ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులకు తీవ్ర నష్టం
ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని పలు ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. నగరంలోని ఒక హోటల్లో శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ఐక్యత చాటుతున్న ఉద్యోగ సంఘాల నాయకులు
ఏలూరు అర్బన్, న్యూస్టుడే: ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని పలు ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. నగరంలోని ఒక హోటల్లో శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని వేతన జీవుల సమస్యలపై చర్చించడమే కాకుండా వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు ఎటువంటి విధానాలు అవలంబించాలనే అంశాలను ప్రస్తావించారు. నేతలు ఏమన్నారంటే.
ఐక్యతతోనే సమస్యల పరిష్కారం..
- కేఆర్ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
ఉద్యోగులు ఐక్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి. కొంతమంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం కాకుండా వారి స్వప్రయోజనాలకు సంఘాలను వాడుకుంటున్నారు. లెక్కకు మిక్కిలిగా సంఘాలు పుట్టుకొస్తుండటాన్ని ప్రభుత్వాలు అవకాశంగా తీసుకుని వారి మధ్య విభజించు- పాలించు అనే విధానాన్ని అవలంబిస్తున్నాయి. సంఘాలనేవి ఉద్యోగుల సంక్షేమానికి పని చేసేవిగా ఉన్నప్పుడే తగిన గుర్తింపు లభిస్తుంది.
ఆర్టీసీని విలీనం చేయాలని అడగలేదు..
- సీహెచ్ సుందరయ్య, ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులెవరూ అడగలేదు. గతంలో పదేళ్ల సర్వీసు ఉంటే చాలు పింఛను వర్తించేది. ఆ తర్వాత సంస్కరణల పేరుతో పింఛను సదుపాయాన్ని తొలగించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయక ముందు ప్రజలకు సమర్థంగా రవాణా సదుపాయం కల్పించేవారు. విలీనం తర్వాత బస్సుల సంఖ్యతో పాటు రూట్ల సంఖ్య తగ్గింది.
బకాయిలు చెల్లించాలి..
- బి.రవీంద్రరాజు, ఏపీ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు
ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి. కొన్ని సంఘాల నాయకులు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండటంతో ఉద్యోగులు నష్టపోతున్నారు. అలాంటి విధానాల్ని సంఘాల నాయకులు మానుకోవాలి. ఉద్యోగులందరికీ ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలి. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరానికి పునరంకితం
[ 18-06-2024]
‘పోలవరం ఆంధ్రుల జీవనాడి..దీని ద్వారా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తా..ప్రాజెక్టు నాకు ప్రాణంతో సమానం’ అంటూ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించడంతో పోలవరానికి పూర్వవైభవం రానుందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఏటిగట్టు పొడవునా స్వాగత ద్వారాలు
[ 18-06-2024]
సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనను పురస్కరించుకుని తెదేపా, జనసేన శ్రేణులు ఏటిగట్టు పొడవునా స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు వెళ్లే ముఖద్వారం నుంచి భారీగా ఫ్లెక్సీలతో అలంకరించారు. -
రామోజీ సేవలు చిరస్మరణీయం
[ 18-06-2024]
కేబుల్ రంగంలో రామోజీరావు సేవలు మరువలేనివని రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకట్రావు అన్నారు. సోమవారం పెంటపాడులోని ఆర్య వైశ్య కల్యాణ మండపంలో ఆ సంఘం ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల మండల ఇన్ఛార్జుల సమావేశం, రామోజీరావు సంతాప సభ వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. -
నిబంధనలు వదిలేసి.. నిధులు మళ్లించి!
[ 18-06-2024]
వైకాపా పాలనలో సర్పంచులు.. వార్డు సభ్యులు ఉత్సవ విగ్రహాల్లా మారారు. పల్లె పాలనలో కార్యదర్శులే కీలకంగా వ్యవహరించేవారు. గ్రామాభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదన రూపొందించాలన్నా... దాన్ని తీర్మానించాలన్నా... గ్రామాల్లో పన్నులు వసూలు చేయాలన్నా... ప్రతి దశలోనూ పాలనా పరమైన బాధ్యతలన్నీ వారిపైనే ఉండేవి. -
నిప్పుల్లా నార చాపలు.. కాలుతున్న కాళ్లు!
[ 18-06-2024]
చిన వేంకన్న క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. మండుటెండలో కాళ్లు మలమలా మాడుతున్నా.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రైళ్ల దారి మళ్లింపు
[ 18-06-2024]
విజయవాడ రైల్వే డివిజన్లోని పలు ప్రాంతాల్లో ట్రాక్ పనులు చేపడుతున్నందున... ఈ నెల 21 నుంచి జులై నెలాఖరు వరకు పలు రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖాధికారులు తెలిపారు. -
పాలక.. ప్రగతి పట్టాలెక్కాలిక!
[ 18-06-2024]
పచ్చదనం.. ప్రశాంతత పెనవేసుకున్న పశ్చిమలో ప్రగతి పనులకు గత పాలకులు మొండిచెయ్యి చూపారు. అయిదేళ్ల పాటు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. ఫలితంగా పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి. -
పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
[ 18-06-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్) రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ కోరారు. -
ఇదేమి దారుణం?
[ 18-06-2024]
పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతి నెలా సరకుల పంపిణీ లబ్ధిదారులకు సక్రమంగా జరగాలి. కానీ కొంత మంది ఎండీయూ వాహనదారులు రేషన్ డీలర్లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని కొద్ది నెలల కిందట ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది. -
రేషన్ సరకుల్లో తూకం తప్పుతోంది!
[ 18-06-2024]
పౌర సరఫరాల గోదాముల్లో తూకం తప్పుతోంది. గంపగుత్తగా రేషన్ దుకాణాలకు సరకులు తరలిస్తూ కోత పెడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతి నెలా సరఫరా చేసే సుమారు 17 మెట్రిక్ టన్నుల బియ్యంలో వంద క్వింటాళ్లకు క్వింటా చొప్పున తూకం తక్కువగా వస్తోందని రేషన్ డీలర్లు లబోదిబోమంటున్నారు. -
‘ఏకలవ్య’ సంగతేమిటి?
[ 18-06-2024]
సుమారు రూ.90 లక్షల అంచనాతో అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం మంజూరైంది. టెండర్ల దశ పూర్తికాక పనులు ప్రారంభానికి నోచుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు గూగుల్ జెమిని యాప్.. తెలుగు సహా 9 భాషల్లో అందుబాటులోకి
-
‘0.001% నిర్లక్ష్యం ఉన్నా’.. నీట్ వివాదంపై ‘సుప్రీం’ సీరియస్
-
ఎన్డీయే నేతలు కొందరు మాతో టచ్లో ఉన్నారు: రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
ఈనెల 21 నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్
-
ఇక్సిగో లిస్టింగ్.. ఒక్కో లాట్పై రూ.6,762 లాభం