ్రామ పంచాయతీకి చెందిన భవనాలు, సామూహిక భవనాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్నవి 432 ఉన్నాయి. 622 కేంద్రాలు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. గతంలో నగర ప్రాంతాల్లో రూ.5వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.3వేలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.750 చొప్పున అద్దెగా చెల్లిస్తుండగా రెండేళ్ల కిందట ఆ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగర, పట్టణ ప్రాంతాల్లో రూ.వెయ్యి చొప్పున పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రానికి ఇల్లు, భవనం అద్దెకు ఇచ్చిన వారికి రూ.వెయ్యి చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. అద్దె భవనాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సొంత భవనాలు కాకపోవడంతో ప్రభుత్వం నుంచి మరమ్మతులు, ఇతర నిర్వహణ నిధులు సైతం అందని పరిస్థితి.
ఏడాది దాటినా..: అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల కోసం ప్రతిపాదనలు పంపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా నుంచి తొలి విడతగా 75 భవనాలకు ఏడాది కిందట ప్రతిపాదనలు పంపారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయించనున్నట్లు అప్పట్లో పేర్కొన్నారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.12లక్షల వరకు కేటాయించనున్నట్లు తెలిపినా ఇప్పటి వరకు నిధుల ఊసేలేదు. భవనాల నిర్మాణం పూర్తయితే ఇరుకు గదుల్లో చిన్నారులు ఎదుర్కొంటున్న అవస్థలు దూరమయ్య అవకాశం ఉంటుంది. తాగునీటి వసతి, శౌచాలయాలు, ఆట స్థలం తదితర సదుపాయాలు సమకూర్చేందుకు వీలుంటుంది.
నిధులు విడుదల కావాల్సి ఉంది
-పద్మావతి, జిల్లా సంక్షేమాధికారిణి
అప్పటి పాలనాధికారి హనుమంతరావు ఆమోదంతో అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల కోసం ఏడాది కిందట ప్రతిపాదనలు పంపాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. నిధులు రాగానే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకుంటాం. సొంత భవనాల్లో చిన్నారులకు అవసరమైన సదుపాయాలన్నీ ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరి దరి చేరాలంటే..గులాబీ గుబాళించాలి
[ 09-05-2024]
నర్సాపూర్ ప్రాంతంలోని లక్షల ఎకరాల పొలాలు సస్యశ్యామలం చేసేందుకు, శాశ్వతంగా సాగు నీరందించేందుకు కాళేశ్వరం ప్రధాన కాల్వల పనులను ప్రారంభించాం.. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుందన్న నమ్మకం లేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
నేతల చూపు.. పల్లెల వైపు
[ 09-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో ఉంటారు. -
‘భాజపాతోనే దేశాభివృద్ధి’
[ 09-05-2024]
దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా అధికారంలో ఉండాలని, ప్రధాని మోదీతోనే సాధ్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. -
జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు: మంత్రి సురేఖ
[ 09-05-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని మంత్రి కొండా సురేఖ అన్నారు. -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
[ 09-05-2024]
‘లోక్సభ ఎన్నికల సమర్థ నిర్వహణకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. పటిష్ఠ నిఘాతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. -
షెట్కార్ విజయానికి కృషి చేయండి: మంత్రి
[ 09-05-2024]
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
మాదిగలను మోసం చేసిన సీఎం రేవంత్, కేసీఆర్: మందకృష్ణ
[ 09-05-2024]
మాదిగలను సీఎం రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. -
‘రివర్స్ గేర్లో రాష్ట్రంలో పాలన’
[ 09-05-2024]
‘కొత్త ప్రభుత్వం అధికారంలో వస్తే మంచి పథకాలు రావాలి... ప్రజలకు మేలు జరగాలి... అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక పాలన పూర్తిగా రివర్స్ గేర్లో నడుస్తుంది.. మార్పు రావాలి మార్పు రావాలి అన్నారు. -
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
[ 09-05-2024]
రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్, మరోవైపు భాజపా నాయకులు అస్థిర పరిచేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. -
నవోన్మేశమే.. ‘యువా’శయం
[ 09-05-2024]
ఎన్నికలు ఏవైనా.. యువ భాగస్వామ్యం కీలకం. వారు తీసుకునే నిర్ణయం సమాజ ప్రగతికి దోహదపడుతుంది. -
రేవంత్రెడ్డి.. మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం
[ 09-05-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి.. స్వల్ప కాలంలోనే మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్