వైద్యుల నియామకంలో అక్రమాలు!
జిల్లాలో నూతనంగా ప్రారంభించిన పల్లె దవాఖానాల కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టులను ఇటీవల భర్తీ చేశారు.
ఎంఎల్హెచ్పీల నియామక కౌన్సెలింగ్కు హాజరైన అభ్యర్థులు (పాత చిత్రం)
జనగామటౌన్, న్యూస్టుడే: జిల్లాలో నూతనంగా ప్రారంభించిన పల్లె దవాఖానాల కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టులను ఇటీవల భర్తీ చేశారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. ఎంపిక కమిటీ.. ఉద్యోగుల నియామకంలో సరైన మార్గదర్శకాలను పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసలు ఏం జరిగిందంటే....
పల్లె దవాఖానాల్లో వైద్యుల నియామకానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఛైర్మన్గా, డీఎంహెచ్వో కన్వీనర్గా ఇతర అధికారులతో ఎంపిక కమిటీని ఏర్పాటు చేశారు. 32 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాల కోసం ఎంబీబీఎస్, బీఎంఎంఎస్, బీఎస్సీ (నర్సింగ్) చదివిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. బీఏఎంఎస్ కోర్సు చేసిన సుమారు 80 మంది దరఖాస్తు చేసుకోగా, బీఎస్సీ (నర్సింగ్) చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పల్లె దవాఖానాల్లో వైద్యులుగా పని చేయడానికి బీఏఎంఎస్ చేసిన వారికి తొలి ప్రాధాన్యమివ్వగా, తర్వాతి ప్రాధాన్యాన్ని బీఎస్సీ (నర్సింగ్) అభ్యర్థులకు ఇచ్చారు. నవంబర్ 14న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్లో బీఏఎంఎస్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. మరుసటి రోజు వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదంతా ఒకే రోజు జరగాల్సిన ప్రక్రియ. 14వ తేదీ రాత్రి వరకు కౌన్సెలింగ్ జరగడంతో మరుసటి రోజు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఎంపికైన బీఏఎంఎస్ అభ్యర్థుల్లో ఐదుగురు ఉద్యోగాల్లో చేరకపోవడంతో.. సదరు ఖాళీలను బీఎస్సీ (నర్సింగ్) చదివిన ఐదుగురు అభ్యర్థులతో భర్తీ చేశారు. దీంతో అధికారుల తీరుపై పలువురు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎంపికపై అనుమానాలు
ఎంఎల్హెచ్పీ ఉద్యోగాలకు సుమారు 80 మంది బీఏఎంఎస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం కౌన్సెలింగ్కు ఐదుగురు రాలేదని బీఎస్సీ (నర్సింగ్) అభ్యర్థులను తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని పలువురు అంటున్నారు. అవసరమైతే తొలుత దరఖాస్తు చేసుకున్న బీఏఎంఎస్ అభ్యర్థుల్లో ప్రతిభ ప్రాతిపదికన తీసుకునే వెసులుబాటు ఉంది. ఇదే సమయంలో ఇతర జిల్లాల నుంచి స్థానికేతరులుగా దరఖాస్తు చేసుకున్న వారిలో ఐదుశాతం చొప్పున కనీసం రెండు పోస్టుల్లో బీఏఎంఎస్ అభ్యర్థులను తీసుకునే వీలు ఉంది. ఈ రెంటినీ కాదని బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులను ఎలా తీసుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొందరు అధికారులు డబ్బులు తీసుకొని బీఎస్సీ (నర్సింగ్) అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డిప్యుటేషన్పై సాధారణ ఉద్యోగిగా పని చేస్తున్న ఒకరిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయం అంతా ఆయన కనుసన్నల్లో నడుస్తోందని, ఉన్నతాధికారులకు, బయట వ్యవహారాలకు ఆయన సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్ స్పందించి బీఎస్సీ (నర్సింగ్) అభ్యర్థులను ఎంఎల్హెచ్పీలుగా నియమించిన వ్యవహారంపై విచారణ చేపట్టాలని, అర్హులకు న్యాయం చేయాలని మిగతా అభ్యర్థులు కోరుతున్నారు.
నిబంధనల ప్రకారమే భర్తీ చేశాం: డాక్టర్ మహేందర్, జిల్లా వైద్యాధికారి
ఎంఎల్హెచ్పీ ఉద్యోగాలకు తొలుత బీఏఎంఎస్ అభ్యర్థులు ఎంపికయ్యారు. ఐదుగురు విధుల్లో చేరకపోవడంతో బీఎస్సీ (నర్సింగ్) అభ్యర్థులకు తర్వాతి ప్రాధాన్యమిచ్చాం. నాన్లోకల్ కేటగిరీ పాటించాలని మా ఉన్నతాధికారులు ఎక్కడా చెప్పలేదు. నిబంధనల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులను అరికట్టేందుకు.. మహిళా కమిటీలు
[ 20-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. -
నగరం.. చినుకులకే వణుకుతోంది..!
[ 20-05-2024]
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ -
కొలువు కల్ల.. జేబు గుల్ల!
[ 20-05-2024]
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. -
ఆడిట్ విభాగంలో లెక్కలేనితనం
[ 20-05-2024]
గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. -
బాల చోదకులు.. ప్రమాద కారకులు
[ 20-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు. -
ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సమన్వయకర్తలు వీరే
[ 20-05-2024]
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు భారాస ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సెగ్మెంటు వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
అతివలకు ఉపాధి వెలుగులు
[ 20-05-2024]
విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
[ 20-05-2024]
-
పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
[ 20-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. -
వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
[ 20-05-2024]
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. -
భారాస గెలుపునకు కృషి చేయాలి..
[ 20-05-2024]
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
కిసాన్ నిధి.. కొందరికేనా?
[ 20-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. -
వరి వైపే మొగ్గు
[ 20-05-2024]
జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. -
మోడికుంట.. కాలయాపన ఎందుకంట?
[ 20-05-2024]
సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..