వైద్య కళాశాల ఏర్పాటుకు అడుగులు
భూపాలపల్లిలో వైద్య కళాశాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కాలేజీ, జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి రూ. 168 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
వెయ్యి క్వార్టర్ల సమీపంలో స్థల పరిశీలన చేస్తున్న డీఎంహెచ్ఓ శ్రీరామ్, తహసీల్దార్ మహ్మద్ ఇగ్బాల్
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, భూపాలపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: భూపాలపల్లిలో వైద్య కళాశాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కాలేజీ, జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి రూ. 168 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే భూపాలపల్లి సింగరేణి వెయ్యి క్వార్టర్ల సమీపంలో 22 ఎకరాల స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయితే ఇక్కడ వంద సీట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే 350 బెడ్స్తో కూడిన జనరల్ దవాఖానా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుతాయి. వచ్చే ఏడాదికి కళాశాల అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
అందనున్న చికిత్సలు
వైద్య విద్యార్థులకు తరగతులు బోధించేందుకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది తదితరులు సుమారు 600 మందికి పైగా ఇక్కడ విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు మొదటి రెండు సంవత్సరాలు తరగతులు, తర్వాత రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు వరకు చికిత్స అందించే విధానంపై శిక్షణ ఉంటుంది. జనరల్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యే వరకు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో విద్యార్థులు సేవలు అందిస్తారు. ఫలితంగా మరిన్ని సేవలతో శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. నీట్ మెడిసిన్లో మంచి ర్యాంకు వచ్చిన వారికి ఇక్కడ సీటు దొరికే అవకాశం ఉంటుంది. దీంతో దేశ నలుమూలల నుంచి ఏటా 100 మంది వైద్య విద్యను అభ్యసించే వారు వస్తుంటారు.
మంజూరు లేఖ అందజేత
భూపాలపల్లి టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రికి అనుమతులకు సంబంధించిన లేఖను సీఎం కేసీఆర్ శనివారం హైదరాబాద్లోని ప్రగతిభవనంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి అందజేశారు. రూ.168 కోట్ల వ్యయంతో 100 సీట్లతో కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గొప్ప మైలురాయి
వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే
భూపాలపల్లికి వైద్యకళాశాల, జనరల్ ఆసుపత్రి మంజూరు కావడం గొప్ప మైలురాయి. నేను ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు అందరూ ఇది అయ్యేపనేనా అన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్లకు ఇదే సమాధానం. జిల్లాకు వైద్యకళాశాల ఇచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. వచ్చే సంవత్సరానికి తరగతులు ప్రారంభం అవుతాయి.
శుభపరిణామం
సంజీవయ్య, డీసీహెచ్ఎస్
భూపాలపల్లికి ఇదెంతో శుభపరిణామం. మారుమూల ప్రాంతాల వారికి మెరుగైన వైద్యం అందుతుంది. జిల్లాలో సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. అన్నీ ఇక్కడే అందుబాటులోకి వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులను అరికట్టేందుకు.. మహిళా కమిటీలు
[ 20-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. -
నగరం.. చినుకులకే వణుకుతోంది..!
[ 20-05-2024]
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ -
కొలువు కల్ల.. జేబు గుల్ల!
[ 20-05-2024]
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. -
ఆడిట్ విభాగంలో లెక్కలేనితనం
[ 20-05-2024]
గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. -
బాల చోదకులు.. ప్రమాద కారకులు
[ 20-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు. -
ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సమన్వయకర్తలు వీరే
[ 20-05-2024]
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు భారాస ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సెగ్మెంటు వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
అతివలకు ఉపాధి వెలుగులు
[ 20-05-2024]
విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
[ 20-05-2024]
-
పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
[ 20-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. -
వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
[ 20-05-2024]
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. -
భారాస గెలుపునకు కృషి చేయాలి..
[ 20-05-2024]
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
కిసాన్ నిధి.. కొందరికేనా?
[ 20-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. -
వరి వైపే మొగ్గు
[ 20-05-2024]
జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. -
మోడికుంట.. కాలయాపన ఎందుకంట?
[ 20-05-2024]
సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు