ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి రూ.5 లక్షలు స్వాహా
ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి రూ.5 లక్షలు కాజేసిన తండ్రి, ఇద్దరు కుమారులపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..
తండ్రి, ఇద్దరు కుమారులపై కేసు
శంషాబాద్, న్యూస్టుడే: ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి రూ.5 లక్షలు కాజేసిన తండ్రి, ఇద్దరు కుమారులపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్ విమానాశ్రయం రన్వే ప్రహరీకి ఆనుకొని సయ్యద్గూడ రెవెన్యూ సంఖ్య 24, 25లో 200 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములున్నాయి. ఇందులో 5 ఎకరాల భూమి ఉందని బహదూర్గూడకు చెందిన ఏనుగు బుచ్చిరెడ్డి అతడి కుమారులు వెంకట్రెడ్డి, నర్సారెడ్డిలు నకిలీ దస్త్రాలను సృష్టించి విక్రయానికి పెట్టారు. గతేడాది అక్టోబరులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లచ్చిరాజుకు ప్రభుత్వ భూమిని చూపించి ఎకరాకు రూ.23 లక్షల చొప్పున రూ.1.15 కోట్లకు ఒప్పందం చేసుకుని రూ.5 లక్షలు అడ్వాన్స్గా తీసుకొన్నారు. రిజిస్ట్రేషన్ చేయాలని లచ్చిరాజు కోరినా బుచ్చిరెడ్డి స్పందించలేదు. అనుమానం వచ్చిన ఆయన శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో భూములపై విచారించగా ప్రభుత్వ భూములుగా తేలింది. దీంతో తీసుకున్న నగదు ఇవ్వాలని కోరడంతో అతడిని బుచ్చిరెడ్డి బెదిరించారు. మోసపోయానని గ్రహించిన లచ్చిరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరానికి పునరంకితం
[ 18-06-2024]
‘పోలవరం ఆంధ్రుల జీవనాడి..దీని ద్వారా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తా..ప్రాజెక్టు నాకు ప్రాణంతో సమానం’ అంటూ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించడంతో పోలవరానికి పూర్వవైభవం రానుందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఏటిగట్టు పొడవునా స్వాగత ద్వారాలు
[ 18-06-2024]
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనను పురస్కరించుకుని తెదేపా, జనసేన శ్రేణులు ఏటిగట్టు పొడవునా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు వెళ్లే ముఖద్వారం నుంచి భారీగా ఫ్లెక్సీలతో అలంకరించారు. -
రామోజీ సేవలు చిరస్మరణీయం
[ 18-06-2024]
కేబుల్ రంగంలో రామోజీరావు సేవలు మరువలేనివని రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం పెంటపాడులోని ఆర్య వైశ్య కల్యాణ మండపంలో ఆ సంఘం ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల మండల ఇన్ఛార్జుల సమావేశం, రామోజీరావు సంతాప సభ వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. -
నిబంధనలు వదిలేసి.. నిధులు మళ్లించి!
[ 18-06-2024]
వైకాపా పాలనలో సర్పంచులు.. వార్డు సభ్యులు ఉత్సవ విగ్రహాల్లా మారారు. పల్లె పాలనలో కార్యదర్శులే కీలకంగా వ్యవహరించేవారు. గ్రామాభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదన రూపొందించాలన్నా... దాన్ని తీర్మానించాలన్నా... గ్రామాల్లో పన్నులు వసూలు చేయాలన్నా... ప్రతి దశలోనూ పాలనా పరమైన బాధ్యతలన్నీ వారిపైనే ఉండేవి. -
నిప్పుల్లా నార చాపలు.. కాలుతున్న కాళ్లు!
[ 18-06-2024]
చిన వేంకన్న క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. మండుటెండలో కాళ్లు మలమలా మాడుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రైళ్ల దారి మళ్లింపు
[ 18-06-2024]
విజయవాడ రైల్వే డివిజన్లోని పలు ప్రాంతాల్లో ట్రాక్ పనులు చేపడుతున్నందున... ఈ నెల 21 నుంచి జులై నెలాఖరు వరకు పలు రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖాధికారులు తెలిపారు. -
పాలక.. ప్రగతి పట్టాలెక్కాలిక!
[ 18-06-2024]
పచ్చదనం.. ప్రశాంతత పెనవేసుకున్న పశ్చిమలో ప్రగతి పనులకు గత పాలకులు మొండిచెయ్యి చూపారు. అయిదేళ్ల పాటు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. ఫలితంగా పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి. -
పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
[ 18-06-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ కోరారు. -
ఇదేమి దారుణం?
[ 18-06-2024]
పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతి నెలా సరకుల పంపిణీ లబ్ధిదారులకు సక్రమంగా జరగాలి. కానీ కొంత మంది ఎండీయూ వాహనదారులు రేషన్ డీలర్లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని కొద్ది నెలల కిందట ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది. -
రేషన్ సరకుల్లో తూకం తప్పుతోంది!
[ 18-06-2024]
పౌర సరఫరాల గోదాముల్లో తూకం తప్పుతోంది. గంపగుత్తగా రేషన్ దుకాణాలకు సరకులు తరలిస్తూ కోత పెడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి నెలా సరఫరా చేసే సుమారు 17 మెట్రిక్ టన్నుల బియ్యంలో వంద క్వింటాళ్లకు క్వింటా చొప్పున తూకం తక్కువగా వస్తోందని రేషన్ డీలర్లు లబోదిబోమంటున్నారు. -
‘ఏకలవ్య’ సంగతేమిటి?
[ 18-06-2024]
సుమారు రూ.90 లక్షల అంచనాతో అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం మంజూరైంది. టెండర్ల దశ పూర్తికాక పనులు ప్రారంభానికి నోచుకోలేదు.