నచ్చిన వారికే పనులు
ఏలూరు నగరపాలిక అక్రమాలకు నిలయంగా మారింది. కార్పొరేషన్ కాంట్రాక్టుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. ఎక్కడైనా టెండరు ప్రక్రియ అయ్యాక పనులు చేస్తారు. ఇక్కడ మాత్రం పనులు చేశాక టెండర్లు పిలుస్తారు. అధికారులకు, నాయకులకు ముడుపులిచ్చిన వారికి అప్పనంగా అప్పగిస్తున్నారు.
కొత్తవారు టెండర్లు వేసినా రద్దు
నామినేషన్ విధానంలో అప్పగింతలు
ఏలూరు నగరపాలికలో మరో చోద్యం
ఏలూరులోకి కర్రల వంతెన సమీపంలో కృష్ణా కెనాల్గట్టుపై చేపడుతున్న నిర్మాణమిది. ఇలా గోడ కట్టిన తర్వాత మట్టి నింపి మొక్కలు పెట్టి సుందరీకరణ చేయాలి. ఇక్కడ పని మొదలై రెండు వారాలవుతోంది. ఆశ్చర్యం ఏమిటంటే దీనికి ఇంకా టెండరు ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా గుత్తేదారుకి వర్క్ఆర్డర్ ఇవ్వలేదు. కాంట్రాక్టు ఒప్పందం కూడా చేసుకోలేదు. అసలు అతను ఎంత మొత్తానికి టెండర్ వేశారో కూడా స్పష్టత లేదు. ఈ గుత్తేదారు ఇంజినీరింగ్ విభాగంలో ఓ అధికారికి అత్యంత సన్నిహితుడు కావటంతో నిబంధనలు పట్టించుకోవడం లేదు.
ఈనాడు, ఏలూరు;- ఏలూరు నగరపాలిక అక్రమాలకు నిలయంగా మారింది. కార్పొరేషన్ కాంట్రాక్టుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. ఎక్కడైనా టెండరు ప్రక్రియ అయ్యాక పనులు చేస్తారు. ఇక్కడ మాత్రం పనులు చేశాక టెండర్లు పిలుస్తారు. అధికారులకు, నాయకులకు ముడుపులిచ్చిన వారికి అప్పనంగా అప్పగిస్తున్నారు. నామినేషన్ విధానంలో ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు.
నాయకులకు ఇష్టమైన వారికి కట్టబెట్టేందుకు నామినేషన్ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇందు కోసం రూ.5 లక్షల కన్నా ఎక్కువ అంచనా వ్యయం ఉన్న ఒకే పనిని విభజిస్తున్నారు. ఉదాహరణకు నగరంలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేందుకు గోడలపై పెయింటింగ్ వేసేందుకు రూ.8 లక్షలు అవుతుందని అంచనా వేశారు. నామినేషన్ పద్ధతిలో చేయటం వీలు కాదని ఆ పనిని రూ.4.72 లక్షలు, రూ.3.32 లక్షల అంచనా వ్యయంతో రెండు పనులుగా విభజించారు. నామినేషన్ విధానంలో ఇంజనీరింగ్ విభాగంలో ఓ అధికారికి బినామీగా ఉన్న ఓ గుత్తేదారుకి అప్పగించారు. పైగా నిబంధనల ప్రకారం చదరపు అడుగుకు పెయింట్ వేస్తే రూ.43కి ఇవ్వాల్సి ఉండగా.. రూ.76కి ఇచ్చారు.
* పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన, కార్మికుల పనితీరును పర్యవేక్షణ కోసం నగరంలో నిఘా కెమెరాలు, మైకుల ఏర్పాటుకు రూ.40 లక్షల అంచనా వేశారు. టెండర్లు పిలవకుండానే ఓ గుత్తేదారుకి అప్పగించేశారు. వైరింగ్ చేసేసి ఇప్పటికే 8 చోట్ల కెమెరాలు, మైకులు కూడా పెట్టేశారు. చోద్యం ఏంటంటే ఈ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో తాపీగా ఇటీవల టెండర్లు పిలిచారు. ముగ్గురు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేయగా... పాలనాపర కారణాలతో రద్దు చేస్తున్నాం అని వారిని తప్పించారు. ఈ గుత్తేదారు కార్పొరేషన్లో ఓ బడాబాబుకు అత్యంత ఆప్తుడు కావడంతో అప్పనంగా అప్పగించారు.
టెండర్ల ప్రక్రియ లేకుండానే ఏర్పాటు చేసిన నిఘా కెమెరా, మైకు
చేశాక టెండర్లు
రూ.5 లక్షల వ్యయానికి మించిన ఏ పనికైనా ఆన్లైన్లో టెండర్లు పిలవాలి. తక్కువ మొత్తానికి చేస్తానని ముందుకు వచ్చినవారికి కేటాయించి అంగీకార పత్రం రాయించుకుని..వర్క్ ఆర్డర్ ఇస్తారు. అప్పుడే పని మొదలు పెట్టాలి. కార్పొరేషన్లో మాత్రం అధికారులకు కావాల్సిన వారికి..నాయకులకు ముడుపులిచ్చిన వారికి అసలు టెండర్లే పిలవ కుండా పనులు అప్పగిస్తున్నారు. పనులు మొదలు పెట్టాక అదే పనికి ఆన్లైన్లో నామమాత్రంగా టెండర్లు ఆహ్వానిస్తున్నారు. ఎవరైనా టెండర్లు వేస్తే పాలనాపర కారణాలతో రద్దు చేస్తున్నట్లు సందేశం పంపించి ముందు ఇచ్చిన వారికే కట్టబెడుతున్నారు. అన్ని పనులు సక్రమంగా చేసినా మా కాంట్రాక్టు ఎందుకు రద్దు చేశారు అని గుత్తేదారులు ప్రశ్నించినా సమాధానం చెప్పే నాథుడు లేరు.
వాటాలేసుకుంటున్నారు
కాంట్రాక్టులు కట్టబెట్టే వ్యవహారంలో ఇంజినీరింగ్ విభాగంలో సిబ్బంది..అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ బడాబాబుతో పాటు కొందరు కార్పొరేటర్లు చక్రం తిప్పుతున్నారు. వాళ్లు చెప్పిన వారికే ఇవ్వాలి. లేదంటే టెండర్లు పిలిచినా రద్దు చేసేస్తున్నారు. ఇటీవల ఓ డివిజన్లో రహదారి నిర్మాణానికి 3 పనులకు ముగ్గురు టెండర్లు దాఖలు చేయగా..చూడకుండానే రద్దు చేసేశారు. గుత్తేదారులు ఆరా తీయగా స్థానిక కార్పొరేటర్ తన బంధువులకు కట్టబెట్టేందుకు రద్దు చేశారని తెలిసింది. నామినేషన్ విధానంలో వారికి అప్పగించారు. ఈ విషయంపై కమిషనర్ వెంకట కృష్ణను వివరణ కోరగా ‘కాంట్రాక్టులన్నీ పారదర్శకంగా చేస్తున్నాం...కొన్ని వెంటనే చేయాల్సి రావటంతో నామినేషన్ పద్ధతిలో అనుమతిస్తున్నా. కాంట్రాక్టుల విషయంలో రాజకీయ ప్రమేయం లేదు’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం.. చింతలపూడి పూర్తి చేస్తాం
[ 08-05-2024]
‘ఆంధ్రుల జీవనాడి..చంద్రబాబు కలల సౌధం పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేస్తా. కేంద్ర సహకారంతో వేగంగా నిర్మాణ పనులు జరుగుతాయి. -
ఏం మార్చారు.. ఏమార్చారంతే?
[ 08-05-2024]
‘‘సీఎం మాటలకు... క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం హామీలకే పరిమితమైంది. దెబ్బతిన్న పరికరాలు, శిథిలమైన భవనాలు... సదుపాయాల్లేని ఆసుపత్రుల్లో వైద్యమంటేనే గిరిజనులు వెనకడుగు వేస్తున్నారు.’ -
ప్రశ్నించే గొంతుకలపై దౌర్జన్యకాండ
[ 08-05-2024]
ప్రతిపక్షాలకు నోరెత్తే స్వేచ్ఛ లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే వైకాపా గత అయిదేళ్లు అక్రమ కేసుల పరంపరను కొనసాగించింది. ప్రతిపక్షాలను నోరు నొక్కేస్తే సాధారణ ప్రజలు కుక్కిన పేనుల్లా పడుంటారులే అన్న నియంతృత్వ పోకడలు జగన్ జమానాలో అడుగడుగునా కనిపించాయి -
యువతకు ఉపాధి ఆక్వాకు ఊతం
[ 08-05-2024]
‘వైకాపా అస్తవ్యస్త విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటి నుంచి అన్ని వర్గాలకు విముక్తి కల్పించేలా కూటమి మ్యానిఫెస్టోను ప్రకటించాం. -
విప్లవ ధ్రువతార అల్లూరి
[ 08-05-2024]
విప్లవ ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు ధ్రువతార అని పలువురు వక్తలు కొనియాడారు. -
నేడు ఈసెట్
[ 08-05-2024]
పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం ఈసెట్ నిర్వహించనున్నారు -
గోదారికి వదిలేసిన జగన్
[ 08-05-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏటిగట్టు పరిరక్షణ పనుల నుంచి గోదావరిలో గ్రోయిన్ల నిర్మాణానికి పూర్తిగా తిలోదకాలిచ్చింది. -
జలఘోష పట్టదా.. జగన్
[ 08-05-2024]
గోదారి ప్రవహించే జిల్లాలో జలఘోష వినిపిస్తోంది. జిల్లాలోని పురపాలక సంఘాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల ప్రజలు అర్ధరాత్రి... అపరాత్రి తేడా లేకుండా కుళాయిల్లో బిందెడు నీటికి అర్రులుచాస్తున్నారు. -
గుత్తేదారును గుల్ల చేసిన పెత్తందారు!
[ 08-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2015 మొదలు 2019 వరకు తెదేపా హయాంలో చేపట్టిన పనులు చేయడానికి గుత్తేదారులు పోటీపడేవారు. టెండర్లు పిలిస్తే చాలు ప్రతిపాదిత వ్యయానికంటే తక్కువకు టెండర్లు దాఖలు చేసేవారు. -
ఓటరు సమాచార చీటీలో స్వల్ప మార్పు
[ 08-05-2024]
గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈ సారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది -
పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నికల వీడియో గ్రాఫర్పై వైకాపా శ్రేణుల దాడి
[ 08-05-2024]
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల వీడియోగ్రాఫర్, అధికారిపై వైకాపా శ్రేణులు దాడి చేశారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం పెనుమర్రులో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
అనంతపురం రేంజ్ డీఐజీగా షిముషి బాజ్పేయ్ని నియమించిన ఈసీ
-
‘యూవీ అందర్నీ భయపెడతాడు’.. ‘రోహిత్ ఇంగ్లీష్లో పూర్’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్