నేనేంటీ.. నాకింత విలువేంటి..!
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.
నాంపల్లి, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. ఇంటింటి ప్రచారం, రోడ్డుషోలు, ర్యాలీలు నిర్వహిస్తూ రాజకీయాన్ని వేడెక్కిస్తూనే.. మరోవైపు రోజుకో చోట ఏదో ఒక పార్టీ వారిని తమ పార్టీలో చేర్చుకుంటూ తమ బలగాన్ని పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీల్లో కొన్ని రోజులుగా చేరికలు ఊపందుకున్నాయి. వాస్తవానికి ఈ చేరికలు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే కొనసాగుతున్నాయి. పార్టీలో చేరుతున్న వ్యక్తికి అంతకు ముందు పార్టీలో సభ్యత్వం ఉందా.. అతడు కార్యసాధకుడేనా.. ఇవేమీ అవసరం లేకుండా సామాన్య ఓటరైనా ఫ£ర్వాలేదు.. చేరికల సంఖ్య భారీగా ఉండాలనే తపన ఆయా పార్టీల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడికి కొత్తగా కండువా భుజాన పడగానే నాకింత విలువుందా అని సంబరపడుతున్నారు.
స్థాయికి మించి డిమాండ్
ఆయా పార్టీల్లో చేరుతున్న వారంతా సంబంధిత పార్టీలపై ఉన్న అభిమానం, అభ్యర్థిపై ఉన్న మమకారంతో చేరుతున్నారనుకుంటే పొరపడినట్లే. పార్టీలో చేరడానికి ముందే నాయకులకు బేరసారాలతో దిగుతున్నట్లు తెలుస్తోంది. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారి కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతుండగా.. మరికొందరు స్థానిక రాజకీయ పార్టీల నాయకుల ప్రోద్బలంతో ఆయా పార్టీల్లో చేరుతున్నారు. కొందరు స్థాయికి మించి డబ్బు డిమాండ్ చేస్తుండటంతో ప్రధాన పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. వారికిచ్చే మొత్తాలు ప్రచార వ్యయాన్ని మించిపోతుండటంతో కొందరు నాయకులు వేచి చూసే ధోరణి అవలంబిస్తుండగా.. మరి కొందరు ఏదో ఒక హామీ ఇస్తూ కండువాలు కప్పుతున్నారు. చివరికి కండువాలు కప్పుకున్న వారంతా ప్రచారంలో పాల్గొంటున్న దాఖలాలు లేవు. నాయకులు వచ్చినప్పుడు మాత్రమే దర్శనమిస్తూ ఆ తర్వాత కనుమరుగవుతున్నారు.
గుర్తింపు కార్డు లేకపోయినా..
వాస్తవానికి ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో చేరుతున్నారంటే వారి వద్ద అదివరకు పార్టీ జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండాలి. తాజాగా పార్టీలు మారుతున్న వారిలో 10 శాతం మందికి కూడా ఈ కార్డులు లేవు. కనీసం ఆ పార్టీలో ఎటువంటి పదవులు అనుభవించకపోయినా.. తాము సీనియర్ నాయకులమంటూ ఏ పార్టీలో గుర్తింపు కార్డు లేని వారిని తమ అనుచరులుగా చూపించి సామాన్య ఓటర్లకు సైతం సామూహికంగా కండువాలు కప్పేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లాలో కలెక్టర్ల బృందం పర్యటన
[ 18-06-2024]
తెలంగాణ క్యాడర్కు చెందిన ఏడుగురు అసిస్టెంట్ కలెక్టర్స్ ఎన్.ఉమా హారతి, ఆజ్మేరా సంకేత్ కుమార్, గరిమా నరుల, అభిజ్ఞాన్ మాలవీయ, అజయ్ యాదవ్, మృణాల్ శ్రేష్ట, ఐ.ఇ.ఎస్.ఎస్.డి.మనోజ్ (ఎఏఎస్-2023 బ్యాచ్) తెలంగాణ దర్శనిలో భాగంగా మంగళవారం జిల్లాలోని భువనగిరి కోటను సందర్శించి విశేషాలను తెలుసుకున్నారు. -
భూముల విలువ పెంపునకు కసరత్తు
[ 18-06-2024]
భూముల మార్కెట్ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో క్షేత్రస్థాయిలో సబ్రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు అధ్యయనం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ పెంపు ఉండాలని సర్కారు పెద్దల ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
రూ. 90 కోట్లతో నీలగిరి వేదిక
[ 18-06-2024]
నల్గొండలో నిర్మించతలపెట్టిన కళాభారతి నిర్మాణ ఆకృతితోపాటు పేరు కూడా నీలగిరి వేదికగా మారింది. నల్గొండ నడిబొడ్డున రోడ్ల భవనాలశాఖ, నీటిపారుదలశాఖ కార్యాలయాల స్థలంలో గత భారాస ప్రభుత్వం కళాభారతి నిర్మించాలని నిర్ణయించింది. -
చేనేత సంఘాల ఎన్నికలకు ముహూర్తమెప్పుడో..?
[ 18-06-2024]
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించడంతో కార్మికులు హర్షం ప్రకటిస్తున్నారు. ఆ సంఘాల సభ్యులు నూతన పాలక వర్గాలను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
ఇసుకాసురుల ఇష్టారాజ్యం
[ 18-06-2024]
ఇసుక కొరతను తీర్చేందుకు నార్కట్పల్లి మండలంలో ఇసుక డిపోల ఏర్పాటుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. -
ఇచ్చిన హామీలు పక్కాగా అమలు చేయాలి: జూలకంటి
[ 18-06-2024]
కేంద్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను పక్కాగా అమలు చేయాలని మాజీ శాసనసభ సభ్యుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటిరంగారెడ్డి అన్నారు. -
ఆరుద్రపైనే ఆశలు
[ 18-06-2024]
నైరుతి రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. మృగశిర కార్తెకంటే ముందే నైరుతి పలకరిస్తుందని వాతావరణ శాఖ చెప్పడంతో వానాకాలం సాగుపై రైతులు ఆశ పడ్డారు. -
ఎస్పీగా శరత్చంద్ర పవార్
[ 18-06-2024]
రాష్ట్ర యాంటి నార్కోటిక్ బ్యూరో ఇన్ఛార్జిగా పని చేస్తున్న శరత్ చంద్ర పవార్ నల్గొండ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం సోమవారం కేటాయించింది. -
తొలి మెట్టు.. భవితకు ఆయువుపట్టు
[ 18-06-2024]
పాఠశాల ప్రారంభం నుంచే విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపితే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. ఆ విషయాన్ని గ్రహించిన యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి నారాయణరెడ్డి ఇటీవల రాజపేటలోని బాలుర, బాలికల పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులకు సుమారు గంట పాటు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. -
మళ్లీ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ
[ 18-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా ప్రజాపాలన కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. లోక్సభ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం..
[ 18-06-2024]
పెళ్లి చేసుకుందామనుకున్న ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. -
సూర్యాపేట ఎస్పీ బదిలీ
[ 18-06-2024]
సూర్యాపేట నూతన ఎస్పీగా 2011 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సన్ప్రీత్ సింగ్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆలస్యమైతే విద్యుత్తు ముప్పు
[ 18-06-2024]
రానున్న రోజుల్లో విద్యుత్తు ముప్పు తప్పేలా లేదు. వానాకాలం సాగుకు సమస్యలు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సకాలంలో పరిష్కరించకపోతే రైతులు రోడ్డెక్కే అవకాశం ఉంది. గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. -
కవులు, కళాకారులకు నిలయం మోత్కూరు
[ 18-06-2024]
కవులు, కళాకారులు, గాయకులు, ఉద్యమకారులకు నిలయం మోత్కూరు అని తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. -
తీరని వారధి కష్టాలు
[ 18-06-2024]
వానాకాలం వచ్చిందంటే జిల్లాలోని పలుచోట్ల వాగులపై ఉన్న లోలెవల్ కాజ్వేలు ప్రమాదకరంగా మారుతున్నాయి. వర్షాలకు వరద పోటెత్తి రోజుల తరబడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను ఆమెలా ఉంటా.. అందుకే బాలీవుడ్లో అవకాశాలు: తాప్సీ
-
అక్రమ కేసులు రద్దు చేయాలి: లోకేశ్కు సీపీఎస్ ఉద్యోగుల విజ్ఞప్తి
-
నీట్ వివాదంపై ప్రధాని మౌనంగా ఎందుకున్నారు?
-
ఐటీఐలను ఆధునికీకరిస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
-
ఆల్టైమ్ గరిష్ఠాలకు సూచీలు.. 23,500 ఎగువన ముగిసిన నిఫ్టీ
-
పోలవరాన్ని జగన్ అధోగతి పాల్జేశారు: ఎమ్మెల్సీ అనురాధ