PM Modi: మోదీ వ్యాఖ్యలపై వివాదం.. మైనార్టీలపై నాడు మన్మోహన్ ఏమన్నారు?
PM Modi: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న వేళ.. భాజపా ఓ ఫ్యాక్ట్చెక్ వీడియోను విడుదల చేసింది. అందులో దేశ వనరులపై మైనార్టీలదే తొలి హక్కు అంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నట్లుగా ఉంది.
దిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దేశ వనరులపై మైనార్టీలదే తొలి హక్కు అని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) చేసిన వ్యాఖ్యలను ఆయన తాజాగా ప్రస్తావించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలను బలపర్చేలా భాజపా (BJP) ఓ వీడియోను విడుదల చేసింది.
యూపీఏ హయాంలో 2006 డిసెంబరు 9న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ కార్యక్రమంలో మాట్లాడిన వీడియో అది. ‘‘మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందేలా వారికి సాధికారత కల్పిస్తూ మేం వినూత్న ప్రణాళికలను తీసుకురాబోతున్నాం. దేశంలోని వనరులపై వారికే తొలి హక్కు ఉండాలి’’ అని మన్మోహన్ చెబుతున్నట్లుగా దానిలో ఉంది. దీన్ని భాజపా తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ‘‘కాంగ్రెస్కు తమ సొంత ప్రధానిపైనే నమ్మకం లేదు’’ అని వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది.
కాంగ్రెస్ వస్తే.. సంపదంతా ముస్లింలకే
2006లో ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలపై ఏర్పాటు చేసిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిపై అప్పట్లోనూ తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో నాడు ప్రధానమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చింది. ఆయన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని, తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వెల్లడించింది.
‘‘మా సమ్మిళిత ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. వ్యవసాయం, నీటిపారుదల, నీటి వనరులు, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులతో పాటు ఎస్సీ/ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, పిల్లల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం. ఎస్సీ/ఎస్టీల కోసం సమగ్ర ప్రణాళికలను పునరుద్ధరించాలి. అభివృద్ధి ఫలాలను సమానంగా అందుకునేలా మైనార్టీలు, ముఖ్యంగా ముస్లింలకు సాధికారిత కల్పించేందుకు వినూత్న ప్రణాళికలు తీసుకురావాలి. వనరులపై వారికే ప్రథమ హక్కు ఉండాలి’’ అని మన్మోహన్ తన ప్రసంగంలో తెలిపారని ఆ వివరణలో పేర్కొంది. ఇక్కడ ‘వనరులపై తొలి హక్కు’ అనే మాటను తాను పైన పేర్కొన్న ప్రాధాన్యత అంశాలతో పాటు ఎస్సీ/ఎస్టీలు, ఓబీసీలు, మైనార్టీలు, మహిళలు, చిన్నారులందరినీ ఉద్దేశించి ఆయన అన్నారని స్పష్టం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యాంగ పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తాం
రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడిందని భాజపా ధ్వజమెత్తింది. తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. -
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
చెస్లో అగ్రస్థానానికి పోటీ పడే ముందు రాహుల్ గాంధీ ముందు రాయ్బరేలీలో గెలవాలని చెస్ లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ సలహా ఇచ్చారు. ఓ యూజర్ పోస్టుకు ఆయన స్పందించారు. -
ఇక అమేఠీలో ర్యాపిడ్ ఫైర్ ప్రచారాలే..!
అమేఠీలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ప్రచారాలే మిగిలిఉన్నాయి. హస్తం పార్టీకి దాదాపు రెండు వారాల సమయం మాత్రమే మిగిలిఉంది. ఈనేపథ్యంలో పార్టీ అభ్యర్థిని ప్రజల్లోకి ఎలా తీసుకెళతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
శివసేన గూటికి తిరిగొచ్చిన సంజయ్ నిరుపమ్
కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ నిరుపమ్ శివసేన (శిందే వర్గం)లో చేరారు. -
ఫోన్లలో మాట్లాడేందుకూ ప్రజలు భయపడుతున్నారు: శశి థరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అధికార భాజపాపై నిప్పులు చెరిగారు. -
ఉద్ధవ్ది ‘నకిలీ’ శివసేన: అమిత్ షా విమర్శలు
ఉద్ధవ్ ‘నకిలీ’ శివసేన నడుపుతున్నారని.. అసలైన పార్టీ శిందేతోనే ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. -
లాలూ కుమార్తెపై లాలూ పోటీ..!
లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్యపై లాలూ పోటీ చేస్తున్నారు. ఇది వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా.. దీనివెనక ఒక ఆసక్తికర విషయం ఉంది. -
ప్రియాంకా గాంధీ.. ఎందుకు పోటీ చేయట్లేదు?
లోక్సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీకి దూరంగా ఉండడానికి కారణం ఏమై ఉండవచ్చన్న అంశంపై చర్చ నడుస్తోన్న క్రమంలో ఆ పార్టీ స్పందించింది. -
‘వారసత్వం కాదు.. బాధ్యత’: రాహుల్ రాయ్బరేలీకి మారడంపై కాంగ్రెస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ అమేఠీ నుంచి రాయ్బరేలీకి మారడంపై విమర్శలు వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. దీనిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. -
రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
చెప్పానుగా.. కొత్త సీటు వెతుక్కుంటారని: రాహుల్పై మోదీ సెటైర్
రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోటీపై ప్రధాని మోదీ నుంచి స్పందన వచ్చింది. -
చివరి మొగల్ చక్రవర్తిలా రాహుల్ గాంధీ మిగిలిపోతారు..: భాజపా
అమేఠీ, రాయ్బరేలీ స్థానాల్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులపై సస్పెన్స్ వీడింది. దీంతో భాజపా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. -
25 ఏళ్లలో తొలిసారి.. అమేఠీని వదులుకున్న గాంధీలు..!
Amethi: అమేఠీ నియోజకవర్గం నుంచి కిశోరీ లాల్ శర్మ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. హస్తానికి మంచి పట్టున్న ఈ స్థానంలో గాంధీ కుటుంబసభ్యులు పోటీలో లేకపోవడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి. -
రాయ్బరేలీ బరిలో రాహుల్ గాంధీ.. అమేఠీ నుంచి కిశోరీ లాల్
Rahul Gandhi: రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నట్లు ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. -
రిజర్వేషన్లను రహస్యంగా లాక్కొంటున్న మోదీ సర్కార్: రాహుల్ గాంధీ
ప్రైవేటీకరణను గుడ్డిగా అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం రహస్యంగా లాక్కుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. -
ముందుగా చెప్పకుండానే అవకాశం..
కొన్నేళ్ల క్రితం ఓ యువకుడు తన సంగీతం, రచనలతో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత అందరూ ఆ విషయం మర్చిపోయారు. -
రాజ్పూత్లను శాంతపరిచేందుకు మోదీ కృషి
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్కోట్ లోక్సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలపై ఆగ్రహంతో ఉన్న రాజ్పూత్ (క్షత్రియ) వర్గాన్ని శాంతపరిచే చర్యలకు పూనుకున్నారు. -
నాకు ఎన్ని ఓట్లు వస్తే అన్ని మొక్కలు నాటుతా
పశ్చిమ బెంగాల్లోని ఘటల్ లోక్సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రముఖ బెంగాలీ నటుడు దేవ్ అలియాస్ దీపక్ అధికారి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఈసీపై విశ్వాసం ఉంచండి
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సమస్యాత్మకంగా మారిన డీప్ఫేక్ వీడియోల అంశాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) సమర్థంగా పరిష్కరించగలదన్న విశ్వాసాన్ని దిల్లీ హైకోర్టు వ్యక్తం చేసింది. -
సర్వేలు, పథకాల లబ్ధి సాకుతో ఓటర్ల వివరాల సేకరణపై ఈసీ ఆగ్రహం
ఎన్నికల అనంతరం వివిధ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతామంటూనో, సర్వేల సాకుతోనో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బ్రిజ్ భూషణ్ను పక్కనపెట్టిన భాజపా
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు ఈ లోక్సభ ఎన్నికల్లో టికెట్ దొరుకుతుందా? లేదా? అన్న ప్రశ్నకు తెరపడింది.
తాజా వార్తలు
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం