వైద్యుల నియామకంలో అక్రమాలు!
జిల్లాలో నూతనంగా ప్రారంభించిన పల్లె దవాఖానాల కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టులను ఇటీవల భర్తీ చేశారు.
ఎంఎల్హెచ్పీల నియామక కౌన్సెలింగ్కు హాజరైన అభ్యర్థులు (పాత చిత్రం)
జనగామటౌన్, న్యూస్టుడే: జిల్లాలో నూతనంగా ప్రారంభించిన పల్లె దవాఖానాల కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టులను ఇటీవల భర్తీ చేశారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. ఎంపిక కమిటీ.. ఉద్యోగుల నియామకంలో సరైన మార్గదర్శకాలను పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసలు ఏం జరిగిందంటే....
పల్లె దవాఖానాల్లో వైద్యుల నియామకానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఛైర్మన్గా, డీఎంహెచ్వో కన్వీనర్గా ఇతర అధికారులతో ఎంపిక కమిటీని ఏర్పాటు చేశారు. 32 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాల కోసం ఎంబీబీఎస్, బీఎంఎంఎస్, బీఎస్సీ (నర్సింగ్) చదివిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. బీఏఎంఎస్ కోర్సు చేసిన సుమారు 80 మంది దరఖాస్తు చేసుకోగా, బీఎస్సీ (నర్సింగ్) చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. పల్లె దవాఖానాల్లో వైద్యులుగా పని చేయడానికి బీఏఎంఎస్ చేసిన వారికి తొలి ప్రాధాన్యమివ్వగా, తర్వాతి ప్రాధాన్యాన్ని బీఎస్సీ (నర్సింగ్) అభ్యర్థులకు ఇచ్చారు. నవంబర్ 14న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్లో బీఏఎంఎస్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. మరుసటి రోజు వారికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదంతా ఒకే రోజు జరగాల్సిన ప్రక్రియ. 14వ తేదీ రాత్రి వరకు కౌన్సెలింగ్ జరగడంతో మరుసటి రోజు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఎంపికైన బీఏఎంఎస్ అభ్యర్థుల్లో ఐదుగురు ఉద్యోగాల్లో చేరకపోవడంతో.. సదరు ఖాళీలను బీఎస్సీ (నర్సింగ్) చదివిన ఐదుగురు అభ్యర్థులతో భర్తీ చేశారు. దీంతో అధికారుల తీరుపై పలువురు అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎంపికపై అనుమానాలు
ఎంఎల్హెచ్పీ ఉద్యోగాలకు సుమారు 80 మంది బీఏఎంఎస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం కౌన్సెలింగ్కు ఐదుగురు రాలేదని బీఎస్సీ (నర్సింగ్) అభ్యర్థులను తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని పలువురు అంటున్నారు. అవసరమైతే తొలుత దరఖాస్తు చేసుకున్న బీఏఎంఎస్ అభ్యర్థుల్లో ప్రతిభ ప్రాతిపదికన తీసుకునే వెసులుబాటు ఉంది. ఇదే సమయంలో ఇతర జిల్లాల నుంచి స్థానికేతరులుగా దరఖాస్తు చేసుకున్న వారిలో ఐదుశాతం చొప్పున కనీసం రెండు పోస్టుల్లో బీఏఎంఎస్ అభ్యర్థులను తీసుకునే వీలు ఉంది. ఈ రెంటినీ కాదని బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులను ఎలా తీసుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కొందరు అధికారులు డబ్బులు తీసుకొని బీఎస్సీ (నర్సింగ్) అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డిప్యుటేషన్పై సాధారణ ఉద్యోగిగా పని చేస్తున్న ఒకరిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయం అంతా ఆయన కనుసన్నల్లో నడుస్తోందని, ఉన్నతాధికారులకు, బయట వ్యవహారాలకు ఆయన సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, కలెక్టర్ స్పందించి బీఎస్సీ (నర్సింగ్) అభ్యర్థులను ఎంఎల్హెచ్పీలుగా నియమించిన వ్యవహారంపై విచారణ చేపట్టాలని, అర్హులకు న్యాయం చేయాలని మిగతా అభ్యర్థులు కోరుతున్నారు.
నిబంధనల ప్రకారమే భర్తీ చేశాం: డాక్టర్ మహేందర్, జిల్లా వైద్యాధికారి
ఎంఎల్హెచ్పీ ఉద్యోగాలకు తొలుత బీఏఎంఎస్ అభ్యర్థులు ఎంపికయ్యారు. ఐదుగురు విధుల్లో చేరకపోవడంతో బీఎస్సీ (నర్సింగ్) అభ్యర్థులకు తర్వాతి ప్రాధాన్యమిచ్చాం. నాన్లోకల్ కేటగిరీ పాటించాలని మా ఉన్నతాధికారులు ఎక్కడా చెప్పలేదు. నిబంధనల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
[ 08-05-2024]
సిద్ధార్థ ఆఫీసుకు ఆలస్యమవుతుంటే.. చకచకా బైక్ తీసి రయ్యిమని వెళుతున్నారు. కొంతదూరం వెళ్లేసరికి ఫోన్ రింగైనట్లు అనిపించింది. -
రేవంత్ ప్రసంగం.. కాంగ్రెస్లో ఉత్తేజం
[ 08-05-2024]
వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ మంగళవారం రాత్రి హనుమకొండ చౌరస్తాలో కాంగ్రెస్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ విజయవంతమైంది. -
మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి మధ్య వాగ్వాదం
[ 08-05-2024]
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. -
హామీలు నెరవేర్చేందుకే పార్టీ మారా..
[ 08-05-2024]
‘గత అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసి, అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకే కాంగ్రెస్లో చేరాను తప్ప.. పదవులకు ఆశపడి కాదని’ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మండలంలోని తాటికొండ గ్రామంలో మంగళవారం నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన సింగపురం ఇందిరతో కలిసి పాల్గొని మాట్లాడారు -
మెరుగైన విద్యుత్తు సరఫరాకు చర్యలు
[ 08-05-2024]
వేసవి ఎండల తాపానికి జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరిగింది. డిమాండ్కు అనుకూలంగా ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో అధికారులు మెరుగైన సరఫరాకు గత నాలుగు నెలలుగా చర్యలు చేపట్టారు. -
మేడిగడ్డలో.. మూడు గంటలు
[ 08-05-2024]
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీలో మూడు గంటల పాటు పరిశీలన చేపట్టారు. -
అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం
[ 08-05-2024]
మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. గాలిదుమారంతో మెరుపులు, ఉరుములతో కుండపోత వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. -
అధిక స్థానాల్లో కాంగ్రెస్దే విజయం
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే ఐదు అమలు చేసింది..రైతుబంధు ద్వారా నిధులు జమచేసింది రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. -
‘మోదీనే దేశానికి పెద్ద దిక్కు’
[ 08-05-2024]
దేశానికి మోదీనే పెద్ద దిక్కు అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు అన్నారు -
రోడ్డుపై చెట్టు విరిగిపడి యువకుడి దుర్మరణం
[ 08-05-2024]
ఈదురుగాలుల బీభత్సానికి యువకుడు బలైన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. -
ఓటేద్దామని మాటిద్దాం..!
[ 08-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. భారత రాజ్యాంగం కల్పించిన మహºన్నత అవకాశాన్ని నగరంలో చాలా మంది ఓటర్లు వినియోగించుకోవడం లేదు. పోలింగ్ రోజు నాయకులను ఎన్నుకోవడానికి ఆసక్తి చూపడం లేదు -
‘కడియం, అరూరికి ఓటుతో బుద్ధిచెప్పాలి’
[ 08-05-2024]
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు సూచించారు. -
వన ప్రేమికుడు... వేలుపుల సారయ్య
[ 08-05-2024]
ఆయన వయస్సు 70 ఏళ్లు.. మొక్కల సంరక్షణకు తనదైన శ్రద్ధతో పనిచేసే నిత్య శ్రామికుడు.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన వేలుపుల సారయ్యకు మొక్కల పెంపకమంటే ఎంతో మక్కువ. ప్రస్తుతం రామన్నగూడెం పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లకిరువైపులా హరితహారం పథకం కింద పెంపకం చేపట్టిన మొక్కలను సంరక్షించే బాధ్యతను చేపట్టారు. -
ఎంపీ ల్యాడ్స్ కేటాయింపు ఇలా..
[ 08-05-2024]
దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి.. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
కమలదళం.. గెలుపు వ్యూహం
[ 08-05-2024]
వరంగల్ లక్ష్మీపురలో బుధవారం భాజపా నిర్వహిస్తున్న భారీగా బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభను కాషాయ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం