సోదరుడి వరుస వ్యక్తితో కలిసి వివాహిత ఆత్మహత్య
వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆ మహిళ ఇంట్లోనే ఇద్దరు వేర్వేరు గదుల్లో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణాలకు పాల్పడ్డారు.
రాజేంద్రనగర్, న్యూస్టుడే: వరుసకు సోదరుడయ్యే వ్యక్తితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆ మహిళ ఇంట్లోనే ఇద్దరు వేర్వేరు గదుల్లో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణాలకు పాల్పడ్డారు. రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని హైదర్గూడ గుమ్మకొండకాలనీలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు, బాధిత కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కాసరాబాదుకు చెందిన చామంతి(28)కి యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారం గ్రామానికి చెందిన సోమేష్తో 2010లో వివాహం జరిగింది. పదేళ్ల క్రితమే వారు రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని అత్తాపూర్కు వచ్చి స్థిరపడ్డారు. ఐదేళ్ల క్రితం హైదర్గూడ గుమ్మకొండకాలనీలో సోదరుడు నర్సింహులుతో కలిసి సోమేష్ ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. మొదటి అంతస్తులో భార్యాపిల్లలతో కలిసి నర్సింహులు ఉంటుండగా.. కింది అంతస్తులో సోమేష్ కుటుంబం నివసి స్తోంది. సోమేష్ పలు కార్యాలయాలకు నీటిని సరఫరా చేస్తుండగా ఆయన భార్య చామంతి ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నర్సింహులు బావమరిది అయిన యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన శేఖర్(25) ఆర్నెల్ల క్రితం బావ వద్దకే వచ్చి నివసిస్తుండడంతో రెండు కుటుంబాలతో సఖ్యతతో మెలుగుతున్నాడు. మంగళవారం ఉదయం సోమేష్, నర్సింహులు, ఆయన భార్య ముగ్గురూ సూర్యాపేటలో ఓ దశదినకర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఉదయం ఎనిమిది గంటలకు పిల్లలను పాఠశాలకు పంపించిన చామంతి 10.30కు తల్లికి ఫోన్చేసి మాట్లాడింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి వచ్చిన పిల్లలు తలుపు తట్టగా తల్లి తీయలేదు. కిటికీ నుంచి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. హాల్లో చామంతి, పడకగదిలో శేఖర్ ఉరేసుకుని కనిపించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ధ్రువీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలి
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా కలెక్టరు హనుమంతు కే.జెండగే తెలిపారు. -
ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి
[ 20-05-2024]
ఎం.ఎల్.సి ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే సెక్టార్ ఆఫీసర్లకు, టీములకు సూచించారు. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ