అడిగింది రూ.8,400 కోట్లు... ఇచ్చింది రూ.10,012 కోట్లు
ఒడిశా రైల్వే రంగానికి కేంద్రం ప్రాధాన్యమిచ్చిందని, ఈ ఏడాదిలో (2023-24) రూ.8,400 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.10,012 కోట్లు బడ్జెట్లో సమకూర్చారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
ఒడిశా రైల్వేలకు ప్రాధాన్యం?: రైల్వేశాఖ మంత్రి
అశ్వినీ వైష్ణవ్
భువనేశ్వర్, న్యూస్టుడే: ఒడిశా రైల్వే రంగానికి కేంద్రం ప్రాధాన్యమిచ్చిందని, ఈ ఏడాదిలో (2023-24) రూ.8,400 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.10,012 కోట్లు బడ్జెట్లో సమకూర్చారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. శుక్రవారం సాయంత్రం దిల్లీలో కేంద్రమంత్రి విలేకరులతో మాట్లాడుతూ...ఈసారి జరిగిన కేటాయింపుల్లో కొత్త రైలు మార్గాల పనులకు రూ.2,564 కోట్లు, డబ్లింగ్ పనులకు రూ.3,800 కోట్లు ఖర్చవుతాయన్నారు. పూరీ జగన్నాథ్ రైల్వే స్టేషన్కు ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పించడం ధ్యేయంగా నిర్మాణాలు ప్రారంభం కాగా, భువనేశ్వర్ స్టేషన్ ఆధునికీకరణకూ సన్నాహాలు ముమ్మరం చేశామన్నారు. త్వరలో కటక్ కూడా మోడల్ స్టేషన్ కానుందని చెప్పారు. ఈ ఏడాదిలో ఒడిశాలోని 57 స్టేషన్ల ఆధునికీకరణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు.
త్వరలో వందే మెట్రో రైళ్లు
భువనేశ్వర్-పూరీ, కటక్-భువనేశ్వర్, ఝార్సుగుడ-రవుర్కెలా, సంబల్పూర్-ఝార్సుగుడల మధ్య వందేభారత్ మెట్రో రైళ్లు నడుస్తాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్నారు. అభివృద్ధి, సౌకర్యాలు ధ్యేయంగా రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ ఒడిశాలో రైల్వేలకు కేటాయింపులు పెంచారన్నారు. ఈ ఏడాదిలో రాష్ట్రంలోని అత్యధిక స్టేషన్ల ఆధునికీకరణ పనులు చేపడుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 2047 నాటికల్లా ‘వికసిత భారత్’ లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని రైల్వే ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చారన్నారు. విలేకరుల సమావేశంలో ఈస్కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ మనోజ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆధునిక సౌకర్యాలు కల్పించాల్సిన పూరీ స్టేషన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
[ 20-05-2024]
ఢంహరీత ధివల ప్రసాంది రాగా పరిధిలోని దింగురా జియన్ వద్ద పల్సర్ బైకును లారీ ఢీకొట్టింది. -
నోట్ల కట్టలతో బ్యాగు కలకలం
[ 20-05-2024]
నోట్ల కట్టలతో ఒక బ్యాగు లభించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖరగ్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ గదిలో ఓ కేసుకు సంబంధించిన వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నికలు బహిష్కరించిన గుడియాపట్నా గ్రామస్థులు
[ 20-05-2024]
ఒడిశాలోని గంజాం జిల్లా కన్నొకెముండి అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని గుడియా పట్నా గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. -
చెట్టును ఢీకొట్టిన మినీ ట్రక్.. డ్రైవర్ మృతి
[ 20-05-2024]
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి సమీపంలోని పుకిలి కూడలి వద్ద ఓ మినీ ట్రక్ అదుపుతప్పి చెట్టు ను ఢీకొట్టింది. -
రెండో విడత పోలింగ్.. ప్రిసైడింగ్ అధికారిణికి అస్వస్థత
[ 20-05-2024]
ఒడిశాలో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. సుందర్గఢ్ జిల్లాలోని 211వ పోలింగ్కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారిణి అస్వస్థతకు గురై కింద పడిపోయారు. -
నేడు రెండో విడత పోలింగ్
[ 20-05-2024]
రాష్ట్రంలో సోమవారం రెండోవిడత పోలింగ్ నిర్వహించనున్నారు. అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
33 వేల మంది పోలీసులతో బందోబస్తు
[ 20-05-2024]
రాష్ట్రంలో రెండోవిడత పోలింగ్ నేపథ్యంలో 33 వేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ అరుణ్ షడంగి చెప్పారు. -
రాష్ట్రాభివృద్ధే మా అజెండా: నవీన్
[ 20-05-2024]
రాష్ట్రాభివృద్ధే అజెండాగా తాము ముందుకెళుతున్నామని, విపక్షాల మాదిరిగా ఆడి తప్పబోమని, చెప్పింది చేస్తున్నామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు. -
ప్రజాశీస్సులు భాజపాకే ఉన్నాయి: ధర్మేంద్ర
[ 20-05-2024]
ఎన్నికల ధర్మయుద్ధంలో విజయావకాశాలు భాజపాకే ఉన్నాయని, అన్ని చోట్లా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ రాక నేపథ్యంలో ముందుగా శనివారం రాత్రి భువనేశ్వర్లోని పార్టీ కార్యాలయంలో కార్యవర్గ ప్రతినిధుల సమావేశం జరిగింది. -
చారిత్రక నగరం.. ఎవరికి అందేనో విజయం?
[ 20-05-2024]
చారిత్రక నగరం కటక్ ఈసారి ఎవరి సొంతమవుతుంది? ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారు?.. ఇద్దరు ఉద్ధండులు నువ్వా? నేనా? అన్న రీతిలో తల పడుతున్నారు. విజ్ఞతకు నిలువుటద్దమైన ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
మీ ముద్దు బిడ్డ దేశం గర్వించదగ్గ యువనేత
[ 20-05-2024]
ఈ రాష్ట్రానికి చెందిన మీ ముద్దుబిడ్డ దేశం గర్వించదగిన నేతగా ఎదిగారని, తన సామర్థ్యం నిరూపించుకున్నారని, ఆయన పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశంసించారు. -
సమీర్ రాజీనామా...
[ 20-05-2024]
పూరీ జిల్లాకు చెందిన బిజద అగ్రనేత, విద్యాశాఖ మాజీ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం బిజద ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి నవీన్కు లేఖ పంపించారు. -
నేడు పూరీలో మోదీ రోడ్షో
[ 20-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 7 గంటలకు భువనేశ్వర్ నుంచి పూరీకి వస్తారు. తాలబణియా తాత్కాలిక హెలిప్యాడ్లో దిగనున్న ఆయన నేరుగా శ్రీక్షేత్రానికి చేరుకుని జగన్నాథుని సన్నిధిలో పూజలు చేస్తారు. -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 20-05-2024]
నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బసంత కుమార్ నాయక్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్