పూత రాలి.. తెగుళ్లు పెరిగి
మామిడికి ఏటా తెగుళ్ల బెడద పట్టిపీడిస్తోంది. నవంబర్, డిసెంబర్లో చలి తీవ్రత, తేనె మంచు, బూడిద, నల్లతామర తెగుళ్ల సమస్య ఉంటోంది.
తగ్గిన మామిడి దిగుబడి
మెదక్ మండల పరిధిలో కాపులేని మామిడి తోట
మెదక్ టౌన్, న్యూస్టుడే: మామిడికి ఏటా తెగుళ్ల బెడద పట్టిపీడిస్తోంది. నవంబర్, డిసెంబర్లో చలి తీవ్రత, తేనె మంచు, బూడిద, నల్లతామర తెగుళ్ల సమస్య ఉంటోంది. దీంతో ఈసారి మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీనికి తోడు దళారుల బెడద రైతులను వేధిస్తోంది. అందువల్ల సాగు రైతులతో పాటు కౌలుదారులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. మొదటిదశ పూతకు సంబంధించిన కాయలు తెంపడం కొనసాగుతోంది. మలి విడత కాయలను మరో పక్షం రోజుల్లో కోయనున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వపరంగా మామిడి కొనుగోలు చేపట్టి దళారుల నుంచి నష్టం రాకుండా చూడాలని రైతులు సంబంధిత అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా 2500-3000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. సాగులో మొదటి దశలో వివిధ తెగుళ్లతో కొంతమేర పూత, పిందెలు రాలిపోయాయి. వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలిచిన పూతకు సంబంధించి రైతులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో కొంతమేర దిగుబడులు వచ్చాయి. మొదటిదశ పూత ద్వారా కాసిన కాయలు ప్రస్తుతం తెంపుతున్నారు. ఇంకో వారం, పది రోజుల్లో ఇవి పూర్తికానున్నాయి. రెండో దశ పూతలో తెగుళ్లు తట్టుకొని దాదాపు 60 శాతం నిలవడంతో ప్రస్తుతం వాటి కాయలు ఉన్నాయి. ఇవికూడా మరో 15 రోజుల్లో తెంపనున్నారు.
దళారుల ఇష్టారాజ్యం
ప్రస్తుతం మార్కెట్లో మామిడి కిలోకు రూ.80-90 పలుకుతోంది. జిల్లాలో తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంట కావడంతో ఏటా హైదరాబాద్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ ఈ ఏడాది కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం దిగుబడులు తక్కువగా ఉండడంతో ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదు. మరోవైపు మామిడి రైతులకు దళారుల బెడద తప్పడం లేదు. వీరు నిర్ణయించిన ధరకే విక్రయించాలి. లేకపోతే కొనుగోలు చేసేవారు లేకుండా పోతారని రైతులు వాపోతున్నారు.
రూ.20 లక్షల పెట్టుబడి పెట్టాం
- సాయిలు, కౌలు రైతు, వ్యాపారి
గత 15 ఏళ్ల నుంచి పండ్ల వ్యాపారం చేస్తున్నాను. రెండేళ్ల నుంచి పలు రకాల తెగుళ్ల కారణంగా మామిడి దిగుబడి తగ్గింది. ఈ ఏడాది అయినా ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందని మెదక్-కామారెడ్డి జిల్లాలో రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టి 40 ఎకరాల మామిడి తోటలను కౌలుకు తీసుకున్నాం. కానీ తేనె మంచు తెగుళ్ల వల్ల పూత రాలిపోయి కాత తగ్గింది. ఇప్పుడే కోతలు ప్రారంభించగా, ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదు. ఈ ఏడాది సైతం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.
అవగాహన కల్పించాం
- నర్సయ్య, జిల్లా ఉద్యానశాఖ అధికారి
తెగుళ్లు పూతను తినేస్తున్న విషయం తెలియగానే పలు మామిడి తోటలను సందర్శించి రైతులకు తగు సూచనలు చేశాం. పూత దశలో వచ్చే తెగుళ్ల నివారణకు ఉద్యానశాఖ అధికారులు చెప్పే సూచనలు పాటించాలి. సాధారణంగా పూసిన పూతలో 90శాతం రాలిపోగా మిగిలిన 10శాతమే కాయలు కాస్తాయి. కానీ ఈ ఏడాది కేవలం 2శాతం పూత మాత్రమే మిగలడంతో దిగుబడి తగ్గింది. జిల్లా వ్యాప్తంగా 90 వేల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మత్తుమందు తయారీలో నలుగురు అరెస్టు
[ 18-06-2024]
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో 2.600 కిలో గ్రాముల ఆల్ఫోజలం మత్తుమందును న్యాబ్(NAB) గుమ్మడిదల పోలీసులు, అధికారులు పట్టుకున్నారు. -
నీటిని ఒడిసిపట్టరు.. మరమ్మతు కనరు!
[ 18-06-2024]
సాగు, తాగుకు ప్రధానమైన నీటి వనరుల అభివృద్ధికి నిధులు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా ఏళ్ల కిందట మరమ్మతు, ఇతర పనులకు నిధులు కేటాయించగా, ఆ తర్వాత మంజూరు లేక చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. -
తవ్వకాల్లో అక్రమార్కులు.. చోద్యం చూస్తున్న అధికారులు!
[ 18-06-2024]
అసైన్డు భూముల్లో అక్రమంగా మట్టి, మొరం తవ్వకాలు జరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో రైతులకు ప్రభుత్వం వీటిని కేటాయించింది. అయితే సాగుకు యోగ్యంగా లేవని వృథాగా ఉంచడంతో అక్రమార్కుల కన్ను వాటిపై పడింది. -
డిగ్రీ కళాశాల లేక.. చదువు ముందుకు సాగక..
[ 18-06-2024]
అందుబాటులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. ఏటా ఇంటర్మీడియట్లో అధికశాతం ఉత్తీర్ణత ఉంటున్నా, అందుకు తగ్గట్టుగా డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల నష్టపోతున్నారు. -
ఉపాధికి భరోసా.. భవిత ధీమా
[ 18-06-2024]
విద్యార్థి దశలోనే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్డీసీ) ఆధ్వర్యంలో వివిధ కోర్సులను ప్రవేశపెడుతోంది. -
‘భగీరథ’ ఇంటింటికీ చేరుతోందా?
[ 18-06-2024]
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు రూ.వేల కోట్లు వెచ్చించింది. -
కొనసాగుతున్న ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ
[ 18-06-2024]
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అర్హులైన స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు లభించాయి. స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు గుర్తించడంతో బదిలీల కోసం సీనియార్టీ జాబితాను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. -
రూ.16,742 కోట్లతో.. వార్షిక రుణ ప్రణాళిక ఖరారు
[ 18-06-2024]
జిల్లా యంత్రాంగం వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ నివేదికను త్వరలో కలెక్టర్ ఆమోదించి ఆవిష్కరించనున్నారు. జిల్లాలో 31 బ్యాంకులున్నాయి. వాటి పరిధిలో 250 శాఖల ద్వారా అన్ని వర్గాల వారికి సేవలు, లావాదేవీలు నిర్వహిస్తున్నారు. -
అల్లాహ్కు ప్రార్థన.. పేదలకు ఖుర్బానీ
[ 18-06-2024]
సిద్దిపేటలో బక్రీద్ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు సోమవారం ప్ర£త్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పేదలకు ఖుర్బానీ ఇచ్చి తమ ఔదార్యాన్ని చాటారు. -
బీమా కొత్తకొత్తగా.. కసరత్తులో యంత్రాంగం
[ 18-06-2024]
చిరుజల్లులు కురవగానే రైతన్నలు సంతోషంతో పొలం పనులు ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. విత్తనాలు వేయడం మొదలు శ్రమిస్తారు. ప్రకృతి వైపరీత్యాలకు చేతికి వచ్చే దశలో పంటలు నాశనమవుతున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఉద్యోగి జీతం కంటే.. ఆ శునకం కోసమే ఎక్కువ ఖర్చట!
-
వయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ రాజీనామా
-
ఇలాంటి వారు పైరసీ కంటే ప్రమాదకరం: విష్వక్ సేన్
-
ఎంపీగా.. ఎమ్మెల్యేగా కొనసాగితే తప్పేంటి? ఆర్ఎల్పీ నేత వాదన
-
తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
-
మా విషయంలో మీ జోక్యం ఎందుకు? చైనాపై తైవాన్ కీలక వ్యాఖ్యలు