Y plus security: తల్లి కోసం ప్రచారం.. అజిత్ పవార్ తనయుడికి ‘వై ప్లస్’ భద్రత
బారామతి నుంచి పోటీ చేస్తోన్న తల్లి కోసం ఎన్నికల ప్రచారం చేస్తోన్న పార్థ్ పవార్కు మహారాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించింది.
పుణె: లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajith pawar) తనయుడు పార్థ్ పవార్కు మహారాష్ట్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో మావల్ సీటు నుంచి ఎన్సీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన ఆయన ప్రస్తుతం తన తల్లి సునేత్ర తరఫున చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పుణె పోలీస్ కమిషనర్ అమితేశ్కుమార్ వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా పార్థ్కు రక్షణ కల్పించినట్లు ఎన్సీపీ నేత ఒకరు తెలిపారు. బారామతి నుంచి బరిలో నిలిచిన తన తల్లి సునేత్ర పవార్ కోసం పార్థ్ ప్రజల్లో తిరుగుతున్నారని.. ఆయన దూకుడు ఉన్న నేత గనక మారుమూల ప్రాంతాలకు వెళ్లే సమయంలో భద్రతాపరమైన ఆందోళనలు ఉండటంతో ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించిందన్నారు. వై ప్లస్ భద్రత నాలుగో అత్యున్నత స్థాయి భద్రత. ఇందులో ఒకరిద్దరు కమాండోలతో కలిపి మొత్తంగా 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా భద్రత కల్పిస్తారు.
స్లో‘గన్’ అందుకుంటే పేలాల్సిందే.. జనాల్లో నాటుకుపోయిన నినాదాలివే!
సామాన్యులకే భద్రత లేదంటూ విమర్శలు
ఈ పరిణామంపై అజిత్ బంధువు, ఎన్సీపీ (ఎస్పీ) నేత రోహిత్ పవార్ స్పందించారు. రాజకీయ నాయకుల పిల్లలు, ఎమ్మెల్యేలు, సినీ నటులకు భద్రత కల్పించేందుకే డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రాధాన్యమిస్తున్నారు తప్ప సామాన్యుల భద్రతను విస్మరిస్తున్నారని విమర్శించారు. సంఘ విద్రోహశక్తుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్న సామాన్యుల్ని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పార్థ్ భద్రత కోసం రెండు ట్యాంకులను కూడా ఏర్పాటు చేయండి అంటూ రోహిత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక అమేఠీలో ర్యాపిడ్ ఫైర్ ప్రచారాలే..!
అమేఠీలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ప్రచారాలే మిగిలిఉన్నాయి. హస్తం పార్టీకి దాదాపు రెండు వారాల సమయం మాత్రమే మిగిలిఉంది. ఈనేపథ్యంలో పార్టీ అభ్యర్థిని ప్రజల్లోకి ఎలా తీసుకెళతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. -
శివసేన గూటికి తిరిగొచ్చిన సంజయ్ నిరుపమ్
కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ నిరుపమ్ శివసేన (శిందే వర్గం)లో చేరారు. -
ఫోన్లలో మాట్లాడేందుకూ ప్రజలు భయపడుతున్నారు: శశి థరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అధికార భాజపాపై నిప్పులు చెరిగారు. -
ఉద్ధవ్ది ‘నకిలీ’ శివసేన: అమిత్ షా విమర్శలు
ఉద్ధవ్ ‘నకిలీ’ శివసేన నడుపుతున్నారని.. అసలైన పార్టీ శిందేతోనే ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. -
లాలూ కుమార్తెపై లాలూ పోటీ..!
లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్యపై లాలూ పోటీ చేస్తున్నారు. ఇది వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా.. దీనివెనక ఒక ఆసక్తికర విషయం ఉంది. -
ప్రియాంకా గాంధీ.. ఎందుకు పోటీ చేయట్లేదు?
లోక్సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీకి దూరంగా ఉండడానికి కారణం ఏమై ఉండవచ్చన్న అంశంపై చర్చ నడుస్తోన్న క్రమంలో ఆ పార్టీ స్పందించింది. -
‘వారసత్వం కాదు.. బాధ్యత’: రాహుల్ రాయ్బరేలీకి మారడంపై కాంగ్రెస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ అమేఠీ నుంచి రాయ్బరేలీకి మారడంపై విమర్శలు వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. దీనిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. -
రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
చెప్పానుగా.. కొత్త సీటు వెతుక్కుంటారని: రాహుల్పై మోదీ సెటైర్
రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోటీపై ప్రధాని మోదీ నుంచి స్పందన వచ్చింది. -
చివరి మొగల్ చక్రవర్తిలా రాహుల్ గాంధీ మిగిలిపోతారు..: భాజపా
అమేఠీ, రాయ్బరేలీ స్థానాల్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులపై సస్పెన్స్ వీడింది. దీంతో భాజపా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. -
25 ఏళ్లలో తొలిసారి.. అమేఠీని వదులుకున్న గాంధీలు..!
Amethi: అమేఠీ నియోజకవర్గం నుంచి కిశోరీ లాల్ శర్మ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. హస్తానికి మంచి పట్టున్న ఈ స్థానంలో గాంధీ కుటుంబసభ్యులు పోటీలో లేకపోవడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి. -
రాయ్బరేలీ బరిలో రాహుల్ గాంధీ.. అమేఠీ నుంచి కిశోరీ లాల్
Rahul Gandhi: రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నట్లు ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. -
రిజర్వేషన్లను రహస్యంగా లాక్కొంటున్న మోదీ సర్కార్: రాహుల్ గాంధీ
ప్రైవేటీకరణను గుడ్డిగా అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం రహస్యంగా లాక్కుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. -
ముందుగా చెప్పకుండానే అవకాశం..
కొన్నేళ్ల క్రితం ఓ యువకుడు తన సంగీతం, రచనలతో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత అందరూ ఆ విషయం మర్చిపోయారు. -
రాజ్పూత్లను శాంతపరిచేందుకు మోదీ కృషి
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్కోట్ లోక్సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలపై ఆగ్రహంతో ఉన్న రాజ్పూత్ (క్షత్రియ) వర్గాన్ని శాంతపరిచే చర్యలకు పూనుకున్నారు. -
నాకు ఎన్ని ఓట్లు వస్తే అన్ని మొక్కలు నాటుతా
పశ్చిమ బెంగాల్లోని ఘటల్ లోక్సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రముఖ బెంగాలీ నటుడు దేవ్ అలియాస్ దీపక్ అధికారి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఈసీపై విశ్వాసం ఉంచండి
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సమస్యాత్మకంగా మారిన డీప్ఫేక్ వీడియోల అంశాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) సమర్థంగా పరిష్కరించగలదన్న విశ్వాసాన్ని దిల్లీ హైకోర్టు వ్యక్తం చేసింది. -
సర్వేలు, పథకాల లబ్ధి సాకుతో ఓటర్ల వివరాల సేకరణపై ఈసీ ఆగ్రహం
ఎన్నికల అనంతరం వివిధ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతామంటూనో, సర్వేల సాకుతోనో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బ్రిజ్ భూషణ్ను పక్కనపెట్టిన భాజపా
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు ఈ లోక్సభ ఎన్నికల్లో టికెట్ దొరుకుతుందా? లేదా? అన్న ప్రశ్నకు తెరపడింది. -
కురుక్షేత్ర భాజపా అభ్యర్థి నవీన్ జిందాల్ ఆస్తులు.. రూ.వెయ్యి కోట్లు
హరియాణాలోని కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ (54) గురువారం తన నామినేషను పత్రాలు దాఖలు చేశారు. -
ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ అసత్య ప్రచారం
అసత్య ప్రచారాలతో సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందని భాజపా ఆరోపించింది. భాజపాకు 400 సీట్లిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని పేర్కొంటూ గురువారం ఎన్నికల సంఘానికి (ఈసీ) కాషాయ పార్టీ ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్