600 కిలోల గంజాయి పట్టివేత
మోతుగూడెం పోలీస్స్టేషన్ చెక్పోస్టు వద్ద రెండు వేర్వేరు ఘటనల్లో రూ.18 లక్షల విలువైన 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మోతుగూడెం ఎస్సై వాసంశెట్టి సత్తిబాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.
పట్టుబడిన గంజాయి, వాహనాలు, నిందితులతో పోలీసులు
మోతుగూడెం, న్యూస్టుడే: మోతుగూడెం పోలీస్స్టేషన్ చెక్పోస్టు వద్ద రెండు వేర్వేరు ఘటనల్లో రూ.18 లక్షల విలువైన 600 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మోతుగూడెం ఎస్సై వాసంశెట్టి సత్తిబాబు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మోతుగూడెం పోలీస్స్టేషన్ చెక్పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ముందుగా చింతూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సుకుమామిడి గ్రామం నుంచి హైదరాబాద్కు ట్రక్కులో చేపల బాక్సుల మాటున 16 సంచుల్లో తరలిస్తున్న 400 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రంగారెడ్డి జిల్లాకు చెందిన నసీర్ అలీ, ఒడిశా రాష్ట్రం పప్పులూరు పంచాయతీలోని రాసబెడకు చెందిన సను ఖిలాను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మరో ఘటనలో కారు, ద్విచక్రవాహనాలపై సీలేరు సమీపంలోని వలసగెడ్డ నుంచి కామారెడ్డికి తరలిస్తున్న 200 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈ కేసులో కామారెడ్డి జిల్లాకు చెందిన భుక్యా ప్రవీణ్, నూకల మహేష్ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి ట్రక్కు, కారు, ద్విచక్ర వాహనం, నాలుగు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రంపచోడవరం కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు. తనిఖీల్లో ఏఎస్సైలు పట్టాభిరామయ్య, సత్తిబాబు, హెడ్ కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, రవిచంద్ర, సోమరాజు, ప్రసాద్, రాజేశ్వరరావు, సన్యాసిరావు, కానిస్టేబుళ్లు దుర్గ, రబ్బాని, సీఆర్పీఎఫ్ 42 బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు