LS polls: ‘ఓటు వేయండి - లడ్డూ, దోశ ఉచితంగా తినండి’!
ఓటు వేసి వచ్చిన వారికి దోశ, లడ్డూ, కాఫీతో పాటు ఇతర ఆహార పదార్థాలను బెంగళూరు హోటళ్లు ఉచితంగా లేదా సబ్సిడీ రూపంలో అందజేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘంతోపాటు ఇతర సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం వివిధ భాగస్వామ్య పక్షాలతో కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరులోని వివిధ హోటళ్లు ఇందుకు శ్రీకారం చుట్టాయి. ఓటు వేసి వచ్చినవారికి దోశ, లడ్డు, కాఫీతో పాటు ఇతర ఆహార పదార్థాలను ఉచితంగా లేదా సబ్సిడీ రూపంలో అందజేశాయి. దీంతో పలు రెస్టారంట్ల వద్ద భారీ సంఖ్యలో జనం క్యూ కట్టిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
బెంగళూరు నగరంలో పోలింగ్ శాతాన్ని పెంచే ఉద్దేశంతో బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ (బీబీహెచ్ఏ)కు అనుబంధంగా ఉన్న పలు రెస్టారంట్లు తమవంతు ప్రయత్నం చేయాలని భావించాయి. ఇందులోభాగంగా ఓటు వేసి వచ్చినవారికి ఉచితంగా ఆహార పదార్థాలు అందించగా.. మరికొన్ని మాత్రం బిల్లులో డిస్కౌంట్ ఇచ్చాయి. నృపతుంగా రోడ్డులో ఉన్న నిసర్గ గ్రాండ్ హోటల్.. ఓటు వేసి వచ్చినవారికి బటర్ దోశ, లడ్డూ, జ్యూస్ వంటివి ఉచితంగా అందించింది. ‘ఓటు వేయండి-ఫుడ్ తినండి’ అనే నినాదంతో వీటిని అందించింది. దీంతో ఉదయం నుంచే అనేకమంది ఓటర్లు హోటల్ ముందు బారులు తీరారు. దాదాపు 2వేల మందికి వీటిని ఫ్రీగా అందించారట.
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
నగరంలోని అనేక రెస్టారంట్లు, బేకరీలు.. వినోద కేంద్రాలు, పార్కులు, ర్యాపిడో వంటి టాక్సీ సర్వీసులు కూడా 20 నుంచి 30శాతం డిస్కౌంట్ ప్రకటించాయి. అంతేకాదు అనేక బార్లు కూడా ఇటువంటి ఆఫర్తో ముందుకొచ్చాయి. కొన్ని బార్లు (పరిమిత సంఖ్యలో కస్టమర్లకు) బీర్లను ఉచితంగా ఇస్తామని ప్రకటించగా, మరికొన్ని డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపాయి. అయితే, పోలింగ్ రోజు వైన్స్, బార్లు మూసివేసి ఉన్నందున, మరుసటి రోజు (శనివారం) ఈ ఆఫర్ ఇవ్వనున్నట్లు సమాచారం.
గత లోక్సభ ఎన్నికల్లో బెంగళూరులో పోలింగ్ 54శాతంగా నమోదైంది. ఈవిషయాన్ని ప్రస్తావించిన బీబీహెచ్ఏ అధ్యక్షుడు పీసీ రావు.. ఎంతోమంది ఉన్నత విద్యావంతులు ఉన్న ఈ నగరంలో పోలింగ్ శాతం తక్కువగా ఉండటం నిరాశ కలిగించే అంశమన్నారు. అందుకే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తమవంతు ప్రయత్నంగా ఈ ఐడియాతో ముందుకు వచ్చామన్నారు. ఇందుకోసం కర్ణాటక హైకోర్టు నుంచి అనుమతి పొందినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ నిబంధనలకు లోబడి వీటిని అమలుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే, కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉండగా.. రెండో దశలో భాగంగా 14 సీట్లలో శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. బెంగళూరు సౌత్, సెంట్రల్, నార్త్, రూరల్ నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదవ్ల కంచుకోటలో బిహార్ సీఎం నీతీశ్కు పరీక్ష..!
మాధేపుర నియోజకవర్గంలో మరోసారి జేడీయూ అభ్యర్థిని గెలిపించుకోవడం.. బిహార్ సీఎం నీతీశ్కుమార్ నాయకత్వానికి పరీక్షగా మారింది. -
అమితాబ్ తర్వాత అంతటి గౌరవం దక్కింది నాకే : కంగనా
సినీ పరిశ్రమలో తాను అమితాబ్ బచ్చన్తో సమానమైన గౌరవాన్ని పొందానని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
33 ఏళ్లుగా రాజకీయ వైరం.. అక్కడ ఆ రెండు కుటుంబాల మధ్యే పోటీ!
కర్ణాటకలో శివమొగ్గ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు దశాబ్దాలుగా ప్రధానంగా రెండు కుటుంబాల మధ్యే ఇక్కడ పోటీ నెలకొంది. -
రాజకీయ క్రీడాకలాపం!
మన దేశంలో రాజకీయాలకు, క్రీడలకు అవినాభావ సంబంధం ఉంది. ఎందరో క్రీడాకారులు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన సందర్భాలున్నాయి. -
గుజరాత్లో ‘గాంధీ’ వ్యూహం..!
రాజకీయాల్లో నెగ్గడానికి ఒక్కో రాజకీయ నేత ఒక్కో వ్యూహం అనుసరిస్తారు. గుజరాత్లో నవ్సారీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కూడా తాను నెగ్గడానికి ఓ ప్రణాళిక తయారు చేసుకున్నారు. -
ముస్లింలకు ఒక్క సీటూ ఇవ్వని కాంగ్రెస్
గుజరాత్ లోక్సభ ఎన్నికల్లో 35 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఒక్కరూ ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం లేదు. -
కాంగ్రెస్ మీడియా సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా
కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా చేశారు. అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించినందుకు పార్టీ నేతల నుంచి తాను వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు ఆమె ఆరోపించారు. -
తెల్ల టీషర్టే ఎందుకు ధరిస్తానంటే?
రాజకీయ ప్రత్యర్థుల పరస్పర విమర్శలు, ఆరోపణలతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గరంగరంగా మారిన వేళ.. ఆ వేడి నుంచి ఉపశమనం కలిగించటానికా అన్నట్లు కాంగ్రెస్ పార్టీ..రెండు నిమిషాలకు మించిన నిడివి గల ఓ వీడియోను విడుదల చేసింది. -
మూడోదశ ప్రచారానికి తెర
సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడోదశ కింద 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 94 స్థానాలకు మంగళవారం జరగబోయే పోలింగుకు సంబంధించి ప్రచార పర్వానికి ఆదివారం సాయంత్రం తెరపడింది. -
మతపరమైన రిజర్వేషన్లతో మరోమారు దేశ విభజన ముప్పు
‘‘కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన.. ఇలా ఏ పథకమైనా వివక్ష లేకుండా అందరికీ అందుతున్న విషయాన్ని ముస్లిం సోదర సోదరీమణులు గమనిస్తున్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలవారి నుంచి రిజర్వేషన్లను లాక్కొని.. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు వాటిని ఇవ్వడమే కాంగ్రెస్ ఎజెండా. -
కేజ్రీవాల్ గొంతు నొక్కేయడానికే అరెస్టు
ఎన్నికలకు ముందు గొంతు నొక్కేయాలన్న ఉద్దేశంతోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. -
సొంత పార్టీ నేతపై ‘విమర్శ’
హిమాచల్ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో కాస్త గందరగోళానికి గురయ్యారు. -
సందేశ్ఖాలీ కుట్ర బయటపడింది: మమత
పశ్చిమబెంగాల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే సందేశ్ఖాలీ ఘటనలపై భాజపా అసత్య ప్రచారం చేసిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. -
కంగారులో కంగనా.. సొంత పార్టీ నేతపైనే విమర్శలు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ కాస్త గందరగోళానికి గురయ్యారు. తేజస్వీ యాదవ్పై విమర్శలు గుప్పించే ప్రయత్నంలో తమ పార్టీ నేత తేజస్వీ సూర్యపై ఆరోపణలు చేశారు. -
దిల్లీ ప్రజలు భాజపాకు ఓటుతో సమాధానం చెప్తారు: ఆప్
తమ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మద్దతుగా ఆప్ దిల్లీలో వాకథాన్ నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆప్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. -
గాంధీ కుటుంబానికి నేనేం సేవకుడిని కాదు: అమేఠీ కాంగ్రెస్ అభ్యర్థి
తనను గాంధీ కుటుంబానికి ప్యూన్గా అభివర్ణించిన భాజపాపై కాంగ్రెస్ అమేఠీ అభ్యర్థి కేఎల్ శర్మ స్పందించారు. -
నాలుగో విడత బరిలో 476 మంది కోటీశ్వరులే.. టాప్-3 ఎవరంటే?
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తులు, కేసులు, ఇతర వివరాలను ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. -
పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు: రాజ్నాథ్
Rajnath Singh: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాజపా నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పీవోకే, రిజర్వేషన్లు, రాజ్యాంగంలో మార్పుల వంటి పలు అంశాలపై స్పందించారు. -
ఆ రాష్ట్రంలో లోక్సభ బరిలో 12 మంది ఎమ్మెల్యేలు.. గెలిస్తే మరోసారి ఎన్నికలు
పంజాబ్లో 12 మంది ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో ఆప్ నుంచి 9 మంది ఉన్నారు. -
డబ్బుల్లేవ్... పోటీ చేయలేను
ఎన్నికల్లో పోటీకి సరిపడా డబ్బులు తన వద్ద లేవని..ఎన్నికల బరిలో ఉండలేనంటూ ఒడిశాలోని పూరీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మహంతి తన టికెట్ను తిరస్కరించారు.
తాజా వార్తలు
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు