Congress: కాంగ్రెస్కు ఇందౌర్ అభ్యర్థి షాక్.. నామినేషన్ వెనక్కి తీసుకుని భాజపాలో చేరిక
Congress: ఇందౌర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు. పోటీ నుంచి వైదొలిగి భాజపాలో చేరారు.
ఇందౌర్: లోక్సభ ఎన్నికల (Lok sabha Elections) వేళ కాంగ్రెస్ (Congress)కు గట్టి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్లోని ఇందౌర్ (Indore) లోక్సభ స్థానంలో హస్తం పార్టీ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ అనూహ్యంగా పోటీ నుంచి వైదొలిగారు. చివరి నిమిషంలో తన నామినేషన్ను వెనక్కి తీసుకోవడమే గాక.. పార్టీని వీడి భాజపా (BJP)లో చేరారు.
ఇందౌర్ లోక్సభ నియోజకవర్గానికి నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు నేడే (ఏప్రిల్ 29) ఆఖరి తేదీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అక్షయ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆయన వెంట భాజపా ఎమ్మెల్యే రమేశ్ మెండోలా ఉండటం గమనార్హం.
అక్షయ్ కాషాయ పార్టీలో చేరిన విషయాన్ని రాష్ట్ర మంత్రి, భాజపా నేత కైలాశ్ విజయ్వర్గియ ధ్రువీకరించారు. ఆయనతో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్ చేసి పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇందౌర్ నుంచి భాజపా తరఫున సిట్టింగ్ ఎంపీ శంకర్ లల్వానీ బరిలో ఉన్నారు. బీఎస్పీతో పాటు స్వతంత్రులు కొంతమంది ఇక్కడ పోటీ చేస్తున్నారు.
సింధియాల పోరు.. తల్లి ఓటమి కోసం ప్రచారం చేసిన వేళ!
ఇప్పుడు భాజపాకు ప్రధాన పోటీదారు అయిన కాంగ్రెస్ అభ్యర్థి వెనక్కి తగ్గడంతో శంకర్ విజయం దాదాపు ఖాయమైనట్లే కన్పిస్తోంది. అయితే, ఈ సాయంత్రం వరకు పోటీలో ఉన్న ఇతరులు కూడా నామినేషన్లను ఉపసంహరించుకుంటే సూరత్ తరహాలోనే ఇక్కడ కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.
ఇటీవల గుజరాత్లోని సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే పోటీలో ఉన్న ఇతరులు కూడా నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు. దీంతో భాజపా నేత ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా గెలుపొందినట్టు ఆర్వో ప్రకటించడంతో లోక్సభ ఎన్నికల్లో భాజపాకు తొలి విజయం దక్కినట్లయ్యింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుసగా మూడోసారి.. వారణాసి నుంచి నామినేషన్ వేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ (Modi) నేడు వారణాసి (Varanasi) నుంచి నామినేషన్ వేశారు. ఈ సమయంలో ఆయన వెంట పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీఏ నేతలు ఉన్నారు. -
మోదీ మరోసారి నెగ్గితే ఇక ఎన్నికలనేవే ఉండవు
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ నెగ్గి, కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే ఇక భవిష్యత్తులో ఎన్నికలే ఉండవని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. -
బతుకుల్ని మార్చనున్న కాంగ్రెస్ గ్యారంటీలు
తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ (గ్యారంటీ)లతో మహిళల జీవితాలు మారిపోతాయని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ చెప్పారు. -
48 గంటల్లోగా ఓటింగ్ వివరాల వెల్లడిపై విచారణ 17న
లోక్సభ ఎన్నికల ప్రతి దశలోనూ ఓటింగ్ ముగిసిన 48 గంటల్లోగా పోలింగ్ శాతాల సమగ్ర సమాచారాన్ని వెల్లడించేలా ఆదేశించాలన్న పిటిషన్పై ఈ నెల 17న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. -
ముస్లింల ఓట్లు పోతాయనే అయోధ్యకు రాహుల్ రాలేదు
ముస్లిం ఓట్లు పోతాయనే భయంతోనే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాహుల్గాంధీ హాజరుకాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. -
నేడు మోదీ నామినేషనుకు సీఎంలు, ఎన్డీయే మిత్రులు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రధాని మోదీ మంగళవారం నామపత్రాలు దాఖలు చేయనుండగా.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే మిత్రపక్షాల నేతలు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. -
కంచుకోటల్లో అంతా తానై..
ఉత్తర్ప్రదేశ్లో దశాబ్దాలుగా గాంధీ కుటుంబ కంచుకోటలుగా నిలిచిన రాయ్బరేలీ, అమేఠీ లోక్సభ నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీని విజయతీరానికి చేర్చే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. -
అది పిరికివాళ్ల కూటమి
విపక్ష ఇండియా కూటమి నేతలు పిరికివాళ్లని, అందుకే పాకిస్థాన్ అణు సామర్థ్యాన్ని చూసి భయపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. -
నాలుగో విడతలోనూ మాకే భారీ మద్దతు: మోదీ
భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థులకు భారీ మద్దతు లభిస్తోందని, విపక్ష కూటమి కనీసం ప్రజల చర్చల్లో కూడా లేదని సోమవారం నాలుగోవిడత లోక్సభ ఎన్నికల పోలింగు ముగిసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. -
మోదీ మళ్లీ గెలవాలని శ్రీరాముడి అభిలాష
ప్రధాని నరేంద్రమోదీ మరోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. తనకు వీరభక్తుడైన మోదీ విజయం సాధించాలని శ్రీరాముడి అభిలాష కూడా. -
నాలుగో విడతలో 67.70%
సార్వత్రిక ఎన్నికల్లో మరో కీలక విడత పూర్తయింది. నాలుగో దశలో భాగంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 నియోజకవర్గాల్లో పోలింగ్ సోమవారం దాదాపు ప్రశాంతంగానే ముగిసింది. -
‘రాహుల్తో చర్చకు యువమోర్చా నేతను పంపుతాం’
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో బహిరంగ చర్చకు యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాశ్ను పంపుతామని, దీనిపై రాహుల్ తన సంసిద్ధతను తెలపాలని కర్ణాటకకు చెందిన భాజపా ఎంపీ తేజస్వీ సూర్య వెల్లడించారు. -
మీ హామీల అమలుకయ్యే ఖర్చెంతో తెలుసా?
కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల అమలుకు అయ్యే వ్యయం గురించి ఆ పార్టీకి తెలుసా అని భాజపా నేత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. -
స్ట్రెచర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
బిహార్కు చెందిన ఓ మహిళ నడవలేని స్థితిలోనూ తన ఓటు హక్కును వినియోగించుకుని పౌరులందరికీ ఆదర్శంగా నిలిచారు. -
మోదీకి వీడ్కోలుకు ఇక 3 వారాలే: కాంగ్రెస్
లోక్సభ ఎన్నికల్లో నాలుగో దశ ముగిసిన తర్వాత భాజపా గ్రాఫ్ మరింత తిరోగమనంలో ఉందని, దీంతో ప్రధాని మోదీ శిబిరం నైరాశ్యంలో మునిగిపోయిందని కాంగ్రెస్ పేర్కొంది. -
‘ఇండియా’ అధికారంలోకి వస్తే జూన్ 5నే బయటకు వస్తా
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే జూన్ 5నే తాను తిహాడ్ జైలు నుంచి విడుదలవుతానని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. -
స్వేచ్ఛాయుత ఎన్నికలంటే ఇవా?: ఒమర్
జమ్మూకశ్మీర్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించలేదంటూ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. -
హేమంత్ సోరెన్కు బెయిల్ నిరాకరణ
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం నిరాకరించింది. -
‘మోదీ మరోసారి విజయం సాధిస్తే..’: కాంగ్రెస్ అధినేత ఖర్గే
భాజపా మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని.. ఒకవేళ మోదీ మళ్లీ విజయం సాధిస్తే భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. -
‘నా ఓటు ఎవరో వేశారు..’ కాంగ్రెస్ నేతకు ‘టెండర్ ఓటు’ అవకాశం
Maharashtra: తనకంటే ముందు తన ఓటు ఎవరో వేశారని పుణె కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. అనంతరం టెండర్ ఓటు ద్వారా ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
‘ఆ నోట్ల గుట్టలకు 70 ట్రక్కులు కావాలి’: ఈడీ సోదాలపై మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: ఈడీ సోదాలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ గట్టిగా తిప్పికొట్టారు. ప్రజల సొమ్మును దోచుకునే ప్రయత్నాలకు తాను అడ్డుగోడలా నిలబడతానని అన్నారు.
తాజా వార్తలు
-
‘ఆ మాటలు సరికాదు’: ఐఎంఏ చీఫ్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం
-
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు
-
విమానాల రద్దు.. భర్త కడసారి చూపునకు దూరమై!
-
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
-
దిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
వైట్హౌస్లో ‘సారే జహాసె అచ్ఛా..’ ‘పానీపూరీ’ల విందు