‘దీవెన’ పేరుతో దగా!
జడ్పీ, ఇతర సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు అధికారులు ఇచ్చే వివరాల్లో వసతి దీవెన రెండు విడతలకు ఒకసారే ఇచ్చారని నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండో విడత జమ చేయనట్లే లెక్క.
ఒక విడతకే పరిమితం చేసిన జగనన్న
న్యూస్టుడే, పాతశ్రీకాకుళం
జడ్పీ, ఇతర సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు అధికారులు ఇచ్చే వివరాల్లో వసతి దీవెన రెండు విడతలకు ఒకసారే ఇచ్చారని నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థులందరికీ రెండో విడత జమ చేయనట్లే లెక్క. రెండేళ్ల ఐటీఐ కోర్సు అభ్యసించే విద్యార్థులకు రూ.10 వేల చొప్పున బాకీ పడినట్లే. పాలిటెక్నిక్ విద్యార్థులకు మూడేళ్లకు కలిపి రూ.22,500 చొప్పున అందజేయాలి. డిగ్రీ, ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఒక్కొక్కరికి రూ.30 వేలు ఇవ్వాలి. ‘బాకీ సొమ్ము ఎప్పుడు ఇస్తావు జగనన్నా’ అంటూ లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇస్తానని చెప్పడం ఎందుకు..ఇవ్వకుండా జాప్యం చేయడంలో ఆంతర్యం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.
చెప్పిందొక్కటి..: పదో తరగతి, ఇంటర్మీడియట్ తరువాత ఉన్నత, వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు పుస్తకాలు, ఇతరత్రా అవసరాల నిమిత్తం వసతి దీవెన పేరిట ఉపకార వేతనం రెండు విడతల్లో తల్లుల ఖాతాలకు జమ చేస్తామని వైకాపా ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేలు జమ చేస్తామని స్పష్టం చేసింది.
చేసిందొకటి..: విద్యార్థులకు అందుతోంది ఒక విడతే. సగం మాత్రమే ఇస్తున్నారు. మూడేళ్లుగా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరం మొత్తానికి వసతి దీవెన కింద ఒక విడత కూడా ఇవ్వలేదు. పేద విద్యార్థుల చదువుకు అవసరమైన పుస్తకాలు, రవాణా, ఇతర ఖర్చుల నిమిత్తం జగన్ ప్రభుత్వం వసతి దీవెన పేరిట సంక్షేమ పథకం ప్రవేశపెట్టింది. విద్యా సంవత్సరం పూర్తయి సంస్థలను వదిలి బయటకు వెళ్లిపోతున్నా సొమ్ము మాత్రం అందలేదు. కొంత ఆలస్యమైనా డబ్బులు వస్తాయని ఆశతో ఉన్న వారు ఎదురుచూస్తూనే ఉన్నారు.
డిగ్రీ పూర్తయినా డబ్బులు రాలేదు..
- జి.ప్రవీణ్కుమార్, శ్రీకాకుళం
నేను గత విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశా. మూడేళ్లలో వసతి దీవెన కింద ఏడాదికి రూ.10 వేల చొప్పున జమైంది. రెండో విడత కోసం అధికారులను సంప్రదిస్తే ఇస్తారని చెబుతున్నారు. మూడేళ్లకు కలిపి రూ.30 వేలు రావాలి. చదువు పూర్తయినా డబ్బులు రాలేదు. ఆ సొమ్ము విడుదల చేస్తే పోటీ పరీక్షలకు తర్ఫీదు పొందడానికి ఉపయోగపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చూసిన కనులదే భాగ్యం..!
[ 18-06-2024]
నగరంలోని పలు దేవాలయాల్లో సోమవారం వార్షిక కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. -
తూనిక యంత్రాలకు సీళ్లు లేకుంటే చర్యలు
[ 18-06-2024]
తూనిక యంత్రాలకు సీళ్లు తప్పని సరిగా ఉండాలని లేని వాటిని వినియోగించి పట్టుబడితే చర్యలు తప్పవని తూనికలు కొలతల శాఖ (పలాస) ఇన్స్పెక్టర్ టి.శ్రీధర్ అన్నారు. -
అటవీ భూముల్లో కంకర తవ్వకాలు
[ 18-06-2024]
మందస మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో కంకర అక్రమంగా తవ్వుతున్నారు. మందస, సిరిపురం, పొత్తంగి, బుడార్శింగి ప్రాంతాల్లో స్థిరాస్తి లేఅవుట్లు వేయడంతో ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. -
పూల వర్షం.. ఆత్మీయ స్వాగతం
[ 18-06-2024]
పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు సిక్కోలు వాసులు ఘన స్వాగతం పలికారు. -
న్యాయవాది మధ్యవర్తులకు శిక్షణ
[ 18-06-2024]
న్యాయవాది మధ్యవర్తులకు ఈ నెల 18 నుంచి 22 వరకు మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు -
బాబాయ్, అబ్బాయ్లకు సిక్కోలు నీరాజనం
[ 18-06-2024]
-
పోగొట్టాలి ముంపు భయం...!
[ 18-06-2024]
-
భక్తిశ్రద్ధలతో బక్రీద్..
[ 18-06-2024]
జిల్లావ్యాప్తంగా సోమవారం బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకాకుళం నగరం జీటీ రోడ్డులోని జామియా మసీదుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చారు. -
వైభవంగా శ్రీముఖలింగేశ్వరస్వామి కల్యాణం
[ 18-06-2024]
శ్రీముఖలింగేశ్వరస్వామి పంచరాత్రి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది. -
ఈదురుగాలుల బీభత్సం..
[ 18-06-2024]
జిల్లాలో పలు మండలాల్లో సోమవారం తెల్లవారు జామున ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షం కురిసింది.
తాజా వార్తలు (Latest News)
-
రిలీజ్కు ముందే ‘కల్కి’ హవా.. తొలి ఇండియన్ సినిమాగా రికార్డు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
విజయవాడలో క్యాంపు కార్యాలయం.. పరిశీలించిన పవన్
-
అమెరికా అధ్యక్షుడి పర్యటన.. భద్రతా సిబ్బందిని దోచుకొన్న దొంగలు
-
అమరావతి, పోలవరం పూర్తి చేయడమే మా ప్రధాన లక్ష్యం: పల్లా శ్రీనివాసరావు యాదవ్
-
‘అప్పుడు మోదీ దాచిపెట్టారా..?’: వయనాడ్ నుంచి ప్రియాంక పోటీపై భాజపాకు కాంగ్రెస్ కౌంటర్