LS Polls: ప్రధాని ఎవరైనా.. మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్: చిదంబరం
ప్రధాని నరేంద్ర మోదీని ‘అతిశయోక్తుల నేత’గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం విమర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి పదవిలో ఎవరున్నా సరే.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం (Chidambaram) అన్నారు. భవిష్యత్తులో కచ్చితంగా జరగబోయే పరిణామాన్నే తన ‘గ్యారంటీ’గా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రచారం చేసుకుంటున్నారని, ఆయనో ‘అతిశయోక్తి నేత’ అని విమర్శించారు. భారత్ తన జనాభాతో ఈ ఘనత సాధిస్తుందని, అందులో మ్యాజిక్ ఏమీ లేదని ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
‘‘జీడీపీపరంగా 2004లో భారత్ ప్రపంచంలో 12వ స్థానంలో ఉంది. 2014 నాటికి ఏడో స్థానానికి చేరుకుంది. 2024లో ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పుడు కూడా ప్రధానిగా ఎవరున్నా.. మూడో స్థానానికి చేరుకుంటుంది. ఇందులో ఎటువంటి మాయాజాలం లేదు. మనకున్న జనాభాతోనే ఇది సాధ్యమవుతుంది’’ అని చిదంబరం పేర్కొన్నారు. ‘‘ఒక దేశపు జీడీపీ పరిమాణం దాని ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలకు నిజమైన కొలమానం కాదు. తలసరి ఆదాయం కచ్చితమైన సూచిక. అయితే, ఈ విషయంలో దేశం చాలా వెనుకబడి ఉంది’’ అని తెలిపారు.
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ‘సీఏఏ’ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కకుపెట్టిందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘ఈ వివాదాస్పద చట్టాన్ని పార్టీ వ్యతిరేకిస్తోంది. దీనికి సంబంధించిన కేసులు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉన్నాయి. తీర్పు ఆధారంగా తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తాం’’ అని చెప్పారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే జమ్మూ-కశ్మీర్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని తెలిపారు. ‘‘ఆర్టికల్ 370 విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే తుది తీర్పును వెలువరించింది. దాంతో ఏకీభవించవచ్చు.. లేదా, అంగీకరించకపోవచ్చు. కానీ అది చట్టం’’ అని అన్నారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆ నేతకు ఏ రాష్ట్రంలోనూ రాజకీయ పునాదులు లేవని, ఒకవేళ తమిళనాడులో పోటీ చేసి ఉంటే ఘోరంగా ఓడిపోయేవారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికల సమరంలో భాజపాకు అతిపెద్ద ఆయుధం.. ఎన్నికల బాండ్ల ద్వారా కూడగట్టిన డబ్బేనని ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగాల్కు మోదీ 5 గ్యారంటీలు
తాను అధికారంలో ఉన్నంత కాలం మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. -
‘నోటా’ ఓట్లు 50 శాతం దాటితే మాత్రం..! మాజీ సీఈసీ ఏమన్నారంటే..
ఇందౌర్ స్థానంలో ‘నోటా’కు ఓటేయాలంటూ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అయితే, ఎన్నికల ఫలితాలపై ‘నోటా’ ప్రభావం నామమాత్రమేనని మాజీ సీఈసీ ఓపీ రావత్ తెలిపారు. -
అణుబాంబులకు రాహుల్ భయపడతారేమోగానీ..: అమిత్ షా
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారత్దేనని, దాన్ని తిరిగి తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
ఉత్కంఠ పోరుకు సర్వం సిద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో బరిలో ప్రముఖులు వీరే..!
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. -
సీఎం, మాజీ సీఎం ‘మార్నింగ్ వాక్’.. ఓటేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి
ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు నేతలు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా మార్నింగ్వాక్కు వెళ్లి అక్కడి ప్రజల్ని కలిసి ఓట్లు అభ్యర్థించారు. -
‘పార్టీనే నన్ను తొలుత మోసం చేసింది’.. అజ్ఞాతం వీడిన సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి
ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న కుంభానీ చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చారు. పార్టీని మోసం చేశానని ఇన్నాళ్లూ తనను దూషిస్తున్నారని, వాస్తవంగా పార్టీనే తనను మోసం చేసిందని పేర్కొన్నారు. -
కాంగ్రెస్కు ‘యువరాజు’ వయసు కంటే తక్కువ సీట్లు : ఎద్దేవా చేసిన ప్రధాని మోదీ
కాంగ్రెస్కు ఈ సారి చరిత్రలో ఎన్నడూ రానన్ని తక్కువ సీట్లు వస్తాయని ప్రధాని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పాలన అవినీతి మయంగా మారిందన్నారు. -
14న మోదీ నామినేషన్.. ఏర్పాట్లు మొదలుపెట్టిన భాజపా
ప్రధాని మోదీ నామినేషన్కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. -
మీ ఓటు ఎవరైనా వేస్తే.. ఏం చేయాలో తెలుసా?
మన ఓటు కూడా వేరే వారు వేస్తే కచ్చితంగా మన హక్కును సాధించుకోవాల్సిందే. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం 1961లో సెక్షన్49(పి)ను అమల్లోకి తెచ్చింది. -
ఉచిత కరెంటు, విద్య, వైద్యం.. కేజ్రీవాల్ 10 గ్యారంటీలు!
Kejriwal: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 10 హామీలను అమలు చేస్తామని ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. -
నేను బయటుండేది 21 రోజులే.. జూన్ 2న జైలుకెళ్లాలి: కేజ్రీవాల్
తాను అరెస్టు అయిన తర్వాత పార్టీ మరింత బలపడిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నేడు ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. -
ఖర్గే హెలికాప్టర్ తనిఖీ.. ఈసీని ప్రశ్నించిన కాంగ్రెస్!
ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) హెలికాప్టర్ను పోలింగ్ అధికారులు తనిఖీ చేశారు. -
మీరేమైనా విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థా?.. రాహుల్కు స్మృతి ఇరానీ సూటి ప్రశ్న
Smriti Irani: మోదీతో చర్చకు సిద్ధమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఏ హోదాలో ప్రధానితో చర్చకు వస్తారని ప్రశ్నించారు. -
తదుపరి సర్కారు ఏర్పాటు మోదీకి దుర్లభం: ఖర్గే
కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ ఏర్పాటు చేయడం అత్యంత కష్టమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. -
ఇందిర నుంచి మోదీ నేర్చుకోవాలి: ప్రియాంక
తనను దుర్భాషలాడారంటూ ప్రధాని మోదీ కన్నీరు పెట్టుకోవడానికి బదులు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ధైర్యం, దృఢ సంకల్పం వంటి లక్షణాలను అలవర్చుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సూచించారు. -
విమర్శలను మోదీ తట్టుకోలేరు: పవార్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలను తట్టుకోలేరని, అదే సమయంలో ఇతరులకు వ్యతిరేకంగా మాత్రం ఏదైనా మాట్లాడతారని ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు శరద్పవార్ శనివారం విమర్శించారు. -
మేమొస్తే.. మోదీయే అయిదేళ్లూ ప్రధాని
తాము మళ్లీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీయే అయిదేళ్ల పూర్తికాలంపాటు ప్రధానమంత్రిగా కొనసాగుతారని భాజపా అగ్ర నాయకులు ఉద్ఘాటించారు. -
నాలుగో దశ ప్రచారానికి తెర
సార్వత్రిక ఎన్నికల సమరంలో నాలుగో దశలో 96 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న జరగాల్సిన పోలింగ్కు ప్రచార గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. -
కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా గల్లంతు
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని, ప్రతిపక్ష పార్టీ హోదాను సైతం కోల్పోవడం ఖాయమని ప్రధాని మోదీ అన్నారు. -
‘నోటా’ కోసం కాంగ్రెస్ విస్తృత ప్రచారం.. ఇందౌర్లో విచిత్ర పరిస్థితి!
-
బహిరంగ చర్చకు సిద్ధమే.. ప్రధాని స్పందనేంటో చెప్పండి: రాహుల్ గాంధీ
లోక్సభ ఎన్నికలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.
తాజా వార్తలు
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు