వైద్య కళాశాల ఏర్పాటుకు అడుగులు
భూపాలపల్లిలో వైద్య కళాశాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కాలేజీ, జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి రూ. 168 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
వెయ్యి క్వార్టర్ల సమీపంలో స్థల పరిశీలన చేస్తున్న డీఎంహెచ్ఓ శ్రీరామ్, తహసీల్దార్ మహ్మద్ ఇగ్బాల్
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, భూపాలపల్లి కలెక్టరేట్, న్యూస్టుడే: భూపాలపల్లిలో వైద్య కళాశాల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కాలేజీ, జనరల్ ఆసుపత్రి నిర్మాణానికి రూ. 168 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే భూపాలపల్లి సింగరేణి వెయ్యి క్వార్టర్ల సమీపంలో 22 ఎకరాల స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయితే ఇక్కడ వంద సీట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే 350 బెడ్స్తో కూడిన జనరల్ దవాఖానా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుతాయి. వచ్చే ఏడాదికి కళాశాల అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
అందనున్న చికిత్సలు
వైద్య విద్యార్థులకు తరగతులు బోధించేందుకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది తదితరులు సుమారు 600 మందికి పైగా ఇక్కడ విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు మొదటి రెండు సంవత్సరాలు తరగతులు, తర్వాత రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు వరకు చికిత్స అందించే విధానంపై శిక్షణ ఉంటుంది. జనరల్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యే వరకు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో విద్యార్థులు సేవలు అందిస్తారు. ఫలితంగా మరిన్ని సేవలతో శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. నీట్ మెడిసిన్లో మంచి ర్యాంకు వచ్చిన వారికి ఇక్కడ సీటు దొరికే అవకాశం ఉంటుంది. దీంతో దేశ నలుమూలల నుంచి ఏటా 100 మంది వైద్య విద్యను అభ్యసించే వారు వస్తుంటారు.
మంజూరు లేఖ అందజేత
భూపాలపల్లి టౌన్: ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రికి అనుమతులకు సంబంధించిన లేఖను సీఎం కేసీఆర్ శనివారం హైదరాబాద్లోని ప్రగతిభవనంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి అందజేశారు. రూ.168 కోట్ల వ్యయంతో 100 సీట్లతో కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గొప్ప మైలురాయి
వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే
భూపాలపల్లికి వైద్యకళాశాల, జనరల్ ఆసుపత్రి మంజూరు కావడం గొప్ప మైలురాయి. నేను ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు అందరూ ఇది అయ్యేపనేనా అన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్లకు ఇదే సమాధానం. జిల్లాకు వైద్యకళాశాల ఇచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. వచ్చే సంవత్సరానికి తరగతులు ప్రారంభం అవుతాయి.
శుభపరిణామం
సంజీవయ్య, డీసీహెచ్ఎస్
భూపాలపల్లికి ఇదెంతో శుభపరిణామం. మారుమూల ప్రాంతాల వారికి మెరుగైన వైద్యం అందుతుంది. జిల్లాలో సరైన వైద్య సదుపాయం లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. అన్నీ ఇక్కడే అందుబాటులోకి వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లులో కాషాయోత్సాహం
[ 09-05-2024]
మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు హోరెత్తాయి. ‘మరోమారు మోదీ సర్కారు’ అంటూ యువత కేరింతలు కొట్టింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వింటూ కమలం శ్రేణులు కొత్త ఉత్సాహంతో జేజేలు పలికాయి. -
ఎన్నికలకు పోలీసుల రక్షణ ఛత్రం
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. -
‘ప్రత్యేక త చాటాలి.. ఓటు మురవాలి
[ 09-05-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచడానికి భారత ఎన్నికల సంఘం పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. పలు ప్రయోగాలు అమలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తోంది. -
చెయ్యెత్తి నినదించూ.. ఓటెత్తి జైకొట్టు
[ 09-05-2024]
‘ఏ ఒక్క ఓటరు ఓటు వేయకుండా మిగిలిపోరాదు’ ఇది ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం, ఆశయం. -
నిబంధనల మేరకే ఈవీఎంల కమిషనింగ్
[ 09-05-2024]
ఎన్నికల నిబంధనల మేరకు ఈవీఎంల కమిషనింగ్ నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల ప్రత్యేక అధికారి నవీన్ విద్ది తెలిపారు. -
‘కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి’
[ 09-05-2024]
భారాస పదేళ్ల పాలనలో ఎన్నో పదవులు అనుభవించి, స్వలాభం కోసం పార్టీ మారి ద్రోహం చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ ఊసరవెల్లి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. -
భారాసపై అవినీతి మరకలతోనే పార్టీ వీడాను..
[ 09-05-2024]
వరంగల్ లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, నా కుమార్తె కడియం కావ్యను మీ బిడ్డగా నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు. -
ఆదరించండి.. అభివృద్ధి బాధ్యత నాదే
[ 09-05-2024]
పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. -
నాలుగో రోజు.. 431 మంది పోస్టల్ ఓటు వినియోగం
[ 09-05-2024]
నాలుగో రోజు బుధవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా 431 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.. -
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కండి
[ 09-05-2024]
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమవ్వాలని రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించండి
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఇండియా కూటమి బలపర్చిన పోరిక బలరాంనాయక్ను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
[ 09-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
[ 09-05-2024]
పొట్టకూటి కోసం వందల కిలోమీటర్లు వలస వచ్చిన ఆ కూలీ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
అంతర్గత కలహాలపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పరస్పర విమర్శలు చేసుకోవడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్గా తీసుకుంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గడువు పెంపు
[ 09-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయడానికి గడువు ఈ నెల 10 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్