వినతుల సమర్పణ.. పరిష్కారానికి కార్యాచరణ
ధరణి కార్యక్రమం అమలవుతున్నా... భూసమస్యలు తీరడం లేదు. ప్రతి వారం నిర్వహించే ప్రజావాణిలో భూ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తుతున్నాయి.
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాజర్షిషా, అదనపు పాలనాధికారిణి
మెదక్, న్యూస్టుడే: ధరణి కార్యక్రమం అమలవుతున్నా... భూసమస్యలు తీరడం లేదు. ప్రతి వారం నిర్వహించే ప్రజావాణిలో భూ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పాలనాధికారి రాజర్షిషా, అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్, డీఆర్డీవో శ్రీనివాస్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 81 అర్జీలు అందగా, అందులో 41 ధరణి, భూసమస్యలు, పోడుభూములకు సంబంధించినవి వచ్చాయి. మిగతావి రెండుపడకగదుల ఇళ్లు, ఆసరా పింఛన్లు, రేషన్కార్డులు అందడం లేదని ఇచ్చారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తూ వెబ్సైట్లో వివరాలను పొందుపర్చాలని పాలనాధికారి, జిల్లా అధికారులకు సూచించారు. పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించేలా కృషిచేయాలని, ప్రత్యేక తరగతులను మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. లోటుపాట్లను డీఈవోకు తెలియజేయాలన్నారు.
వసతులు లేక సతమతం
మెదక్ పట్టణ పరిధి పిల్లికొట్టాల్లో నిర్మించిన రెండు పడకగదుల ఇళ్ల సముదాయాల వద్ద కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు నాగరాజు, లక్ష్మి, శంకరమ్మ, మంజుల, పద్ద, శ్యామల, రేణుక, లక్ష్మమ్మ, సిద్దమ్మ, యాదమ్మ వాపోయారు. విద్యుత్తు, మంచినీరు, మురుగుకాలువ సౌకర్యం లేదని వాపోయారు. మున్సిపల్ ట్యాంకర్ రెండు రోజులకోకసారి వస్తోందని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ లేక మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నట్టు వివరించారు.
పిల్లికొట్టాల్లోని రెండు పడకగదుల ఇళ్ల వద్ద సౌకర్యాలు లేవని చెబుతున్న మహిళలు
తప్పుడు పౌతీ చేశారు
- వెంకటేశ్యాదవ్, తూప్రాన్
తూప్రాన్లో మా తాత పెంటయ్య పేరిట 19 గుంటల భూమి ఉంది. ఆయన మరణాంతరం ముగ్గురు కొడుకులకు రావాల్సిన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, తమ చిన్నాన్న అబోతు కొమురయ్య కొనుగోలు చేసినట్టు 2021లో తహసీల్దార్ కార్యాలయంలో పౌతీ ద్వారా మార్పిడి చేశారు. దీనిని రద్దు చేసి మా తాతకు చెందిన ముగ్గురు కొడుకులకు ఇప్పించాలి.
దళిత బంధు ఇప్పించాలి
- అబ్బుగారి యాదగిరి, నారాయణపూర్, నర్సాపూర్
పుట్టుకతో దివ్యాంగుడిని కావడంతో ఎలాంటి పనులు చేయలేకపోతున్నా. భార్య కూలిపనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తల్లి పేరిట 25 గుంటల వ్యవసాయ భూమి తప్ప, ఎలాంటి ఆస్తులు లేవు. పదో తరగతి వరకు చదివి, కంప్యూటర్లో శిక్షణ పొందా. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం లేదా, దళితబంధు ద్వారా ఆర్థికసాయం ఇప్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ్య
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు