icon icon icon
icon icon icon

రాజకీయాల్లో కొనసాగేందుకే ఇక్కడికి వచ్చా: యూసుఫ్‌ పఠాన్‌

తాను రాజకీయాల్లో కొనసాగేందుకే ఇక్కడకు వచ్చానని, స్థానిక ప్రజల కోసమే పని చేస్తానని మాజీ క్రికెటర్‌, టీఎంసీ నేత యూసుఫ్‌ పఠాన్‌ పేర్కొన్నారు.

Published : 22 Apr 2024 04:08 IST

కోల్‌కతా: తాను రాజకీయాల్లో కొనసాగేందుకే ఇక్కడకు వచ్చానని, స్థానిక ప్రజల కోసమే పని చేస్తానని మాజీ క్రికెటర్‌, టీఎంసీ నేత యూసుఫ్‌ పఠాన్‌ పేర్కొన్నారు. గుజరాత్‌కు చెందిన ఆయన.. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌కు ప్రత్యర్థిగా బరిలో ఉన్నారు. అన్నిరకాల క్రికెట్‌ ఫార్మాట్‌ల నుంచి 2021లోనే రిటైరైన పఠాన్‌.. ప్రస్తుతం బహరాంపుర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ‘స్థానికులు నన్ను సొంత మనిషిగా భావిస్తున్నారు. ఎన్నికల ఫలితం ఎలా వచ్చినా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంటాను. గెలుస్తానని నమ్మకం ఉంది’ అని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూసుఫ్‌ పఠాన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img