నచ్చిన వారికే పనులు
ఏలూరు నగరపాలిక అక్రమాలకు నిలయంగా మారింది. కార్పొరేషన్ కాంట్రాక్టుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. ఎక్కడైనా టెండరు ప్రక్రియ అయ్యాక పనులు చేస్తారు. ఇక్కడ మాత్రం పనులు చేశాక టెండర్లు పిలుస్తారు. అధికారులకు, నాయకులకు ముడుపులిచ్చిన వారికి అప్పనంగా అప్పగిస్తున్నారు.
కొత్తవారు టెండర్లు వేసినా రద్దు
నామినేషన్ విధానంలో అప్పగింతలు
ఏలూరు నగరపాలికలో మరో చోద్యం
ఏలూరులోకి కర్రల వంతెన సమీపంలో కృష్ణా కెనాల్గట్టుపై చేపడుతున్న నిర్మాణమిది. ఇలా గోడ కట్టిన తర్వాత మట్టి నింపి మొక్కలు పెట్టి సుందరీకరణ చేయాలి. ఇక్కడ పని మొదలై రెండు వారాలవుతోంది. ఆశ్చర్యం ఏమిటంటే దీనికి ఇంకా టెండరు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా గుత్తేదారుకి వర్క్ఆర్డర్ ఇవ్వలేదు. కాంట్రాక్టు ఒప్పందం కూడా చేసుకోలేదు. అసలు అతను ఎంత మొత్తానికి టెండర్ వేశారో కూడా స్పష్టత లేదు. ఈ గుత్తేదారు ఇంజినీరింగ్ విభాగంలో ఓ అధికారికి అత్యంత సన్నిహితుడు కావటంతో నిబంధనలు పట్టించుకోవడం లేదు.
ఈనాడు, ఏలూరు;- ఏలూరు నగరపాలిక అక్రమాలకు నిలయంగా మారింది. కార్పొరేషన్ కాంట్రాక్టుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. ఎక్కడైనా టెండరు ప్రక్రియ అయ్యాక పనులు చేస్తారు. ఇక్కడ మాత్రం పనులు చేశాక టెండర్లు పిలుస్తారు. అధికారులకు, నాయకులకు ముడుపులిచ్చిన వారికి అప్పనంగా అప్పగిస్తున్నారు. నామినేషన్ విధానంలో ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు.
నాయకులకు ఇష్టమైన వారికి కట్టబెట్టేందుకు నామినేషన్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇందు కోసం రూ.5 లక్షల కన్నా ఎక్కువ అంచనా వ్యయం ఉన్న ఒకే పనిని విభజిస్తున్నారు. ఉదాహరణకు నగరంలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేందుకు గోడలపై పెయింటింగ్ వేసేందుకు రూ.8 లక్షలు అవుతుందని అంచనా వేశారు. నామినేషన్ పద్ధతిలో చేయటం వీలు కాదని ఆ పనిని రూ.4.72 లక్షలు, రూ.3.32 లక్షల అంచనా వ్యయంతో రెండు పనులుగా విభజించారు. నామినేషన్ విధానంలో ఇంజనీరింగ్ విభాగంలో ఓ అధికారికి బినామీగా ఉన్న ఓ గుత్తేదారుకి అప్పగించారు. పైగా నిబంధనల ప్రకారం చదరపు అడుగుకు పెయింట్ వేస్తే రూ.43కి ఇవ్వాల్సి ఉండగా.. రూ.76కి ఇచ్చారు.
* పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన, కార్మికుల పనితీరును పర్యవేక్షణ కోసం నగరంలో నిఘా కెమెరాలు, మైకుల ఏర్పాటుకు రూ.40 లక్షల అంచనా వేశారు. టెండర్లు పిలవకుండానే ఓ గుత్తేదారుకి అప్పగించేశారు. వైరింగ్ చేసేసి ఇప్పటికే 8 చోట్ల కెమెరాలు, మైకులు కూడా పెట్టేశారు. చోద్యం ఏంటంటే ఈ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో తాపీగా ఇటీవల టెండర్లు పిలిచారు. ముగ్గురు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేయగా... పాలనాపర కారణాలతో రద్దు చేస్తున్నాం అని వారిని తప్పించారు. ఈ గుత్తేదారు కార్పొరేషన్లో ఓ బడాబాబుకు అత్యంత ఆప్తుడు కావడంతో అప్పనంగా అప్పగించారు.
టెండర్ల ప్రక్రియ లేకుండానే ఏర్పాటు చేసిన నిఘా కెమెరా, మైకు
చేశాక టెండర్లు
రూ.5 లక్షల వ్యయానికి మించిన ఏ పనికైనా ఆన్లైన్లో టెండర్లు పిలవాలి. తక్కువ మొత్తానికి చేస్తానని ముందుకు వచ్చినవారికి కేటాయించి అంగీకార పత్రం రాయించుకుని..వర్క్ ఆర్డర్ ఇస్తారు. అప్పుడే పని మొదలు పెట్టాలి. కార్పొరేషన్లో మాత్రం అధికారులకు కావాల్సిన వారికి..నాయకులకు ముడుపులిచ్చిన వారికి అసలు టెండర్లే పిలవ కుండా పనులు అప్పగిస్తున్నారు. పనులు మొదలు పెట్టాక అదే పనికి ఆన్లైన్లో నామమాత్రంగా టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఎవరైనా టెండర్లు వేస్తే పాలనాపర కారణాలతో రద్దు చేస్తున్నట్లు సందేశం పంపించి ముందు ఇచ్చిన వారికే కట్టబెడుతున్నారు. అన్ని పనులు సక్రమంగా చేసినా మా కాంట్రాక్టు ఎందుకు రద్దు చేశారు అని గుత్తేదారులు ప్రశ్నించినా సమాధానం చెప్పే నాథుడు లేరు.
వాటాలేసుకుంటున్నారు
కాంట్రాక్టులు కట్టబెట్టే వ్యవహారంలో ఇంజినీరింగ్ విభాగంలో సిబ్బంది..అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ బడాబాబుతో పాటు కొందరు కార్పొరేటర్లు చక్రం తిప్పుతున్నారు. వాళ్లు చెప్పిన వారికే ఇవ్వాలి. లేదంటే టెండర్లు పిలిచినా రద్దు చేసేస్తున్నారు. ఇటీవల ఓ డివిజన్లో రహదారి నిర్మాణానికి 3 పనులకు ముగ్గురు టెండర్లు దాఖలు చేయగా..చూడకుండానే రద్దు చేసేశారు. గుత్తేదారులు ఆరా తీయగా స్థానిక కార్పొరేటర్ తన బంధువులకు కట్టబెట్టేందుకు రద్దు చేశారని తెలిసింది. నామినేషన్ విధానంలో వారికి అప్పగించారు. ఈ విషయంపై కమిషనర్ వెంకట కృష్ణను వివరణ కోరగా ‘కాంట్రాక్టులన్నీ పారదర్శకంగా చేస్తున్నాం...కొన్ని వెంటనే చేయాల్సి రావటంతో నామినేషన్ పద్ధతిలో అనుమతిస్తున్నా. కాంట్రాక్టుల విషయంలో రాజకీయ ప్రమేయం లేదు’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
-
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?.. మెట్రోకు భారమవుతున్న వడ్డీలు
-
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
-
ఏమిటీ చెల్లింపులు.. ఎన్నికల విధుల పట్ల ఉద్యోగుల పెదవి విరుపు
-
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే