ఈ రహదారిపై ప్రయాణం చేసేదెట్టా?
మండలంలోని వంతరాం గ్రామం నుంచి గళావల్లి వరకు వెళ్తున్న రహదారి చాలా చోట్ల గుమ్ములు, గోతులతో నిండి పోయింది.
బలిజిపేట: మండలంలోని వంతరాం గ్రామం నుంచి గళావల్లి వరకు వెళ్తున్న రహదారి చాలా చోట్ల గుమ్ములు, గోతులతో నిండి పోయింది. పదిహేనేళ్ల కిందట ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నిధులతో నిర్మించిన తారురోడ్డుపై నేటివరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టనందున పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రహదారిపై 12 చోట్ల పూర్తిగా రాళ్లుతేలాడుతూ గోతులతో దర్శనమిస్తోంది. ఈ మార్గంలో ద్విచక్రవాహనాలు, భారీ వాహనాలు ఈ రోడ్డును దాటేందుకు పలు అవస్థలు పడుతున్నారు. ఈ రహదారిలో తెర్లాం, బలిజిపేట, రాజాం, వంగర మండలాలకు చెందిన 20 గ్రామాల ప్రజలు నిత్యం వెళ్లి వస్తుంటారు. ఈ రోడ్డు అధ్వాన పరిస్థితుల వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఈ విషయంపై రోడ్లు, భవనాలశాఖ జేఈ జయరాజును ‘న్యూస్టుడే’ వివరణ కోరగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తదుపరి చర్యలు చేపడతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళల సాధికారతకు శ్రీకారం
[ 17-06-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధిపై దృష్టిసారిస్తోంది. మహిళలకు హామీ ఇచ్చిన మేరకు వారిని లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. -
వైకాపా పాపం..వాహనదారులకు శాపం
[ 17-06-2024]
ఉమ్మడి జిల్లాలో కీలకమైన బొబ్బిలిలోని పారాది కాజ్వే మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన పనులతో ఈ పరిస్థితి ఏర్పడింది. -
గోమాతకు సీమంతం
[ 17-06-2024]
గోవులపై తమకున్న ప్రేమను చాటుకున్నారు గుర్లకు చెందిన బాడాన రాజశేఖర్, సుధ దంపతులు. ఆదివారం మండల కేంద్రంలోని ఉమా సహిత కోటేశ్వరస్వామి ఆలయంలోని గోశాలలో తమ గోవుకు సీమంతం చేశారు. -
ఆధార్ అనుసంధానమైతేనే ఉపకారం
[ 17-06-2024]
ఎన్ఎంఎంఎస్(జాతీయ ఉపకారవేతన పరీక్ష)కు ఎంపికైన విద్యార్థుల బ్యాంకు ఖాతాకు ఆధారు నంబరు అనుసంధానం అయితేనే ఉపకార వేతనం లభించనుంది. -
అరకొరగా సేవలు
[ 17-06-2024]
గత ప్రభుత్వ హయాంలో అగ్రి ల్యాబ్లంటూ ఆర్భాటం చేసినా.. ఇంతవరకు ఉభయ జిల్లాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. -
నేలబావిలో ట్రాక్టరు బోల్తా: చోదకుడి దుర్మరణం
[ 17-06-2024]
నేలబావిలో ట్రాక్టర్ బోల్తాపడి ఓ ఇంటిపెద్ద దుర్మరణం చెందిన ఘటన లక్కవరపుకోట మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై గోపాలరావు వివరాల ప్రకారం.. -
అయిదేళ్లూ నాన్చేశారు..
[ 17-06-2024]
పాలకొండలోని జగన్నాథ రథయాత్ర ఉత్సవాల్లో గత అయిదేళ్లుగా భక్తులు అసౌకర్యాలకు గురవుతున్నారు. ఏటా పది రోజులపాటు జరిగే ఈ యాత్రలో సదుపాయాల కల్పన అంతంతమాత్రంగానే ఉంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’
-
ధార్ గ్యాంగ్.. మళ్లీ వచ్చేసింది
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/06/24)