ప్రత్యేక బోడోలాండే ఎజెండా
ప్రత్యేక బోడోలాండ్ డిమాండుతోపాటు అభివృద్ధి అంశాలే ఎజెండాగా అస్సాంలోని 5 నియోజకవర్గాల్లో ఈ నెల 26వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనుంది. నగావ్, దరాంగ్-ఉదాల్గురీ, దిఫూ (ఎస్టీ), సిల్చర్ (ఎస్సీ), కరీంగంజ్లలో ఎన్నికలు జరగనున్నాయి.
పౌరసత్వం, అభివృద్ధి అంశాలూ ముఖ్యమే
అస్సాంలో రెండో విడత పోలింగ్కు సిద్ధం
5 నియోజకవర్గాల్లో పోటాపోటీ
ప్రత్యేక బోడోలాండ్ డిమాండుతోపాటు అభివృద్ధి అంశాలే ఎజెండాగా అస్సాంలోని 5 నియోజకవర్గాల్లో ఈ నెల 26వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనుంది. నగావ్, దరాంగ్-ఉదాల్గురీ, దిఫూ (ఎస్టీ), సిల్చర్ (ఎస్సీ), కరీంగంజ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రత్యేక రాష్ట్రం డిమాండుతోపాటు పౌరసత్వం, విదేశీయుల రాకపై నిరసన, నిరుద్యోగం, వరదలు, పేదరికం, అభివృద్ధి ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి.
మత రాజకీయాల కరీంగంజ్
కరీంగంజ్లో మత రాజకీయాలదే ముఖ్య పాత్ర. ఇక్కడ కృపానాథ్ మల్లాను భాజపా బరిలోకి దించింది. ఏఐయూఎఫ్ తరఫున సహబుల్ ఇస్లాం చౌధురి, కాంగ్రెస్ తరఫున హఫీజ్ రషీద్ అహ్మద్ చౌధురి పోటీ చేస్తున్నారు. భాజపా అభివృద్ధి ఎజెండాతో ప్రచారం చేస్తోంది. సమాన అభివృద్ధి అవకాశాలను కల్పిస్తానని మైనారిటీలకు సిటింగ్ ఎంపీ మల్లా హామీ ఇస్తున్నారు. ఇక్కడ 86.84 శాతం మంది బెంగాలీ మాట్లాడతారు. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 56.4శాతం, హిందువులు 42.5శాతం ఉన్నారు.
మత, ప్రాంతీయ అస్తిత్వ పోరాట దరాంగ్-ఉదాల్గురీ
మత, ప్రాంతీయ అస్తిత్వ పోరాటాలకు కేంద్రంగా దరాంగ్-ఉదల్గురీ నియోజకవర్గం నిలుస్తోంది. మంగల్దోయ్గా ఉండే ఇది డీలిమిటేషన్ తర్వాత దరాంగ్-ఉదల్గురీగా మారింది. 1979 నుంచి ఆరేళ్లపాటు విదేశీయుల వ్యతిరేక ఉద్యమం ఈ ప్రాంతంలో సాగింది. బంగ్లాదేశ్ వలసలకు వ్యతిరేకంగా ఇది సాగింది. ప్రస్తుతం హిందు, ముస్లిం, క్రిస్టియన్ల సంగమంగా ఈ నియోజకవర్గం ఉంది. ఇందులో సగం ప్రాంతం బోడోలాంగ్ ప్రాంతీయ రీజియన్లో (బీటీఆర్), మిగతా సగం దాని బయట ఉంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) తలపడుతున్నాయి. బోడోలాండ్ ఇక్కడ ప్రధాన ఎన్నికల అంశంగా ఉంది. ఇక్కడ పేదరికం, నిరుద్యోగం, వరదలు, రోడ్ల సమస్యలున్నాయి.
స్వతంత్ర రాష్ట్ర హోదా డిమాండుతో దిఫూ
రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ను బలోపేతం చేసి ఆర్టికల్ 244 (ఎ) కింద అస్సాంలోని కొండ ప్రాంత జిల్లాలకు స్వతంత్ర రాష్ట్ర హోదా ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండు చేస్తున్నారు. దిఫూలో ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. భాజపా, కాంగ్రెస్, స్వతంత్ర రాష్ట్ర డిమాండు కమిటీ (ఏఎస్డీసీ), గణ సురక్ష పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తున్నారు. కర్బీ ఆంగ్లాంగ్ ప్రాంతంలో చాలామంది ప్రజలు వెదురుతో నిర్మించిన ఇళ్లలోనే నివసిస్తున్నారు. నిరుపేదలైన వారికి ఎన్నికలప్పుడు మద్యం, మాంసం పంపిణీ చేసి ఓట్లు వేయించుకుంటున్నాయని స్వతంత్ర అభ్యర్థి కతర్ ఆరోపించారు.
పౌరసత్వ సమస్యల నగావ్
నగావ్లో పౌరసత్వ సమస్యతోపాటు పేదరికం, నిరుద్యోగం ఉన్నాయి. డీలిమిటేషన్తో ఈ నియోజకవర్గంలో ముస్లింల జనాభా 50శాతం దాటింది. వలస ముస్లింల సంఖ్య ఇక్కడ అధికం. 2019లో గెలిచిన ఈ సీటును మళ్లీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక్కడ 51శాతం ముస్లింలు, 49 శాతం హిందువులు ఉన్నారు. అయితే ఇక్కడ ఏఐయూడీఎఫ్ పోటీలో ఉండటంతో కాంగ్రెస్ మైనారిటీ ఓటు బ్యాంకుకు గండి పడవచ్చని భావిస్తున్నారు. జనం మాత్రం అభివృద్ధి, నిరుద్యోగం, పేదరికం అంశాలనే ప్రధానమైనవిగా భావిస్తున్నారు.
సరైన సౌకర్యాల్లేని సిల్చర్
సిల్చర్లో రాష్ట్ర మంత్రి పరిమళ్ శుక్లాబైద్యను భాజపా బరిలోకి దింపింది. ఆయనపై కాంగ్రెస్ యువ నేత సూర్య కాంత సర్కార్ పోటీ చేస్తున్నారు. తృణమూల్ పార్టీ నుంచి రాధేశ్యామ్ బిశ్వాస్ బరిలోకి దిగారు. బారక్ లోయలో అభివృద్ధే ప్రధాన అంశంగా ఉంది. అక్కడి ప్రజలు ఇప్పటికీ సరైన సౌకర్యాలను నోచుకోలేదు. హాఫ్లాంగ్ నుంచి రోడ్డు పనులు చేపట్టినా ఇంకా పూర్తి కాలేదు. బారక్లో చాలా రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో వివక్ష ప్రధాన సమస్యని స్థానికుడొకరు తెలిపారు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలిచ్చామని ప్రభుత్వం చెబుతోందని, బారక్ లోయలోని వారికి అందులో ఒక శాతం కూడా దక్కలేదని చెబుతున్నారు. ఆర్థిక, ఉద్యోగ, సాంస్కృతిక రంగాల్లో ఈ ప్రాంతం వెనుకబడింది. దీంతో ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర డిమాండు అధికంగా ఉంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్