స్థిరాస్తి వెంచర్లో పేలుడు పదార్థాల పట్టివేత
ఆలేరు జాతీయ రహదారి పక్కన ఉన్న జేఎస్ఆర్ సన్సిటీ స్థిరాస్తి వెంచర్లో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ రాజేష్చంద్ర తెలిపారు.
57 జిలిటెన్ స్టిక్స్, 51 డిటోనేటర్లు స్వాధీనం
భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే: ఆలేరు జాతీయ రహదారి పక్కన ఉన్న జేఎస్ఆర్ సన్సిటీ స్థిరాస్తి వెంచర్లో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ రాజేష్చంద్ర తెలిపారు. నిందితుల నుంచి 57 జిలిటెన్ స్టిక్స్, 51 డిటోనేటర్లు, వైర్ల బండిళ్లు మూడు, ఒక కంప్రెషర్ ట్రాక్టర్, మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను తెలిపారు. తాడేపల్లి నారాయణ భూములను చదును చేసే పనులు చేస్తుంటాడు. వెంచర్ యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నారాయణ దగ్గర యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన ఎన్నా మల్లారెడ్డి, జనగాం జిల్లా పెంబర్తికి చెందిన సల్లగురుగుల శ్రీనివాస్ అలియాస్ రాజు ఆరు నెలల నుంచి పనిచేస్తున్నారు. నారాయణ ఒప్పుకున్న పనులు వీరికి అప్పగించాడు. తొందరగా పని అయ్యేలా పేలుడు పదార్థాలు వినియోగిస్తామని ఒప్పించారు. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లికి చెందిన కంప్రెషర్ ట్రాక్టర్ నడుపుతున్న అన్నదమ్ములు అలకుంట్ల కమాలాకర్, సుమాలాకర్తో అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. ఎస్వోటీ, ఆలేరు పోలీసులు సంయుక్తంగా గురువారం రాత్రి దాడులు జరిపి మల్లారెడ్డి, శ్రీనివాస్, కమలాకర్, సుమాలాకర్ను అదుపులోకి తీసుకుని పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. పేలుడు పదార్థాలు మహేందర్ అనే వ్యక్తి సరఫరా చేసినట్లు విచారణలో తేలిందని ప్రస్తుతం ఆ వ్యక్తితోపాటు నారాయణ పరారీలో ఉన్నట్లు డీసీపీ చెప్పారు. సమావేశంలో యాదగిరిగుట్ట ఏసీపీ నర్సింహ్మరెడ్డి, సీఐ నవీన్రెడ్డి, ఎస్సైలు ఇద్రీస్అలీ, వెంకట శ్రీను పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
నాడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన ప్రశాంత్ కిశోర్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..