Sandeshkhali: సందేశ్ఖాలీలో ఆయుధాలు వారే పెట్టి ఉంటారు: సీబీఐపై టీఎంసీ ఆరోపణలు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించడంపై అధికార టీఎంసీ పార్టీ స్పందించింది. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ (Sandeshkhali)లో సీబీఐ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల కమిషనర్ (EC)ను ఆశ్రయించింది. ఎన్నికల సమయం కావడంతో తమతో సహా ప్రతిపక్షాల ప్రచారాన్ని అడ్డుకునేందుకు కేంద్రంలోని భాజపా.. సీబీఐని ప్రయోగిస్తోందని ఆరోపించింది. ఈ వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు లేఖను అందించింది.
‘‘శాంతిభద్రత అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఎన్నికలు జరుగుతున్న వేళ.. సందేశ్ఖాలీలోని ఓ ప్రదేశంలో ఎలాంటి సమాచారం లేకుండా సీబీఐ ఉద్దేశపూర్వకంగా సోదాలు నిర్వహించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డుకు చెందిన బాంబ్ స్క్వాడ్తో సహా అదనపు బలగాలను దించింది. భారీ సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని సీబీఐ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి బాంబు స్వ్కాడ్ అందుబాటులో ఉంది. ఇది సీబీఐ చేసే ఆపరేషన్కు సహాయం చేయగలదు. కానీ, దర్యాప్తు సంస్థ మాత్రం ఎలాంటి సహాయం కోరలేదు’’ అని ఫిర్యాదులో పేర్కొంది.
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
‘‘ఒకవేళ ఆయుధాలను దర్యాప్తు సంస్థ రహస్యంగా అమర్చే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఆయుధాలు స్వాధీనం చేసుకొంది టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంట్లో అని మీడియాకు తప్పుడు సమాచారం అందించారు. ఓటర్లలో భయాందోళనలు సృష్టించేందుకే ఇదంతా చేస్తోంది. ఎన్నికల సమయంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలపై చర్యలు తీసుకోకుండా తక్షణమే మార్గదర్శకాలను జారీ చేయాలి. ఈసీ స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని కోరింది.
టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్ షేక్.. సందేశ్ఖాలీలోని మహిళలపై అత్యాచారం చేశారన్న కేసులో మరింత విచారణ జరపాలని కలకత్తా హైకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు షాజహాన్ షేక్ బంధువు ఇంటినుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివాదాస్పద వ్యాఖ్యలు.. ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా
కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఖర్గే ఆమోదించారు. -
కాంగ్రెస్పై భాజపా వివాదాస్పద పోస్టు.. జేపీ నడ్డాకు సమన్లు
కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ చేసిన వివాదాస్పద పోస్టుపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు సమన్లు అందాయి. -
మూడు విడతల్లోనూ ప్రజా మద్దతు మా వైపే: అఖిలేశ్ ధీమా
దేశంలో ఇప్పటివరకు జరిగిన మూడు విడతల ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు తమకు, ఇండియా కూటమికే ఉందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. -
ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి.. భార్యకు టికెట్
సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహతో.. లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేయాలని భావించాడు. లాలూ సూచన మేరకు లేటు వయసులో వివాహం చేసుకున్నాడు. -
ఓటేశారు.. ‘డైమండ్ రింగ్’ పట్టేశారు..
Lucky Draw for Voters: లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆ ఓటర్లకు బంపరాఫర్ తగిలింది. లక్కీ డ్రాలో కొందరు డైమండ్ రింగ్లను గెల్చుకున్నారు. -
రాహుల్.. వారి గురించి ఇప్పుడు మాట్లాడవే: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ తెలంగాణలోని వేములవాడ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. -
కంచుకోటలను కాపాడుకుంటారా.. అమేఠీ, రాయ్బరేలీలో ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రియాంక
అమేఠీ, రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలతో దూసుకెళ్తున్నారు. -
యూపీలో ఆఖరి దశ ఆసక్తికరం.. భాజపా, మిత్రపక్షాలకు కీలకం..
యూపీలో మూడు దశల్లో 26 నియోజకవర్టాల్లో పోలింగ్ ముగిసింది. మరో 54 స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. -
అమ్మ స్వర్గం నుంచే తమ్ముణ్ని ఆశీర్వదించి ఉంటుంది
‘‘అమ్మ ఈ లోకంలో లేకపోయినా, తప్పకుండా స్వర్గం నుంచే నరేంద్ర భాయీని ఆశీర్వదించి ఉంటుంది’’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో సోమాభాయీ మోదీ అన్నారు. -
పాకిస్థాన్ను సంతోషపరిచే వ్యక్తిని గెలిపించాలా.. లేదా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారు
పాకిస్థాన్ను సంతోషపరిచే నాయకుడిని ఎన్నుకోవాలా? లేక దేశాన్ని బలోపేతం చేసే నేతను గెలిపించాలా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారని భాజపా మంగళవారం పేర్కొంది. -
మూడో దశలో 64.58% పోలింగ్
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికల తృతీయ విడత పోలింగ్ మంగళవారం ముగిసింది. పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే.. అంతటా ఈ ప్రక్రియ ప్రశాంతంగానే జరిగింది. -
అబద్ధాలాడే వారిని తిరస్కరించండి: సోనియా
అబద్ధాలు చెప్పేవారిని, విద్వేషాన్ని రెచ్చగొట్టేవారిని ఈ ఎన్నికల్లో తిరస్కరించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పిలుపునిచ్చారు. అందరికీ సమానమైన, మెరుగైన అవకాశాలు లభించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. -
ముస్లిం రిజర్వేషన్లకు నేను అనుకూలం : లాలూ
ముస్లింలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందించేందుకు తాను అనుకూలమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్ వ్యాఖ్యానించారు. -
ఏడోదశ ఎన్నికలకు నోటిఫికేషన్
సార్వత్రిక ఎన్నికల సమరంలో చిట్టచివరిదైన ఏడో దశలో 57 లోక్సభ స్థానాల్లో జూన్ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహించడానికి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. -
జీఎస్టీని సవరిస్తాం.. అగ్నివీర్ను రద్దుచేస్తాం
సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)ను సవరించి ఒకే శ్లాబుగా చేయడంతో పాటు, సైనిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్ పథకాన్ని రద్దుచేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రకటించారు. -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రామ మందిరానికి ‘బాబ్రీ తాళం’
అయోధ్యలోని రామ మందిరానికి ‘బాబ్రీ తాళం’ వేయకుండా, కశ్మీర్లో ఆర్టికల్ 370 మళ్లీ తీసుకురాకుండా కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకే ఎన్డీయేకు 400 సీట్లు ఇవ్వాలని తాను కోరుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. -
ముస్లింలకు వ్యతిరేకం కాను : మోదీ
ఇస్లాంను, ముస్లింలను తాను వ్యతిరేకించనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమరం వాడీవేడిగా జరుగుతున్న తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రధాని ఈ విధంగా స్పందించారు. -
మేనల్లుడిపై మాయావతి వేటు
తన రాజకీయ వారసుడిగా ఉన్న మేనల్లుడు, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్పై పార్టీ అధ్యక్షురాలు మాయావతి వేటు వేశారు. -
భాజపాలోకి రాధికా ఖేడా
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడాతో పాటు నటుడు శేఖర్ సుమన్ భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జాతీయ మీడియా విభాగం ఇన్ఛార్జి అనిల్ బలూనీ సమక్షంలో వారు మంగళవారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. -
సంక్షిప్త వార్తలు (4)
సార్వత్రిక సమరానికి సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. -
ముగిసిన మూడోదశ.. 60 శాతం పోలింగ్ నమోదు
మూడో దశ ఎన్నికల్లో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు 60.19 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది.
తాజా వార్తలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్