సంక్షిప్త వార్తలు (7)
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదు. భారత్జోడో యాత్ర చేపట్టిన రాహుల్గాంధీ- ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 తర్వాత ‘కాంగ్రెస్ ఢూండో’ (కాంగ్రెస్ను వెతకండి) యాత్ర చేపట్టాల్సి వస్తుంది.
చివరకు కాంగ్రెస్ ఢూండో యాత్ర
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదు. భారత్జోడో యాత్ర చేపట్టిన రాహుల్గాంధీ- ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 తర్వాత ‘కాంగ్రెస్ ఢూండో’ (కాంగ్రెస్ను వెతకండి) యాత్ర చేపట్టాల్సి వస్తుంది. రెండుదశల పోలింగ్లో కాంగ్రెస్ ఎక్కడా లేదు. భాజపా మాత్రం సెంచరీ కొట్టి 400+ సీట్ల దిశగా దూసుకుపోతోంది.
యూపీలోని బరేలీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా
బలిదానమే మా నాన్నకొచ్చిన ఆస్తి
మా నాన్న రాజీవ్గాంధీ తన తల్లి నుంచి ఆస్తిని కాకుండా బలిదానాన్ని వారసత్వంగా స్వీకరించారు. మా నానమ్మ ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలర్పించారు. అదే రీతిలో నా తండ్రి ప్రాణాలు కోల్పోయారు. వంశపారంపర్య రాజకీయాలంటూ ఇందిర వంటి మహిళ గురించి అర్థరహితంగా మాట్లాడడమే తప్పిస్తే మా కుటుంబం చేసిన త్యాగాలను ప్రధాని మోదీ అర్థం చేసుకోలేరు. వంచకులుగా దూషించినా, కేసులు పెట్టినా, ఇళ్లు ఖాళీ చేయించినా, ఆఖరికి చంపినా సరే మాకున్న దేశభక్తిని ఎవరూ మా హృదయాల్లోనుంచి తొలగించలేరు.
మధ్యప్రదేశ్లోని మురైనాలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ
మాకు బుల్డోజర్ల అవసరం రాలేదు
మేం అధికారంలో ఉన్నప్పుడు ఉత్తర్ప్రదేశ్లో శాంతిభద్రతలు కాపాడడానికి ప్రస్తుత సర్కారు మాదిరిగా బుల్డోజర్ల అవసరం రాలేదు. హిందూ-ముస్లింల మధ్య అల్లర్లకే మేం ఆస్కారమివ్వలేదు. అన్ని మతాలను, అన్ని విశ్వాసాలను గౌరవించాం.
యూపీలోని మైన్పురీలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి
భర్త అడుగుజాడల్లో వెళ్తా
అన్యాయాలు, నియంతృత్వ శక్తులపై పోరాటంలో భర్త అడుగుజాడల్లో వెళ్తా. విలువలతో రాజీపడకుండా ఆయన జైలుకు వెళ్లారు. తలొగ్గడమనేది గిరిజనుల డీఎన్యేలోనే లేదు. నా భర్తను అక్రమంగా అరెస్టు చేశారు. ఆయన అమాయకుడు. ముందస్తు కుట్రతో ఆయన్ను ఇరికించారు. ఈడీ ప్రతాపమంతా విపక్షనేతలపైనే ఎందుకు ఉంటోందో నాకు అర్థం కావడం లేదు.
పీటీఐ ఇంటర్వ్యూలో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ భార్య కల్పనా సోరెన్
ఆర్జేడీ అంటే అవినీతి, ఆటవిక పాలన
లాలూప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో ఆర్ అంటే రిశ్వత్ఖోర్ (అవినీతి), జె అంటే జంగిల్రాజ్ (ఆటవిక రాజ్యం), డీ అంటే దల్దల్ (మురికిగుంట). దేశంలో అవినీతి నిర్మూలనకు ప్రధాని మోదీ శ్రమిస్తుంటే విపక్ష సంకీర్ణం మాత్రం అవినీతిపరుల్ని రక్షించే ప్రయత్నాలు చేస్తోంది. కుటుంబపాలనకు అది మారుపేరు. కాంగ్రెస్, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్ నేతలు వేర్వేరు కుంభకోణాల్లో ఉన్నారు. అహంకార (ఘమండియా) కూటమికి మరోపేరు.. అవినీతి.
బిహార్లోని అరరియా, ముజఫర్పుర్ సభల్లో భాజపా అధ్యక్షుడు నడ్డా
మోదీ వాస్తవాలు చెప్పరు.. దృష్టి మళ్లిస్తారు
ప్రధాని మోదీ ప్రసంగాల్లో వాస్తవాలు, వాస్తవికత ఉండవు. ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన అంశాల గురించి మాట్లాడకుండా ఆయన దృష్టి మళ్లిస్తారు. ఇలాంటి ప్రధానిని ఇంతకుముందు చూడలేదు. మోదీ ఎక్కువగా ప్రచారంలో పాల్గొనేందుకే మహారాష్ట్రలో పోలింగ్ను ఐదు దశలకు విస్తరించారు. ఇండియా కూటమి నెగ్గితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసుకువస్తుందని ప్రధాని పదేపదే చెప్పడం వెనక ఉద్దేశం సమాజంలో ఉద్రిక్తత రేకెత్తించడమే.
కొల్హాపుర్లో మీడియాతో ఎన్సీపీ (శరద్చంద్రపవార్) అధ్యక్షుడు శరద్ పవార్
భాజపాకు 400 ఓ జోక్.. 200 కూడా సవాలే
ప్రస్తుత ఎన్నికల్లో 400 పైగా సీట్లు సాధిస్తామని భాజపా చెప్పుకోవడం ఓ జోక్. 300 దాటడమే అసాధ్యం. 200 తెచ్చుకోవడమూ సవాలే. దిగువసభలో మెజారిటీని భాజపా కోల్పోవడం ఖాయం. కేరళ, తమిళనాడు, ఏపీలో ఒక్కసీటూ ఆ పార్టీకి రాదు. కర్ణాటక, తెలంగాణలలో సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోవడం కష్టమే. వారికి దక్షిణాది మొత్తంమీద 2019 కంటే దారుణమైన ఫలితాలే వస్తాయి. దేశంలో ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన 190 స్థానాల్లో మాకు గొప్ప ప్రభంజనం ఉందని చెప్పను. ప్రభుత్వానికి అనుకూలంగా లేదనేది మాత్రం కచ్చితంగా వాస్తవం. మేం అనుకున్నదానికంటే చాలా ముందంజలో ఉన్నాం.
పీటీఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!