Rajeev Chandrasekhar: ఓటు వేయలేదన్న కేంద్ర మంత్రి.. విపక్షాల విమర్శలు
Rajeev Chandrasekhar: లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తన ఓటుహక్కును వినియోగించుకోలేదు. దీంతో ఆయనపై విపక్షాలు పలు విమర్శలు గుప్పించాయి.
తిరువనంతపురం: లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) భాగంగా శుక్రవారం రెండోవిడత పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్లో పలు రంగాల ప్రముఖులతో పాటు సామాన్య పౌరులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) ఓటు వేయకపోవడం విమర్శలకు దారితీసింది.
రాజీవ్ చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం (Thiruvananthapuram) స్థానం నుంచి భాజపా (BJP) అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, అతని ఓటు మాత్రం బెంగళూరులో ఉంది. ఈ రెండు స్థానాలకు ఏప్రిల్ 26నే పోలింగ్ జరిగింది. దీంతో తాను బరిలో ఉన్న స్థానంలో ఎన్నికల పర్యవేక్షణలో ఉన్న ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
‘‘ఎన్నికల వేళ తిరువనంతపురంలో ఉండటానికే నేను అధిక ప్రాధాన్యమిచ్చా. ఈ ఎన్నికలు చరిత్ర సృష్టించబోతున్నాయని విశ్వసిస్తున్నా. అందుకే పోలింగ్ రోజున ఈప్రాంత ప్రజలకు ప్రతినిధిగా ఇక్కడ ఉండటం నా కర్తవ్యంగా భావించా. అయితే గత కొన్నేళ్లుగా బెంగళూరులో ఓటుహక్కు వినియోగించుకుంటున్న నేను ఈసారి ఓటు వేయకపోవడం బాధనిపించింది. దీనికి ఎంతగానో చింతిస్తున్నా. సరైన సమయంలో నా ఓటును ఇక్కడికి బదిలీ చేసుకోవడం సాధ్యపడలేదు. అందుకే, ఈసారి ఎన్నికల్లో ఓటు వేయలేకపోయా’’ అని రాజీవ్ వెల్లడించారు.
ఎడ్లబళ్లలో.. చక్రాల కుర్చీల్లో.. నిబద్ధత చాటుకున్న ఓటర్లు
అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ‘‘ఓటు వేయడం అనేది ప్రతీ పౌరుడి ప్రాథమిక హక్కుతో పాటు బాధ్యత కూడా. అనుకుంటే ఆయన హెలికాప్టర్లో వెళ్లి ఓటు వేసి ఇక్కడికి రావొచ్చు. కానీ ఇలా పోలింగ్కు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే’’ అని సీపీఎం, సీపీఐ నేతలు దుయ్యబట్టారు.
తిరువనంతపురం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ గత మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ ఆయన మరోసారి బరిలో నిలిచారు. దీంతో థరూర్కు గట్టి పోటీనిచ్చేందుకే భాజపా ఈ కేంద్రమంత్రిని నిలబెట్టింది. కేరళలో భాజపా ఇప్పటివరకు ఒక్క లోక్సభ సీటు కూడా గెలవలేదు. ఈసారి రాజీవ్ చంద్రశేఖర్తో ఎలాగైనా ఈ రాష్ట్రంలో ఖాతా తెరవాలని కమలదళం తీవ్రంగా ప్రయత్నించింది. కేరళలో మొత్తం 20 స్థానాలకు ఒకేవిడతలో శుక్రవారం పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
72 ఏళ్లలో ముగ్గురు మహిళలే లోక్సభకు
హిమాచల్ప్రదేశ్ నుంచి గత 72 సంవత్సరాలలో ముగ్గురు మహిళలు మాత్రమే లోక్సభకు ఎన్నికయ్యారు. -
రాహుల్ ఇటలీకి పోవాల్సిందే.. కేంద్ర హోంమంత్రి అమిత్షా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఈ ఎన్నికల్లో రాయ్బరేలీలో ఓడిపోవడం ఖాయం. స్థిరపడడానికి ఆ తర్వాత ఇటలీ వెళ్లాల్సిందే. -
అయిదో దశ బరిలో 695 మంది అభ్యర్థులు
సార్వత్రిక ఎన్నికల అయిదో విడతలో భాగంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. -
మూడోవిడతలో 65.68% పోలింగ్
సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో మొత్తంగా 65.68% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. -
అదానీ, అంబానీపైకి ఈడీని పంపండి
పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలు తమ పార్టీకి టెంపోలో నల్లధనాన్ని పంపారో లేదో అన్న విషయమై దర్యాప్తునకు సీబీఐ లేదా ఈడీలను పంపాలని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాలు విసిరారు. -
పోలింగు నమోదుపై స్పష్టతకు నేడు ఈసీతో విపక్ష నేతల భేటీ
లోక్సభ ఎన్నికల పోలింగు ప్రతి దశలోనూ వాస్తవ గణాంకాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్న విపక్ష ఇండియా కూటమి నేతలు గురువారం ఎన్నికల సంఘాన్ని కలుసుకొని ఆ మేరకు విన్నవించనున్నారు. -
సంక్షిప్త వార్తలు (6)
పంజాబ్లోని మరో మూడు లోక్సభ స్థానాలకు భాజపా బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. -
ఊహలపైనే మోదీ ప్రసంగాలు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. -
కాంగ్రెస్లో విలీనంపై పవార్ వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయమే
మరో రెండేళ్లలో పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు మరింత సన్నిహితం కావచ్చు లేదా విలీనం కావచ్చని ఎన్సీపీ (ఎస్సీపీ) అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయమని విపక్ష ‘ఇండియా’ కూటమి భాగస్వాములైన ఆప్, సీపీఐ బుధవారం స్పందించాయి. -
ముంగేర్ ఆర్జేడీ లోక్సభ అభ్యర్థికి లేటు వయసులో ‘ఎన్నికల’ పెళ్లి!
ఒక కరడుగట్టిన నేరగాడి ఆగడాలు.. పోలీసులు అతణ్ని పట్టుకున్న వైనాన్ని తెలుపుతూ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా రాసిన ‘బిహార్ డైరీస్’ పుస్తకం ఆధారంగా ‘ఖాకీ’ వెబ్సిరీస్ నిర్మించారు. -
ముస్లింల రిజర్వేషన్పై కార్టూన్ వీడియో.. భాజపా నేతలు నడ్డా, మాల్వియాలకు నోటీసులు
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాలకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
వివాదాస్పద వ్యాఖ్యలు.. ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా
కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఖర్గే ఆమోదించారు. -
కాంగ్రెస్పై భాజపా వివాదాస్పద పోస్టు.. జేపీ నడ్డాకు సమన్లు
కాంగ్రెస్ను ఉద్దేశిస్తూ చేసిన వివాదాస్పద పోస్టుపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు సమన్లు అందాయి. -
మూడు విడతల్లోనూ ప్రజా మద్దతు మా వైపే: అఖిలేశ్ ధీమా
దేశంలో ఇప్పటివరకు జరిగిన మూడు విడతల ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు తమకు, ఇండియా కూటమికే ఉందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. -
ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి.. భార్యకు టికెట్
సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహతో.. లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేయాలని భావించాడు. లాలూ సూచన మేరకు లేటు వయసులో వివాహం చేసుకున్నాడు. -
ఓటేశారు.. ‘డైమండ్ రింగ్’ పట్టేశారు..
Lucky Draw for Voters: లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆ ఓటర్లకు బంపరాఫర్ తగిలింది. లక్కీ డ్రాలో కొందరు డైమండ్ రింగ్లను గెల్చుకున్నారు. -
రాహుల్.. వారి గురించి ఇప్పుడు మాట్లాడవే: ప్రధాని మోదీ
ప్రధాని మోదీ తెలంగాణలోని వేములవాడ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. -
కంచుకోటలను కాపాడుకుంటారా.. అమేఠీ, రాయ్బరేలీలో ప్రచారాన్ని భుజానకెత్తుకున్న ప్రియాంక
అమేఠీ, రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ సుడిగాలి పర్యటనలతో దూసుకెళ్తున్నారు. -
యూపీలో ఆఖరి దశ ఆసక్తికరం.. భాజపా, మిత్రపక్షాలకు కీలకం..
యూపీలో మూడు దశల్లో 26 నియోజకవర్టాల్లో పోలింగ్ ముగిసింది. మరో 54 స్థానాలకు నాలుగు దశల్లో పోలింగ్ జరగనుంది. -
అమ్మ స్వర్గం నుంచే తమ్ముణ్ని ఆశీర్వదించి ఉంటుంది
‘‘అమ్మ ఈ లోకంలో లేకపోయినా, తప్పకుండా స్వర్గం నుంచే నరేంద్ర భాయీని ఆశీర్వదించి ఉంటుంది’’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో సోమాభాయీ మోదీ అన్నారు. -
పాకిస్థాన్ను సంతోషపరిచే వ్యక్తిని గెలిపించాలా.. లేదా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారు
పాకిస్థాన్ను సంతోషపరిచే నాయకుడిని ఎన్నుకోవాలా? లేక దేశాన్ని బలోపేతం చేసే నేతను గెలిపించాలా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారని భాజపా మంగళవారం పేర్కొంది.
తాజా వార్తలు
-
ఐపీఓకు గో డిజిట్ ఇన్సూరెన్స్.. విరుష్క జోడీ వాటాలు వదులుకుంటున్నారా?
-
హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్
-
రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
-
‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం
-
కేఎల్తో సంజీవ్ గోయెంకా సీరియస్ చాటింగ్ .. నెట్టింట హాట్ టాపిక్
-
విజయ్ దేవరకొండ బర్త్డే స్పెషల్.. మూడు సినిమాల అప్డేట్స్ ఇవే..