PM Modi: టెక్ హబ్ను ట్యాంకర్ హబ్గా మార్చారు - కాంగ్రెస్పై మోదీ ధ్వజం
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని.. ఇదంతా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపించారు.
బాగల్కోట్: ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆరోపిస్తూనే అలా జరగనివ్వనని ఉద్ఘాటించారు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీలు భాజపా వైపు ఉన్నందున మైనార్టీలను బుజ్జగించాలని హస్తం పార్టీ చూస్తోందన్నారు. కర్ణాటకలోని బాగల్కోట్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. స్థానిక అధికార ప్రభుత్వం స్వల్ప కాలంలోనే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు.
‘‘కర్ణాటకలో వెనకబడిన వర్గాల హక్కులను కాలరాసి రాజ్యాంగాన్ని మార్చే ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు రాజ్యాంగం అంగీకరించదు. కానీ, కర్ణాటక ప్రభుత్వం మాత్రం ఓబీసీ రిజర్వేషన్లలో కొంత భాగాన్ని ముస్లింలకు కేటాయించింది. ఈతరహా రిజర్వేషన్ల కల్పనకు చట్టం తీసుకువస్తామని గతంలో పేర్కొన్న కాంగ్రెస్.. ఈసారి మ్యానిఫెస్టోలోనూ అటువంటి సంకేతాలే ఇస్తోంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఏదేమైనా ఆ పార్టీ ప్రయత్నాలను ఫలించనివ్వనన్నారు. మీ హక్కులు, రిజర్వేషన్లు కాపాడేందుకు ఎంతవరకైనా వెళ్తానని.. దళితులు, ఆదివాసీ, ఓబీసీలకు ఇదే నా గ్యారంటీ అని హామీ ఇచ్చారు.
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. స్వల్ప కాలంలోనే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం చట్టసభ సభ్యులకు సమయానికి నిధులు అందే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్.. ‘ప్రభుత్వాన్ని’ నడపటం లేదని, వసూల్ గ్యాంగ్ను నడుపుతోందని ఆరోపించారు. కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. టెక్ హబ్గా ఉన్న బెంగళూరును ట్యాంకర్ హబ్గా మార్చిందని ఎద్దేవా చేశారు. తద్వారా ట్యాంకర్ మాఫియాకు సాయం చేస్తోందని, ఆ కమీషన్ పార్టీకి చేరుతోందని ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. -
స్వాతీ మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ ఇంటి ముందు భాజపా నిరసన
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్పై జరిగిన దాడికి వ్యతిరేకంగా భాజపా అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగింది. -
నాలుగు దశలు దాటాక ఇండియా కూటమి బలపడింది: ఖర్గే
ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించనుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. నాలుగు దశల్లో ముగిసిన పోలింగ్లో బలంగా పుంజుకొందని తెలిపారు. -
ఆ రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారు: మోదీ
తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. తనకు ఎంతోమంది ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. -
కంగనా ఆస్తుల విలువ రూ.90 కోట్లు
మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనకు రూ.90 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు నామినేషన్ పత్రాల్లో ప్రకటించారు. -
యూపీలో కాంగ్రెస్కు ఎర్రటోపీ బాసట
ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్కు సమాజ్వాదీ పార్టీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. సీట్ల పంపకంలో భాగంగా యూపీలో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. -
ప్రచార తారలు ఆదర్శంగా ఉండాలి
సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన మూడు దశల్లో జాతీయ పార్టీల ప్రచార తారలు (స్టార్ క్యాంపెయినర్లు) ఇతరులకు ఆదర్శంగా మెలగాలని, సమాజంలో సున్నితమైన కూర్పును పాడుచేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. -
రాయ్బరేలీ, అమేఠీలు మా కర్మభూమి
ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీ అంటే తమ దృష్టిలో కేవలం లోక్సభ నియోజకవర్గాలు మాత్రమే కావని, అవి తమ కర్మభూమి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. -
దేశంలో మోదీ హవా ఏమీ లేదు: జైరాం రమేశ్
దేశంలో ప్రధాని నరేంద్రమోదీ హవా ఏమీ లేదని, ఆయనకు తెలిసిందల్లా వ్యవస్థలను నాశనం చేయడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. -
మోదీకి నా చేతివంట రుచి చూపిస్తా: మమత
ప్రధాని మోదీకి తన చేతివంట రుచి చూపిస్తానని, చిన్నప్పటినుంచి తనకు వండటం అలవాటేనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చెప్పారు. -
ఎన్నికల్లో పోటీ చేయకుండా మోదీని నిషేధించాలంటూ వ్యాజ్యం
తన ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ..విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నందున ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. -
కాంగ్రెస్ వస్తే.. మళ్లీ గుడారానికి రాముడు
అయోధ్య రాముణ్ని మళ్లీ గుడారానికి పంపాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. -
సీఏఏ అమలును మమత అడ్డుకోలేరు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును మమతాబెనర్జీ ఎప్పటికీ అడ్డుకోలేరు. మతువాలతోపాటు శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వకుండా ప్రపంచంలో ఏ శక్తీ ఆపజాలదు. -
ఎన్డీయే నేతలు వెంట రాగా.. వారణాసిలో ప్రధాని నామినేషన్
సార్వత్రిక ఎన్నికల సమరంలో వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీకి ప్రధాని మోదీ మంగళవారం నామినేషను దాఖలు చేశారు. -
సినీనటి కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతంటే?
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటి, భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ మంగళవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. -
సొంతిల్లు లేదు.. కారు లేదు.. మోదీ ఆస్తులు ఎంతంటే..?
ప్రధాని నరేంద్ర మోదీకి రూ.3 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు. ఇప్పటివరకు సొంతంగా ఇల్లు, కారు లేదని వెల్లడించారు. -
ఓటేస్తే ‘డెమోక్రసీ డిస్కౌంట్’.. పలు రెస్టారంట్ల వినూత్న ఆఫర్!
లోక్సభ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ముంబయిలోని పలు రెస్టారంట్లు వినూత్న ఆఫర్ ప్రకటించాయి. -
మోదీకి నా వంట రుచి చూపిస్తా.. దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Mamata Banerjee: ప్రధాని మోదీకి తన చేతి వంట రుచి చూపిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. అసలేం జరిగిందంటే..? -
ప్రసంగాలను సరిదిద్దుకోండి.. అగ్ర నేతలకు ‘ఈసీ’ సూచన!
ఎన్నికల వేళ ఆయా పార్టీల అగ్ర నేతల నుంచి జనం మంచి ప్రసంగాలను ఆశిస్తారని.. దీంతో నాయకులు ఈమేరకు నడుచుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే