తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.
మద్య నిషేధమంటూ మాయమాటలు
పీఠమెక్కగానే బార్లా తెరిచారు తలుపులు
తాగించిన పిచ్చి మందు రూ. 8 వేల కోట్లు
మద్యం అమ్మకాలంటే రక్తమాంసాలతో వ్యాపారం. మేం అధికారంలోకి వచ్చాక దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం. ఆ తర్వాతే 2024 ఎన్నికల్లో ఓటు అడుగుతాం...’
గత ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాయ మాటలు.
ఈనాడు, ఒంగోలు; న్యూస్టుడే, టంగుటూరు, కురిచేడు: అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. షాక్ కొట్టేలా ధరలుంటే మద్యం తాగరంటూ తనకు తానే సమర్థించుకుంటూ నాసిరకం బ్రాండ్లను తెచ్చారు. అస్తవ్యస్త విధానాలకు తోడు ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేశారు. ఏటికేడు మద్యం మత్తుకు బానిసైనవారి సంఖ్య పెరుగుతుండటం.. వారి ఆదాయంతో పాటు ఆరోగ్యాలు క్షీణిస్తుండటంతో బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
- ఏటికేడు పెరుగుతున్న రోగులు...: ఒంగోలు జీజీహెచ్లో 2020 జూన్లో వ్యసన విముక్తి కేంద్రం(డి-అడిక్షన్ సెంటర్) ఏర్పాటైంది. అప్పటి నుంచి వచ్చిన అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల సంఖ్య ఏటికేడు పెరుగుతూ వస్తోంది.
- కొండపి నియోజకవర్గానికి చెందిన ఓ వివాహిత ఇటీవల ఒంగోలు జీజీహెచ్కు తన భర్తను తీసుకొచ్చారు. ఆయనకు ఇరవై ఏళ్లుగా మద్యం తాగే అలవాటుంది. అయితే రెండు మూడేళ్లుగా మద్యం తాగినప్పుడల్లా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఏడాదిగా గుండెల్లో దడ, మంట, ఇతర సమస్యలు తలెత్తడంతో ఆమె చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చి పన్నెండు రోజులుగా ఇక్కడే ఉంటున్నారు.
- ఒక్కగానొక్క కుమారుడు తాగుడుకు బానిసయ్యాడు. కుటుంబ బాధ్యతలు తెలిస్తే అయినా తాగుడు మానతాడని అతని తల్లి భావించి యువకుడికి పెళ్లి చేశారు. పనికెళ్తే వచ్చే రూ. 500 తాగడానికే ఖర్చుచేస్తుండటంతో కుటుంబ పోషణ భారంగా మారింది. తాగుడు మానడం లేదని భార్య పుట్టింటికి వెళ్లి రానంటోంది. అయినా అతని తీరు మారలేదు. తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఇటీవల తన తల్లిని కొట్టడంతో ఆమె గాయాలపాలైంది.
- పదిహేనేళ్లుగా మద్యం తాగే అలవాటున్న అతను ఏనాడూ గతంలో అనారోగ్యం పాలవ్వలేదు. మందు తాగి రాత్రివేళ నిద్రపోయి మరుసటి రోజు మళ్లీ లేచి బేల్దారీ పనులకు వెళ్లేవారు. వైకాపా ప్రభుత్వం విక్రయిస్తున్న మద్యం తాగినప్పటి అజీర్ణం, గుండెల్లో మంట, నొప్పి, కండరాలు పట్టేయడం, తల తిప్పడం, నాలుక పిడచకట్టుకు పోవడం వంటి రోగాలు చుట్టుముట్టాయి. రోజూ బేల్దారీ పనికి వెళ్తే వచ్చే ఆదాయం కూడా కూడా మద్యానికే పోతోంది.
శానిటైజర్ తాగి బలి...
ప్రభుత్వ విధానాలతో మద్యం ధరలు పెరిగిపోవడం, కొవిడ్ కారణంలో పనులు లేకపోవడంతో పేద ప్రజలు, మద్యానికి బానిసలైనవారు ఇతర మార్గాలు ఎంచుకుంటున్నారు. స్పిరిట్, శానిటైజర్, నాటుసారా వైపు మళ్లుతున్నారు. ఈ క్రమంలోనే 2020లో శానిటైజర్ తాగి కురిచేడుతో పాటు, ఇతర చోట్ల మొత్తం పదమూడు మంది మృతి చెందిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. తాజాగా విశాఖ పోర్టులో పట్టుబడిన రూ.50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి చేసుకున్న సంస్థ అధినేతలది నాగులుప్పలపాడు మండలంలోని ఈదుమూడి గ్రామం కావడం కూడా గమనార్హం.
ఈ ఏడాది మార్చి వరకు అవుట్ పేషెంట్లు 595 ఆసుపత్రికి వచ్చారు. వీరిలో 36 మంది వ్యసన విముక్తి కేంద్రంలో చికిత్స పొందారు. వీరిలో నలుగురు లివర్ సిరోసిస్, పాంక్రియాస్ బాధితులున్నారు. ఇలా అయిదేళ్ల వైకాపా పాలనలో ఏటికేడు మద్యం, ఇతర మాదకద్రవ్యాల వ్యసనాలకు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతూ.. వారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్.. వైకాపా పోలీసింగ్
[ 19-05-2024]
జిల్లాలోని కొందరు పోలీసులు అధికార పార్టీ వైకాపా తొత్తులుగా మారారు. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలక ప్రక్రియ అయిన పోలింగ్లో తమ ముసుగు తొలగించారు. నిసిగ్గుగా ఓ వర్గం వైపు నిలిచి కొమ్ము కాశారు. -
పెట్టిందే తిను.. అడక్కు మెనూ
[ 19-05-2024]
ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో రోగులకు ఆకలి కేకలు తప్పడం లేదు. గుత్తేదారు పెట్టిందే భోజనం. ఆయన ఎప్పుడు పెడితే అప్పుడు.. ఏది ఇస్తే అదే తినాలి తప్ప మెనూ అమలు పట్టదు. కారం పొడితే అల్పాహారం అందించినా అదేమని అధికారులు అడగరు. -
2,14,832 మంది ఓటుకు దూరం
[ 19-05-2024]
2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. కొందరు గత అయిదేళ్లుగా జిల్లాలో అధికార పార్టీ నాయకులు సాగించిన అరాచకాలు, భూ ఆక్రమణలు, దందాలు, అక్రమ కేసులు, బెదిరింపులు తట్టుకోలేక ఓటేశారు. -
గెలుపోటముల్లో చెరి సగం
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరాయి. -
ఒంగోలుకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
[ 19-05-2024]
ఎన్నికల విధుల్లో ఉంటూ ఇతర జిల్లాలో ఓటు వేసిన పోస్టల్ బ్యాలెట్లు శనివారం ఒంగోలుకు చేరాయి. జిల్లాకు చేరిన బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకాశం భవన్లోని స్పందన సమావేశ మందిరంలో తెరిచారు. -
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
[ 19-05-2024]
ఈ నెల 24 నుంచి నిర్వహించనున్న ఇంటర్, 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు; జూన్ ఒకటో తేదీ నుంచి జరగనున్న ఏపీ ఓపెన్ స్కూల్స్ ఇంటర్, 10వ తరగతి పరీక్షలు సజావుగా సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. -
నిమ్మ.. నష్టాలే మిగిల్చెనమ్మా!
[ 19-05-2024]
జిల్లాలో అత్యధికంగా నిమ్మ సాగు చేసే ప్రాంతాల్లో కనిగిరి ఒకటి. ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో తోటలు సాగయ్యేవి. ఈ ప్రాంతాన్ని నిమ్మ వనంగా అభివర్ణించేవారు. -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు
[ 19-05-2024]
ఆటో మినీలారీ ఎదురెదురుగా ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం పొదిలి మండలం కంభాలపాడు సమీపంలో జరిగింది. -
బోలెరో ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 19-05-2024]
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బొలోరో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తర్లుపాడు, సీతానాగులవరం గ్రామాల మధ్య చోటు చేసుకుంది. -
తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం
[ 19-05-2024]
తెలంగాణ మద్యం సీసాలను అక్రమంగా తీసుకువెళుతున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై బి.ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం -
చెంపపై కొట్టి.. జుట్టు పట్టుకుని లాగి...
[ 19-05-2024]
అధికార పార్టీకి ఓటేయాలంటూ ఓ సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శి దురుసుగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శిగా కె.అనూష పనిచేస్తున్నారు. -
గురుకులాల్లో ఇంటర్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
[ 19-05-2024]
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాసి ఎంపికైన విద్యార్థులకు మెరిట్ ప్రకారం
తాజా వార్తలు (Latest News)
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం