రాజ్యాంగాన్ని 80సార్లు సవరించిన కాంగ్రెస్
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని 80 సార్లు సవరించింది. ఇప్పుడేమో మేం రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రచారం చేస్తోంది.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని 80 సార్లు సవరించింది. ఇప్పుడేమో మేం రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రచారం చేస్తోంది. రాజ్యాంగాన్ని మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. కాంగ్రెస్ అనుసరించిన తప్పుడు ఆర్థిక విధానాలే ప్రజల్ని పేదరికంలో ఉంచాయి.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
మోదీతో ప్రజాస్వామ్యానికి ముప్పు
ప్రధాని మోదీ వల్ల పార్లమెంటుకు, ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉంది. అలాంటి వారితో పొత్తు పెట్టుకోవడానికి మేం ఇష్టపడం. దిల్లీ సీఎం కేజ్రీవాల్, ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ల అరెస్టు వెనుక కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉంది.
పుణెలో విలేకరులతో ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్
పాక్ అంటే భాజపా నేతలకు ప్రేమ
అధికార పార్టీ భాజపాకు పాకిస్థాన్ అంటే ప్రేమ. ఎలాంటి ఆహ్వానం అందుకోకుండానే ప్రధాని మోదీ 2015లో ఆకస్మికంగా ఆ దేశ పర్యటనకు వెళ్లారు. పాక్ జాతిపిత మహమ్మద్ అలీజిన్నాను లౌకికవాదిగా ఆడ్వాణీ 2005లో చెప్పారు. వాజ్పేయీ పాక్కు బస్సుయాత్ర చేశారు. ఇదంతా చరిత్రలో లిఖితమైంది. భాజపా బలం ఉత్తరాదిలో సగానికి పడిపోతుంది. దక్షిణాన తుడిచిపెట్టుకుపోతుంది.
పీటీఐ ఇంటర్వ్యూలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘెల్
ప్రచార ‘టెంపో’ మావైపే ఉంది
లోక్సభ సీట్లలో సగానికి పైగా స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల ప్రచార ‘టెంపో’ (లయ) మావైపే ఉంది. పవనాలన్నీ విపక్షం వైపే వీస్తున్నాయి.
కాంగ్రెస్ నేత శశిథరూర్ (కాంగ్రెస్కు టెంపోల్లో డబ్బు అందిందన్న ప్రధాని ఆరోపణపై)
టీఎంసీ అంటే తుష్టీకరణ్, మాఫియా, కరప్షన్
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)లో టీ అంటే తుష్టీకరణ్ (బుజ్జగింపు), ఎం అంటే మాఫియా, సి అంటే కరప్షన్ (అవినీతి). మా.. మాటీ.. మనుష్ నినాదం కాస్తా ముల్లా.. మదర్సా.. మాఫియాలా మారింది. సందేశ్ఖాలీ ఘటనపై మమతాబెనర్జీ మౌనం వహించారు. దోషులు నేలమాళిగల్లో దాక్కొన్నా వదిలిపెట్టం. చొరబాటుదారులకు ఆమెకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతిస్తున్నారు. శరణార్థ హిందువులు, సిక్కులకు మాత్రం పౌరసత్వం ఇవ్వొద్దని అంటున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రతీ అంగుళం భారత్దే. జేఎంఎం సర్కారు అనేక కుంభకోణాల్లో ఇరుక్కుంది. పేదల డబ్బు కట్టలుకట్టలుగా బయటపడుతోంది.
పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్ సభల్లో కేంద్రమంత్రి అమిత్ షా
అవినీతిలో కూరుకున్న విపక్షం
విపక్ష ఇండియా కూటమి అంటే అవినీతిపరుల కూడిక. దేశం వృద్ధిపథాన దూసుకువెళ్లాలంటే కమలానికే ఓటువేయాలి. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, భారాస.. ఇవన్నీ అవినీతిలో కూరుకుపోయాయా లేదా? కేజ్రీవాల్, సిసోదియా, సత్యేందర్ జైన్ ఎక్కడున్నారు? రాహుల్, సోనియా, హుడ్డా, లాలూ బెయిల్పై ఉన్నారా లేదా? కుటుంబ రాజకీయాలే తప్పిస్తే ప్రజల గురించి విపక్షాలకు పట్టదు.
హరియాణాలోని పంచ్కులాలో భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
హైదరాబాద్కు తిరిగిరావద్దని ప్రభాకర్రావుకు చెప్పించారు: మంత్రి కోమటిరెడ్డి
-
‘నన్ను జైలుకు పంపితే..’ ట్రంప్ పరోక్ష హెచ్చరిక!
-
లబ్డబ్.. లబ్డబ్.. ఏపీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ
-
అందరి చూపు.. ఆంధ్రా వైపు.. ఎన్నికల ఫలితాలపై హైదరాబాద్లో చర్చలు..
-
కౌంటింగ్ కేంద్రాల్లో అవాంతరాలు కల్పిస్తే బయటకు పంపండి: సీఈవో ముకేశ్కుమార్ మీనా
-
పెరగనున్న బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాల భర్తీ