సైకో కిరాతకం
కన్న కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. అర్ధరాత్రి వ్యాయామం వద్దన్నందుకు సైకోగా మారి డంబెల్స్తో కొట్టి కడతేర్చాడు. అడ్డొచ్చిన సోదరి తలకూ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సుల్తాన్బజార్
అర్ధరాత్రి వ్యాయామం వద్దన్నందుకు డంబెల్స్తో తల్లిపై దాడి
పాపమ్మ సుధీర్కుమార్
సుల్తాన్బజార్, న్యూస్టుడే: కన్న కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. అర్ధరాత్రి వ్యాయామం వద్దన్నందుకు సైకోగా మారి డంబెల్స్తో కొట్టి కడతేర్చాడు. అడ్డొచ్చిన సోదరి తలకూ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సుల్తాన్బజార్ ఠాణా పరిధిలో జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కపల్లికి చెందిన కొండా రమేశ్, పాపమ్మ(45) దంపతులు. కొడుకు, కూతురు ఉన్నారు. బతుకుదెరువుకు కొన్నేళ్ల కిందటే నగరానికి వచ్చారు. అనారోగ్యంతో 8 ఏళ్ల క్రితం రమేశ్ మృతి చెందగా.. పాపమ్మ, కొడుకు సుధీర్కుమార్(24), కూతురు సుచిత్ర(25) రెండేళ్లుగా రాంకోఠిలో ఉంటున్నారు. డిగ్రీ చేసిన సుధీర్ కొన్నాళ్లు ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. మానసికస్థితి సరిగ్గా లేక ఏడాదిగా ఇంటివద్దే ఉంటున్న కొడుకుకి తల్లి చికిత్స చేయిస్తున్నారు. రోజులాగే ఆదివారం రాత్రి ముగ్గురూ నిద్రకు ఉపక్రమించారు. సుధీర్ తెల్లవారుజాము 2 గంటలకు లేచి వ్యాయామం చేస్తుండగా తల్లి వారించింది. విచక్షణ కోల్పోయిన ఆయన చేతిలోని డంబెల్స్తో తల్లి తలపై కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన సోదరిపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి యజమాని కారు అద్దం ధ్వంసం చేశాడు. సుచిత్ర కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారమిచ్చారు. గాయపడ్డ సుచిత్రను ఆసుపత్రికి.. పాపమ్మ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన, న్యాయమూర్తి (మెజిస్ట్రేట్) ఆదేశాల మేరకు సుధీర్కుమార్ను ఎర్రగడ్డమానసిక చికిత్సాలయానికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ భిక్షపతి తెలిపారు. మంచిగా ఉండేవాడు: అందరితో మంచిగా ఉండేవాడని, మానసికస్థితి కోల్పోయాక ఇలా మారాడాని సోదరి, స్థానికులు పోలీసులకు చెప్పారు. మంచి సినిమాలు తీయాలని దర్శకులకు, బాగా నటించాలని నటులకు సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపేవాడని తెలిసినట్లు పోలీసులు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జిల్లా అభివృద్ధి బాధ్యత నాది
[ 09-05-2024]
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. -
‘మోసపూరిత హామీలు నమ్మొద్దు’
[ 09-05-2024]
కాంగ్రెస్, భాజపాల మోసపూరిత హామీలు నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. -
నిఘా నీడన ఎన్నికలు
[ 09-05-2024]
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 09-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపుకోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
ఉపాధి కల్పించండి సారూ..
[ 09-05-2024]
ఉపాధి హామీ పనులు కల్పించడం లేదంటూ జిల్లాలో ఇటీవల కూలీలు నిరసన తెలుపుతున్నారు. -
ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు
[ 09-05-2024]
పీఎం కుసుమ్ పథకం కింద జిల్లాలో సౌర యూనిట్ల ఏర్పాటుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. -
ఎన్నికల ప్రచారం చివరి దశకు
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. -
స్కాన్ చెయ్.. చదివెయ్
[ 09-05-2024]
ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. -
అడ్డూఅదుపూ లేని అక్రమ దందా
[ 09-05-2024]
డిచ్పల్లిలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో మొరం, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. నిర్మాణాలు, ఇతర ప్రాంతాల్లో విక్రయించేందుకు వ్యాపారులు ఇష్టారీతిన తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. -
ఓట్ల పండగకు ఆహ్వానం
[ 09-05-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
పకడ్బందీ తనిఖీలు.. ప్రలోభాలపై చర్యలు
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్