సైకో కిరాతకం
కన్న కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. అర్ధరాత్రి వ్యాయామం వద్దన్నందుకు సైకోగా మారి డంబెల్స్తో కొట్టి కడతేర్చాడు. అడ్డొచ్చిన సోదరి తలకూ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సుల్తాన్బజార్
అర్ధరాత్రి వ్యాయామం వద్దన్నందుకు డంబెల్స్తో తల్లిపై దాడి
పాపమ్మ సుధీర్కుమార్
సుల్తాన్బజార్, న్యూస్టుడే: కన్న కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. అర్ధరాత్రి వ్యాయామం వద్దన్నందుకు సైకోగా మారి డంబెల్స్తో కొట్టి కడతేర్చాడు. అడ్డొచ్చిన సోదరి తలకూ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సుల్తాన్బజార్ ఠాణా పరిధిలో జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కపల్లికి చెందిన కొండా రమేశ్, పాపమ్మ(45) దంపతులు. కొడుకు, కూతురు ఉన్నారు. బతుకుదెరువుకు కొన్నేళ్ల కిందటే నగరానికి వచ్చారు. అనారోగ్యంతో 8 ఏళ్ల క్రితం రమేశ్ మృతి చెందగా.. పాపమ్మ, కొడుకు సుధీర్కుమార్(24), కూతురు సుచిత్ర(25) రెండేళ్లుగా రాంకోఠిలో ఉంటున్నారు. డిగ్రీ చేసిన సుధీర్ కొన్నాళ్లు ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. మానసికస్థితి సరిగ్గా లేక ఏడాదిగా ఇంటివద్దే ఉంటున్న కొడుకుకి తల్లి చికిత్స చేయిస్తున్నారు. రోజులాగే ఆదివారం రాత్రి ముగ్గురూ నిద్రకు ఉపక్రమించారు. సుధీర్ తెల్లవారుజాము 2 గంటలకు లేచి వ్యాయామం చేస్తుండగా తల్లి వారించింది. విచక్షణ కోల్పోయిన ఆయన చేతిలోని డంబెల్స్తో తల్లి తలపై కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సోదరిపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి యజమాని కారు అద్దం ధ్వంసం చేశాడు. సుచిత్ర కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. గాయపడ్డ సుచిత్రను ఆసుపత్రికి.. పాపమ్మ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన, న్యాయమూర్తి (మెజిస్ట్రేట్) ఆదేశాల మేరకు సుధీర్కుమార్ను ఎర్రగడ్డమానసిక చికిత్సాలయానికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ భిక్షపతి తెలిపారు. మంచిగా ఉండేవాడు: అందరితో మంచిగా ఉండేవాడని, మానసికస్థితి కోల్పోయాక ఇలా మారాడాని సోదరి, స్థానికులు పోలీసులకు చెప్పారు. మంచి సినిమాలు తీయాలని దర్శకులకు, బాగా నటించాలని నటులకు సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపేవాడని తెలిసినట్లు పోలీసులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు