వినతుల సమర్పణ.. పరిష్కారానికి కార్యాచరణ
ధరణి కార్యక్రమం అమలవుతున్నా... భూసమస్యలు తీరడం లేదు. ప్రతి వారం నిర్వహించే ప్రజావాణిలో భూ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తుతున్నాయి.
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రాజర్షిషా, అదనపు పాలనాధికారిణి
మెదక్, న్యూస్టుడే: ధరణి కార్యక్రమం అమలవుతున్నా... భూసమస్యలు తీరడం లేదు. ప్రతి వారం నిర్వహించే ప్రజావాణిలో భూ సమస్యలపై అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో పాలనాధికారి రాజర్షిషా, అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్, డీఆర్డీవో శ్రీనివాస్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 81 అర్జీలు అందగా, అందులో 41 ధరణి, భూసమస్యలు, పోడుభూములకు సంబంధించినవి వచ్చాయి. మిగతావి రెండుపడకగదుల ఇళ్లు, ఆసరా పింఛన్లు, రేషన్కార్డులు అందడం లేదని ఇచ్చారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరిస్తూ వెబ్సైట్లో వివరాలను పొందుపర్చాలని పాలనాధికారి, జిల్లా అధికారులకు సూచించారు. పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించేలా కృషిచేయాలని, ప్రత్యేక తరగతులను మండల ప్రత్యేకాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. లోటుపాట్లను డీఈవోకు తెలియజేయాలన్నారు.
వసతులు లేక సతమతం
మెదక్ పట్టణ పరిధి పిల్లికొట్టాల్లో నిర్మించిన రెండు పడకగదుల ఇళ్ల సముదాయాల వద్ద కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు నాగరాజు, లక్ష్మి, శంకరమ్మ, మంజుల, పద్ద, శ్యామల, రేణుక, లక్ష్మమ్మ, సిద్దమ్మ, యాదమ్మ వాపోయారు. విద్యుత్తు, మంచినీరు, మురుగుకాలువ సౌకర్యం లేదని వాపోయారు. మున్సిపల్ ట్యాంకర్ రెండు రోజులకోకసారి వస్తోందని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ లేక మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నట్టు వివరించారు.
పిల్లికొట్టాల్లోని రెండు పడకగదుల ఇళ్ల వద్ద సౌకర్యాలు లేవని చెబుతున్న మహిళలు
తప్పుడు పౌతీ చేశారు
- వెంకటేశ్యాదవ్, తూప్రాన్
తూప్రాన్లో మా తాత పెంటయ్య పేరిట 19 గుంటల భూమి ఉంది. ఆయన మరణాంతరం ముగ్గురు కొడుకులకు రావాల్సిన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, తమ చిన్నాన్న అబోతు కొమురయ్య కొనుగోలు చేసినట్టు 2021లో తహసీల్దార్ కార్యాలయంలో పౌతీ ద్వారా మార్పిడి చేశారు. దీనిని రద్దు చేసి మా తాతకు చెందిన ముగ్గురు కొడుకులకు ఇప్పించాలి.
దళిత బంధు ఇప్పించాలి
- అబ్బుగారి యాదగిరి, నారాయణపూర్, నర్సాపూర్
పుట్టుకతో దివ్యాంగుడిని కావడంతో ఎలాంటి పనులు చేయలేకపోతున్నా. భార్య కూలిపనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. తల్లి పేరిట 25 గుంటల వ్యవసాయ భూమి తప్ప, ఎలాంటి ఆస్తులు లేవు. పదో తరగతి వరకు చదివి, కంప్యూటర్లో శిక్షణ పొందా. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం లేదా, దళితబంధు ద్వారా ఆర్థికసాయం ఇప్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోదావరి దరి చేరాలంటే..గులాబీ గుబాళించాలి
[ 09-05-2024]
నర్సాపూర్ ప్రాంతంలోని లక్షల ఎకరాల పొలాలు సస్యశ్యామలం చేసేందుకు, శాశ్వతంగా సాగు నీరందించేందుకు కాళేశ్వరం ప్రధాన కాల్వల పనులను ప్రారంభించాం.. ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుందన్న నమ్మకం లేదని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
నేతల చూపు.. పల్లెల వైపు
[ 09-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉండే ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో ఉంటారు. -
‘భాజపాతోనే దేశాభివృద్ధి’
[ 09-05-2024]
దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా అధికారంలో ఉండాలని, ప్రధాని మోదీతోనే సాధ్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. -
జిల్లాకు కేసీఆర్ చేసిందేమీ లేదు: మంత్రి సురేఖ
[ 09-05-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైందని మంత్రి కొండా సురేఖ అన్నారు. -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
[ 09-05-2024]
‘లోక్సభ ఎన్నికల సమర్థ నిర్వహణకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. పటిష్ఠ నిఘాతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. -
షెట్కార్ విజయానికి కృషి చేయండి: మంత్రి
[ 09-05-2024]
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. -
మాదిగలను మోసం చేసిన సీఎం రేవంత్, కేసీఆర్: మందకృష్ణ
[ 09-05-2024]
మాదిగలను సీఎం రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. -
‘రివర్స్ గేర్లో రాష్ట్రంలో పాలన’
[ 09-05-2024]
‘కొత్త ప్రభుత్వం అధికారంలో వస్తే మంచి పథకాలు రావాలి... ప్రజలకు మేలు జరగాలి... అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక పాలన పూర్తిగా రివర్స్ గేర్లో నడుస్తుంది.. మార్పు రావాలి మార్పు రావాలి అన్నారు. -
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
[ 09-05-2024]
రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ఒకవైపు మాజీ సీఎం కేసీఆర్, మరోవైపు భాజపా నాయకులు అస్థిర పరిచేందుకు కుట్ర చేస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. -
నవోన్మేశమే.. ‘యువా’శయం
[ 09-05-2024]
ఎన్నికలు ఏవైనా.. యువ భాగస్వామ్యం కీలకం. వారు తీసుకునే నిర్ణయం సమాజ ప్రగతికి దోహదపడుతుంది. -
రేవంత్రెడ్డి.. మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం
[ 09-05-2024]
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి.. స్వల్ప కాలంలోనే మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్